NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Andhrapradesh: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. భవన నిర్మాణ అనుమతులకు సింగిల్‌ విండో విధానం
    తదుపరి వార్తా కథనం
    Andhrapradesh: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. భవన నిర్మాణ అనుమతులకు సింగిల్‌ విండో విధానం
    ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. భవన నిర్మాణ అనుమతులకు సింగిల్‌ విండో విధానం

    Andhrapradesh: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. భవన నిర్మాణ అనుమతులకు సింగిల్‌ విండో విధానం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 23, 2024
    09:21 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భవన నిర్మాణ అనుమతుల కోసం సింగిల్ విండో విధానాన్ని త్వరలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమల్లోకి తీసుకురానుంది.

    ఈ విధానం ద్వారా అన్ని సంబంధిత ప్రభుత్వ శాఖల నుంచి ఒకే పోర్టల్ ద్వారా అనుమతులు అందుబాటులోకి రావడంతో, కార్యాచరణ సిద్ధం చేస్తోంది.

    ఈ కొత్త విధానం 2025 జనవరి నుంచి అమలులోకి వచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలో వివిధ శాఖల మంత్రులు ఇప్పటికే సమావేశమయ్యారు, మరోసారి నెలాఖరులో సమావేశం కానున్నారు.

    సింగిల్ విండో విధానం ద్వారా అనుమతుల్లో జాప్యాన్ని, అక్రమ వసూళ్లను తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

    వివరాలు 

    అధికారుల నిర్లక్ష్యం కారణంగా అనుమతులు మసకబారిపోయాయి

    గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వ హయాంలో భవన నిర్మాణ అనుమతులు ప్రజలకు కఠినంగా మారాయి.

    స్థానిక స్థాయిలో అధికారులు, నేతలు ముడుపులు తీసుకోకపోతే ప్రజలు నిర్మాణాలు ప్రారంభించలేని పరిస్థితి ఏర్పడింది.

    కొన్ని సందర్భాల్లో, అధికారుల నిర్లక్ష్యం కారణంగా అనుమతులు మసకబారిపోయాయి.

    నెల్లూరు నగరపాలక సంస్థలో ఒక దరఖాస్తుపై 79 సార్లు అభ్యంతరాలు నమోదు చేయడం ఒక ఉదాహరణగా చెప్పవచ్చు.

    వివరాలు 

    ఇప్పటివరకు ఇలా... 

    ప్రస్తుత విధానంలో, డెవలప్‌మెంట్ పర్మిషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (DPMS) ద్వారా ప్రజలు పట్టణ స్థానిక సంస్థలకు అనుమతి పొందేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు.

    దరఖాస్తుదారులు అవసరమైన దస్త్రాలను అప్‌లోడ్ చేసి, మూడు లేదా నాలుగు రోజుల్లో ప్రాథమిక అనుమతి పొందవచ్చు.

    ఫీజులు చెల్లించిన తరువాత, తదుపరి పరిశీలన (పోస్ట్ వెరిఫికేషన్) జరుగుతుంది. 5 ఫ్లోర్లకు మించి నిర్మాణాలకు అగ్నిమాపక విభాగం, ఎయిర్‌పోర్ట్ అథారిటీ వంటి శాఖల నుంచి అనుమతులు పొందాలి.

    వ్యవసాయ భూముల్లో నిర్మాణాల కోసం రెవెన్యూ శాఖ నుంచి కూడా అనుమతులు అవసరం అవుతాయి, దరఖాస్తుదారులు ఈ ప్రక్రియల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది.

    వివరాలు 

    కొత్త విధానం... 

    కానీ, కొత్త విధానంలో DPMS పోర్టల్‌కు అన్ని సంబంధిత ప్రభుత్వ శాఖలను అనుసంధానం చేయనున్నారు.

    ఫైర్స్, ఎయిర్‌పోర్ట్ అథారిటీ, రెవెన్యూ, గనులు, భూగర్భశాఖలు వంటి అనుమతులు అవసరమైన విభాగాల కోసం అధికారులను సంప్రదించాల్సిన అవసరం ఉండదు.

    ఒకే దరఖాస్తు ద్వారా, అన్ని అనుమతులను పొందవచ్చు. అధికారులు తమ లాగిన్ ద్వారా దరఖాస్తులను పరిశీలించి, సమయానుకూలంగా అనుమతులు ఇవ్వాలి.

    ఈ విధానం ద్వారా దరఖాస్తులను నెలల తరబడి పెండింగ్‌లో ఉంచకుండా చర్యలు తీసుకుంటారు.

    వివరాలు 

    దస్త్రాలన్నీ సక్రమంగా ఉంటే... 

    దరఖాస్తుదారులు సక్రమమైన దస్త్రాలను సమర్పిస్తే, అనుమతులు పొందడం సులభమవుతుంది.

    కానీ తప్పుడు సమాచారం ఇవ్వడం లేదా నకిలీ దస్త్రాలను ఉపయోగించడం ద్వారా ప్రాథమిక అనుమతులు పొందినా, పోస్ట్ వెరిఫికేషన్ సమయంలో అవి గుర్తించబడతాయి.

    అలాంటి ప్రాజెక్టులకు అనుమతులు రద్దు చేయబడతాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    ఆంధ్రప్రదేశ్ లేటెస్ట్ న్యూస్

    తాజా

    Hit3 : ఆ రోజు నుంచే హిట్-3 ఓటీటీ స్ట్రీమింగ్.. నెట్ ఫ్లిక్స్
    Boycott Turkey: 'బాయ్‌కాట్‌ టర్కీ' ఎఫెక్ట్‌.. భారీగా పెరిగిన క్యాన్సలేషన్లు.. వెల్లడించిన ట్రావెల్‌ సంస్థలు! బాయ్‌కాట్‌ టర్కీ
    Sophia Qureshi: ఆర్మీ కల్నల్ సోఫియా ఖురేషిపై వివాస్పద వ్యాఖ్యలు.. బిజెపి మంత్రిపై మధ్యప్రదేశ్ కోర్టు ఎఫ్ఐఆర్‌ నమోదుకు ఆదేశం మధ్యప్రదేశ్
    Bhargavastra: స్వదేశీ కౌంటర్‌ డ్రోన్ సిస్టమ్‌ 'భార్గవస్త్ర' విజయవంతంగా ప్రయోగం .. దీని పవర్ ఏ స్థాయిలో ఉంటుందంటే..! భార్గవస్త్ర

    ఆంధ్రప్రదేశ్

    AP floods: ఏపీలో భారీ వర్షాల కారణంగా మృతి చెందినవారి సంఖ్య విడుదల భారతదేశం
    AP Floods : నేడు ఏపీకి కేంద్ర బృందం భారతదేశం
    Satyavedu TDP MLA :సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల ఆరోపణలు..  వీడియోలు రిలీజ్ చేసిన బాధితురాలు!  భారతదేశం
    Flood Ration: ఇంటింటికి వరద సాయం పంపిణీ ప్రారంభం.. రేషన్ కార్డు లేనివారు ఇలా తీసుకోవచ్చు  భారతదేశం

    ఆంధ్రప్రదేశ్ లేటెస్ట్ న్యూస్

    ఆంధ్రప్రదేశ్: జగనన్న గోరుముద్దలో రాగి జావ; విద్యార్థుల మేథో వికాసంపై ప్రభుత్వం ఫోకస్ ఆంధ్రప్రదేశ్
    సరుకు రవాణాలో వాల్తేరు డివిజన్ రికార్డు: భారతీయ రైల్వే విశాఖపట్టణం
    Andhra pradesh: ఉత్కంఠగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్; ఓటేసిన సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్
    పోలవరంలో నీటి నిల్వ 41.15 మీటర్లకే పరమితం; కేంద్రం కీలక ప్రకటన పోలవరం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025