Mumbai: ముంబయిలో షాకింగ్ ఘటన.. మీటింగ్ పేరుతో మహిళను పిలిచి నగ్నంగా ఫోటోలు తీసిన ఎండీ
ఈ వార్తాకథనం ఏంటి
మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఘోరమైన అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళా వ్యాపారవేత్తను సమావేశం పేరుతో పిలిచి, ప్రైవేట్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అత్యంత దారుణంగా వేధించిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలాన్ని రేపుతోంది. తుపాకీతో బెదిరించి, ఆమెను వివస్త్రం చేయించి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదులో వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ముంబయి పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం ఫ్రాంకో-ఇండియన్ ఫార్మాస్యూటికల్స్ ఎండీ జాయ్ జాన్ పాస్కల్ పోస్ట్ ఈ ఘోరానికి నేరుగా బాధ్యుడిగా పేర్కొన్నారు.
Details
బాధితురాలికి తుపాకీ చూపించి బెదరింపు
సమావేశం ఉందని నమ్మబలికి తన ఆఫీసుకు పిలిపించిన జాయ్, అక్కడ బాధితురాలిపై తుపాకీ చూపించి దుస్తులు తొలగించమని బలవంతపెట్టాడు. నగ్నంగా ఉన్న ఆమెను మొబైల్లో ఫొటోలు, వీడియోలు తీసి రికార్డ్ చేశాడు. ఈ విషయం బయటపెడితే, ఆ చిత్రాలను పబ్లిక్ చేస్తానని బెదిరింపులు కూడా చేశాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు జాయ్ జాన్ పాస్కల్తో పాటు మరో ఐదుగురిపై లైంగిక వేధింపులు మరియు ఇతర సంబంధిత సెక్షన్లపై కేసులు నమోదు చేశారు. బాధితురాలి వాంగ్మూలాన్ని కూడా రికార్డ్ చేశారు. ఆమె ఫొటో ఫ్రేమ్, గిఫ్ట్స్ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు విచారణలో తెలిసింది.