NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / శివసేన కేసు: ఈసీ ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు
    తదుపరి వార్తా కథనం
    శివసేన కేసు: ఈసీ ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు

    శివసేన కేసు: ఈసీ ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు

    వ్రాసిన వారు Stalin
    Feb 22, 2023
    05:49 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సుప్రీంకోర్టులో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు చుక్కెదురైంది. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గానికి శివసేన పేరు, విల్లు-బాణం గుర్తును కేటాయిస్తూ ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది.

    భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది.

    మహారాష్ట్ర సీఎం ఏకనాథ్ షిండే గత సంవత్సరం ఠాక్రేపై తిరుగుబాటు చేసినప్పటి నుంచి ఇరు వర్గాలు పార్టీ పేరు, చిహ్నం కోసం పోరాడుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం ఎన్నికల సంఘం ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని వర్గానికి శివసేన పేరును, 'విల్లు, బాణం'ను కేటాయించింది. ఎన్నికల సంఘం నిర్ణయాన్ని షిండే వర్గం స్వాగతించగా, ఉద్ధవ్ ఠాక్రే వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

    సుప్రీంకోర్టు

    ప్రత్యేక పిటిషన్‌పై విచారణకు సిద్ధం: సుప్రీంకోర్టు

    ఏక్‌నాథ్ షిండే వర్గం ఎన్నికల సంఘం వద్ద ఇప్పటికే విజయం సాధించినట్లు ధర్మాసనం పేర్కొంది. నిర్ణయం జరిగాక దానిపై స్టే ఇవ్వలేమని, యథాస్థితి కొనసాగుతుందని జస్టిస్ చంద్రచూడ్ చెప్పారు.

    ఉద్ధవ్ ఠాక్రే తరఫున సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. పార్టీకి సంబంధించిన బ్యాంకు ఖాతాలు, ఇతర ఆస్తులను షిండే వర్గానికి అటాచ్ చేయడానికి తాము సిద్ధం లేమని, తమకు ఈ విషయంలో భద్రత కావాలని కోర్టును ఆశ్రయించారు.

    అయితే ప్రత్యేక పిటిషన్‌పై విచారణకు కోర్టు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.

    ఈసీ ఉత్తర్వుల్లో లేని అంశాల విషయంలో ఉద్ధవ్ ఠాక్రే శిబిరం చట్ట ప్రకారం ఇతర పరిష్కారాలను అనుసరించవచ్చని ఎస్సీ స్పష్టం చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    శివసేన
    సుప్రీంకోర్టు
    సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    శివసేన

    కౌ హగ్ డే ప్రకటన వెనక్కి తీసుకున్న యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా భారతదేశం
    'శివసేన' పార్టీ గుర్తుకోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఉద్ధవ్ ఠాక్రే- రేపు విచారణ సుప్రీంకోర్టు

    సుప్రీంకోర్టు

    పెద్దనోట్ల రద్దుపై సుప్రీంకోర్టు ఏం చెప్పబోతోంది? తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ భారతదేశం
    పెద్ద నోట్ల రద్దు.. కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు నరేంద్ర మోదీ
    ఎమ్మెల్యే, ఎంపీల వాక్ స్వాతంత్య్ర హక్కుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు భారతదేశం
    సినిమా హాళ్లలోకి బయటి తినుబండారాలను అనుమతించడంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జమ్ముకశ్మీర్

    సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

    సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తులు; ప్రమాణ స్వీకారం చేయించిన సీజేఐ సుప్రీంకోర్టు
    మద్రాస్ హైకోర్టు జడ్టిగా గౌరీ ప్రమాణం, ఆమెకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను కొట్టేసిన సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు
    2 కొత్త న్యాయమూర్తులతో 34 మంది పూర్తి బలాన్ని తిరిగి పొందిన సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు
    హిజాబ్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన కర్ణాటక విద్యార్థినులు; బెంచ్ ఏర్పాటుకు సీజేఐ హామీ సుప్రీంకోర్టు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025