NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Phone taping-Radha Kishan Rao: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వెలుగులోకి కీలక అంశాలు చెప్పిన రాధాకిషన్ రావు
    తదుపరి వార్తా కథనం
    Phone taping-Radha Kishan Rao: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వెలుగులోకి కీలక అంశాలు చెప్పిన రాధాకిషన్ రావు

    Phone taping-Radha Kishan Rao: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వెలుగులోకి కీలక అంశాలు చెప్పిన రాధాకిషన్ రావు

    వ్రాసిన వారు Stalin
    Apr 13, 2024
    02:54 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ (Phone taping) వ్యవహారం దర్యాప్తులో కీలక అంశాలు వెలుగు చూస్తున్నాయి.

    కేసులో కీలక నిందితుడు టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్ రావు (Radha kishan Rao) విచారణలో మరికొన్ని అంశాలు బయటకొచ్చాయి.

    బీఆర్ఎస్ (BRS)కు చెందిన ఎమ్మెల్సీ మాజీ ఐఏఎస్ వెంకట్రామిరెడ్డి (Venkatramireddy) కి సంబంధించిన డబ్బులు తరలించడంలో బీఆర్ఎస్ కు అనుకూలంగా రాధాకిషన్ రావు కీలకంగా వ్యవహరించారని దర్యాప్తు అధికారులు పేర్కొంటున్నారు.

    ఇందుకు సంబంధించిన కీలక సమాచారాన్ని దర్యాప్తు అధికారులు రాబట్టారు.

    వెంకట్రామిరెడ్డి డబ్బు రవాణాకు ఎస్కార్ట్గా ఓ ఎస్సైను నియమించుకుని ఆయనకు తప్పుడు సమాచారమిచ్చి భారీగా నగదును తరలించినట్లు విచారణలో వెల్లడైంది.

    Radha Kishan Rao

    ఎస్సైను ఎస్కార్ట్​ గా నియమించారు

    డబ్బు తరలింపు ప్రక్రియలో భాగంగా అవి ఎన్నికలకు సంబంధించిన డబ్బులు కావని, అత్యవసర పరిస్థితుల కోసం డబ్బును తరలిస్తున్నామంటూ పోలీసు నిఘాకు చిక్కకుండా ఆ సొమ్మును రాధాకిషన్ రావు ఓ ఎస్సై ద్వారా చేరవేసినట్లు విచారణలో తేలింది.

    డబ్బు తరలింపు వాహనాలకు ఎస్కార్ట్ గా నియమించిన ఎస్సైకు పలు ఆదేశాలిచ్చి పని కానిచ్చినట్లు తెలిసింది.

    ఈ క్రమంలో నే తెల్లాపూర్ లోని రాజ్ పుష్ప గ్రీన్ డెల్ విల్లాస్ లో వెంకట్రామిరెడ్డి నివాసానికి దగ్గరగా ఉండే శివచరణ్ రెడ్డి (Siva Charan Reddy) అనే వ్యక్తిని కలవాలని సదరు ఎస్సైకు రాధాకిషన్ సూచించారని తెలుస్తోంది.

    ఎస్కార్ట్ గా నియమించబడిన ఎస్సైకు శివచరణ్ రెడ్డి ఒక కొత్త ఐఫోన్ ను, సిమ్ కార్డును సమకూర్చారు.

    SivaCharan Reddy

    డబ్బును దివ్యచరణ్​ రావుకు అప్పగించారు

    ఆ ఫోన్ ద్వారా నే రాధాకిషన్ రావు ఎస్సైకు ఆదేశాలిచ్చేవారని వెల్లడైంది. అలా వెంకట్రామిరెడ్డి డబ్బును సికింద్రాబాద్ లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో విశ్రాంత ఎస్పీ దివ్యచరణ్ రావుకు అప్పగించినట్లు తెలిసింది.

    మరోసారి అదే ఆస్పత్రి నుంచి దివ్యచరణ్రావు (Divya Charan Rao) పంపించిన వ్యక్తి ద్వారా అఫ్జల్ గంజ్ వెళ్లి అక్కడ కోటి రూపాయలు తీసుకుని తిరిగి మలక్ పేట్ లోని దివ్యచరణ్ రావుకు అందజేశారు.

    ఈ వ్యవహారంలో రాధాకిషన్ రావు ఎస్కార్ట్ గా నియమించిన ఎస్సై కీలకంగా వ్యవహరించారు.

    మరోసారి శివచరణ్ రెడ్డి సూచించిన వ్యక్తి తో కలసి సదరు ఎస్సై ఒక ప్రాంతానికి వెళ్లి మరో కోటి రూపాయలను తెల్లాపూర్ లోని ఓ వ్యక్తి కి అప్పగించారు.

    Divya Charan Rao

    రెండు రోజుల వ్యవధిలోనే రెండు కోట్ల రూపాయలను తరలించారు

    అక్టోబర్ మూడో వారంలో రెండు రోజుల వ్యవధిలో నే రెండు కోట్లను శివచరణ్ కు ఎస్సై ఇచ్చారు.

    తరచూ ఈ డబ్బు తరలింపుపై సదరు ఎస్సైకి అనుమానం వచ్చినా రాధాకిషన్ రావు అతనిపై అధికారి కావడంతో ఆయనను ప్రశ్నించలేకపోయారని విచారణలో వెల్లడైంది.

    అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ ఎస్ ఓటమి పాలవడంతో రాధా కిషన్ రావు తన పదవికి రాజీనామా చేసి డబ్బు తరలింపు నకు వాడిన రెండు సెల్ ఫోన్లను ఫార్మాట్ చేసేశారు.

    దర్యాప్తు అధికారులు వాటి నుంచి సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బీఆర్ఎస్
    ఎమ్మెల్సీ
    ఫోన్

    తాజా

    Mini Kashmir: కశ్మీర్‌కు బదులుగా ఈ మినీ కశ్మీర్‌కెళ్లండి.. ఇదే రైట్ టైమ్! జమ్ముకశ్మీర్
    Ravindra Jadeja: జడేజాకు టెస్ట్ సారథ్య బాధ్యతలు ఇవ్వాలి : అశ్విన్ జడేజా
    P Chidambaram:: 'ఇండియా అలయన్స్ వేస్ట్'.. 2029 లో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం  ఇండియా కూటమి
    TVS: 2025 టీవీఎస్ ఐక్యూబ్ లాంచ్.. ధర తగ్గింది.. రేంజ్ పెరిగింది! టీవీఎస్ మోటార్

    బీఆర్ఎస్

    కారు పోలిన గుర్తులతో బీఆర్ఎస్‌కు ఇక్కట్లు.. తొలగించాలంటూ దిల్లీ హైకోర్టును అశ్రయించిన పార్టీ ఎన్నికల సంఘం
    బీఆర్ఎస్ ఇంఛార్జీలు వచ్చేశారు.. కీలక సమావేశంలో మంత్రులు కేటీఆర్, హరీశ్ వ్యూహాత్మక సూచనలు ఎన్నికల ప్రచారం
    KTR: కర్ణాటక నుండి తెలంగాణకు కాంగ్రెస్ కరెన్సీ కట్టలు.. కేటీఆర్ ట్వీట్ కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    Ponnala : పొన్నాలకు తెరుచుకున్న బీఆర్ఎస్ తలుపులు.. పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి కేటీఆర్‌ కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)

    ఎమ్మెల్సీ

    టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కన్నుమూత ఆంధ్రప్రదేశ్
    ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్; 16వ తేదీన ఫలితాలు ఎన్నికలు
    ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన వేపాడ చిరంజీవి ఎవరంటే? ఆంధ్రప్రదేశ్
    కాంగ్రెస్‌లోకి బీజేపీ ఎమ్మెల్సీ; ఎన్నికల వేళ కమలం పార్టీకి షాక్ బీజేపీ

    ఫోన్

    2023లో 5G సేవతో OTA అప్‌డేట్‌ను విడుదల చేయనున్న గూగుల్ గూగుల్
    పిల్లల కోసం ప్రత్యేకంగా Tab M9ని లాంచ్ చేసిన Lenovo టెక్నాలజీ
    Realme 10 vs Redmi Note 12 ఏది సరైన ఎంపిక ఆండ్రాయిడ్ ఫోన్
    iOS వినియోగదారుల కోసం కెమెరా మోడ్‌ను ప్రవేశపెట్టనున్న వాట్సాప్ వాట్సాప్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025