NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Rapaka Varaprasad: వైసీపీలో అవమానం.. పార్టీని వీడేందుకు సిద్ధమైన రాపాక వరప్రసాద్ 
    తదుపరి వార్తా కథనం
    Rapaka Varaprasad: వైసీపీలో అవమానం.. పార్టీని వీడేందుకు సిద్ధమైన రాపాక వరప్రసాద్ 
    వైసీపీలో అవమానం.. పార్టీని వీడేందుకు సిద్ధమైన రాపాక వరప్రసాద్

    Rapaka Varaprasad: వైసీపీలో అవమానం.. పార్టీని వీడేందుకు సిద్ధమైన రాపాక వరప్రసాద్ 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 14, 2024
    12:58 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది.

    అప్పటి నుంచి రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం, ఆయన వైసీపీని వీడేందుకు సిద్ధమయ్యారు.

    కత్తిమండల నివాసంలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇక కొనసాగనని ఆయన స్పష్టం చేశారు.

    తాను పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానని, కానీ వైసీపీ తనకు అవమానం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

    రాజోలులో కష్టపడినప్పటికీ, తనకు టికెట్ ఇవ్వకపోవడం ఇవ్వలేదు. గొల్లపల్లి సూర్యారావుకు టికెట్ ఇవ్వడం బాధించిందని, కావున పెద్దల సూచన మేరకు ఎంపీగా పోటీ చేశానని ఆయన వెల్లడించారు.

    Details

    జనసేనలో చేరేందుకు ప్రయత్నాలు!

    వరప్రసాద్ త్వరలోనే మరో పార్టీలో చేరుతానని ప్రకటించారు, అయితే ఏ పార్టీలో చేరతారనే విషయంలో స్పష్టత ఇవ్వలేదు.

    సమాచారం ప్రకారం, ఆయన జనసేన పార్టీలో తిరిగి చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.

    అయితే, స్థానిక జనసేన నేతలు, కార్యకర్తలు ఆయన రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. 2019లో రాపాక వరప్రసాద్ జనసేన తరఫున రాజోలు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

    ఆ తర్వాత వైసీపీలో చేరిన ఆయన, జనసేనకు సంబంధించి చేసిన విమర్శల వల్ల అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు.

    Details

    జనసేన సమావేశానికి హాజరైన రాపాక

    తాజాగా, అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురంలో జరిగిన జనసేన సమావేశంలో రాపాక వరప్రసాద్ పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది.

    రాపాక పార్టీ వేదికపై కనిపించడం ద్వారా జనసేన కార్యకర్తలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

    ఇక రాజోలు జనసేనలో రాపాకకు తిరిగి ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం మీద స్థానిక జనసేన ఎమ్మెల్యే దేవ వర ప్రసాద్ స్పందించారు.

    మలికిపురంలో కాలేజీ లెక్చరర్ల అంశంపై రాపాక మాట్లాడారని, అయితే రాజకీయ అంశాలు ఏమీ చర్చించలేదని ఆయన క్లారిటీ ఇచ్చారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ
    జనసేన

    తాజా

    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్
    PBKS vs RR: వధేరా-శశాంక్ విధ్వంసం.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం రాజస్థాన్ రాయల్స్
    Liquor Prices: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన ధరలు తెలంగాణ
    Russia drone attacks: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి: ఒకేసారి 273 డ్రోన్లు ప్రయోగం ఉక్రెయిన్-రష్యా యుద్ధం

    వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ

    విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి కోరిన వైఎస్ జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి  వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    ఏపీలో ఆదర్శ వివాహం.. కుమార్తెకు దగ్గరుండి పెళ్లి జరిపించిన వైసీపీ ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్
    కుప్పంలో మంత్రి పెద్దిరెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకున్న సొంత పార్టీ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
    వచ్చే ఎన్నికల్లో కొంతమంది ఎమ్మెల్యేలకు టిక్కెట్లు రాకపోవచ్చు: సీఎం జగన్  ఆంధ్రప్రదేశ్

    జనసేన

    జగన్ మాదిరిగా మేం ఆలోచించం : మౌన దీక్షలో పవన్ కల్యాణ్  పవన్ కళ్యాణ్
    బీజేపీతో జనసేన తెగదెంపులు చేసుకున్నట్లేనా..? పవన్ కళ్యాణ్ చెప్పింది అదేనా..? పవన్ కళ్యాణ్
    TS Elections: తెలంగాణలో పోటీపై రెండ్రోజుల్లో నిర్ణయం : జనసేన తెలంగాణ
    పవన్ కళ్యాణ్‌తో తెలంగాణ బీజేపీ నేతల భేటీ.. రెండు రోజుల్లో పొత్తుపై క్లారిటీ  బీజేపీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025