Vir Vikram Yadav: డీజీసీఏ చీఫ్గా కొత్త అధికారిగా వీర్ విక్రమ్ యాదవ్ నియామకం
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.పౌర విమానయాన నియంత్రణ సంస్థ అయిన పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్(డీజీసీఎ)కి కొత్త చీఫ్గా సీనియర్ ఐఏఎస్ అధికారి వీర్ విక్రమ్ యాదవ్ ను నియమించింది. ఇదే సమయంలో భారీ పరిపాలనా మార్పుల్లో భాగంగా 25మంది సివిల్ సర్వెంట్లను వివిధ శాఖలకు బదిలీ చేసింది. మంగళవారం చేపట్టిన ఈ కీలక నిర్ణయాల్లో భాగంగా,అదనపు కార్యదర్శి స్థాయి హోదాల్లో పలువురు అధికారులను కొత్త బాధ్యతల్లో నియమించింది. ఈ చర్యలు కేంద్ర ప్రభుత్వ పరిపాలనలో మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా కనిపిస్తున్నాయి. ఈ మార్పుల్లో భాగంగా,పునీత్ కన్సల్ ను పౌర విమానయాన మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా నియమించారు. అలాగే విశాల్ గగన్ ను సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ కార్యదర్శిగా నియమించారు.
వివరాలు
వ్యవసాయ పరిశోధనా విభాగంలో అదనపు కార్యదర్శిగా జ్ఞానేంద్ర డి. త్రిపాఠి
మరోవైపు జ్ఞానేంద్ర డి. త్రిపాఠిను భారత వ్యవసాయ పరిశోధనా మండలి అయినభారత వ్యవసాయ పరిశోధన మండలి(ICAR) కార్యదర్శిగా,అలాగే వ్యవసాయ పరిశోధనా విభాగంలో అదనపు కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. ఒడిశా క్యాడర్కు చెందిన 1996 బ్యాచ్ ఐఏఎస్ అధికారి వీర్ విక్రమ్ యాదవ్ ప్రస్తుతం పర్యావరణ, అటవీ,వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆయనకు ఉన్న పరిపాలనా అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కీలక బాధ్యతలను అప్పగించినట్లు సమాచారం. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులు,పాలనా అవసరాలు దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఈ భారీ స్థాయి బదిలీలను చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయాలు ప్రభుత్వ యంత్రాంగం పనితీరును మరింత వేగవంతం చేయడంలో కీలక పాత్ర పోషించనున్నాయి.