KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్పై లైంగిక ఆరోపణలు.. కేసు నమోదు
వ్రాసిన వారు
Jayachandra Akuri
Sep 21, 2025
12:07 pm
ఈ వార్తాకథనం ఏంటి
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్కు ఇవాళ బిగ్ షాక్ తగిలింది. ఆయనపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. వివరాల్లోకి వెళితే పాల్ ఆఫీసులో పనిచేస్తున్న ఒక యువతి తనను లైంగికంగా వేధిస్తున్నారని షీ టీమ్కు తెలిపింది. యువతి, లైంగిక వేధింపులకు సంబంధించిన అధారాలను షీ టీమ్కు అందచేసిందని పేర్కొన్నారు. ఈ ఆధారాలను పరిశీలించిన షీ టీమ్, కేసును పంజాగుట్ట పోలీస్స్టేషన్కు ట్రాన్స్ఫర్ చేసింది.