NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Solar Power: కాలువలపై సౌరవిద్యుత్తు ఉత్పత్తికి కసరత్తు.. జలవనరులశాఖకు నిపుణుల సూచన
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Solar Power: కాలువలపై సౌరవిద్యుత్తు ఉత్పత్తికి కసరత్తు.. జలవనరులశాఖకు నిపుణుల సూచన
    కాలువలపై సౌరవిద్యుత్తు ఉత్పత్తికి కసరత్తు.. జలవనరులశాఖకు నిపుణుల సూచన

    Solar Power: కాలువలపై సౌరవిద్యుత్తు ఉత్పత్తికి కసరత్తు.. జలవనరులశాఖకు నిపుణుల సూచన

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 12, 2025
    01:08 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రాష్ట్రంలోని కాలువలపై సౌర విద్యుత్తు ఉత్పత్తికి ప్రణాళికలు రూపొందుతున్నాయి,తద్వారా జలవనరుల శాఖ ఆర్థికంగా మరింత స్థిరపడే అవకాశముంది.

    ప్రస్తుతానికి, ఎత్తిపోతల పథకాల నిర్వహణ కోసం ఏటా వేల కోట్లు ఖర్చవుతోంది.

    ముఖ్యమైన కాలువలపై సౌర విద్యుత్తు ఉత్పత్తి చేస్తే, ఆ నిధులను ఎత్తిపోతల పథకాల కోసం వినియోగించుకోవడంతో పాటు, మిగిలిన విద్యుత్తును మార్కెట్‌లో అమ్మడం ద్వారా మరిన్ని ప్రాజెక్టులకు ఆర్థిక వనరులు సమకూర్చుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

    ఈ ప్రతిపాదనపై జలవనరుల శాఖలో గట్టి కసరత్తు జరుగుతోంది. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, ఈఎన్‌సీ ఎం. వెంకటేశ్వరరావు రాష్ట్రంలోని సీఈలతో వీడియో కాన్ఫరెన్సులు నిర్వహిస్తున్నారు.

    త్వరలోనే కేపీఎంజీ, సీఈల సహకారంతో నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించాలని యోచన ఉంది.

    వివరాలు 

    నీటిపారుదల కార్పొరేషన్ ద్వారా అమలు 

    ఈ ప్రాజెక్టును నీటిపారుదల కార్పొరేషన్‌ ద్వారా అమలు చేయాలనే ప్రణాళిక ఉంది.

    ఇక్కడ ఉత్పత్తి అయిన విద్యుత్తులో 90% ను ఎత్తిపోతల పథకాల నిర్వహణకు వినియోగించవచ్చు.

    దీని వలన రాష్ట్ర ఆర్థికశాఖ ఏటా వేల కోట్ల రూపాయల విద్యుత్ బిల్లుల భారం తగ్గించుకోవచ్చు.

    మిగిలిన విద్యుత్తును బహిరంగ మార్కెట్‌లో అమ్మడం ద్వారా ఆర్థిక వనరులు సమకూర్చుకోవచ్చని ప్రణాళిక ఉంది.

    ఆ నిధుల ఆధారంగా బహిరంగ మార్కెట్ నుంచి రుణాలు తీసుకుని, వాటిని రాష్ట్రంలోని ప్రాజెక్టుల నిర్వహణకు ఉపయోగించవచ్చు.

    ఈ రుణాలను, సౌర విద్యుత్తు అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయంతో తీర్చవచ్చని వ్యూహరచన సాగుతోంది.

    వివరాలు 

    ఖర్చు తక్కువ, లాభం ఎక్కువ 

    ప్రస్తుతం ఎత్తిపోతల పథకాలకు యూనిట్ విద్యుత్తుకు సుమారు రూ.7.15 చెల్లించాల్సి వస్తోంది.

    హంద్రీనీవా, పట్టిసీమ, పురుషోత్తపట్నం, పుష్కర, తాడిపూడి వంటి అనేక పథకాలు ఉన్నాయి, వీటి నిర్వహణకు ప్రతి ఏటా వేల కోట్ల రూపాయలు ఖర్చవుతోంది.

    అయితే, ఇదే కాలువలపై సౌర విద్యుత్తు ఉత్పత్తి చేస్తే,యూనిట్‌కు కేవలం రూ.3.20 మాత్రమే ఖర్చవుతుంది.

    ట్రాన్స్‌మిషన్,ఇతర ఛార్జీలను కూడా కలిపితే సగటున యూనిట్‌కు రూ.4.50 వరకు వ్యయం అవుతుంది.

    రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా కాలువల వ్యవస్థ ఉంది. వీటిని అనుకూలంగా ఉపయోగించుకుని, సౌర విద్యుత్తు ఉత్పత్తి చేయగలిగిన ప్రదేశాలను గుర్తించేందుకు ఉన్నతాధికారులు చీఫ్ ఇంజినీర్లను ఆదేశించారు.

    ఇది జలవనరుల శాఖకు దీర్ఘకాలిక లాభాలను అందించడంతో పాటు, రాష్ట్రంలో విద్యుత్తు ఉత్పత్తికి కొత్త మార్గాలను తెరుస్తుందని భావిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Pakistan: భారతదేశంతో ఉద్రిక్తతల మధ్య.. ఆర్థిక సహాయం కోసం పంచ బ్యాంకు'ను సంప్రదించిన పాకిస్తాన్  పాకిస్థాన్
    Omar Abdullah: అత్యవసరంగా జమ్మూకు ఒమర్‌ అబ్దుల్లా.. పరిస్థితిని సమీక్షించనున్న సీఎం  ఒమర్ అబ్దుల్లా
    Dance of the Hillary Virus: అలర్ట్.. 'డాన్స్ ఆఫ్ ది హిల్లరీ' మాల్వేర్‌తో సైబర్ దాడికి పాక్ పన్నాగం! భారతదేశం
    PSL : ఉద్రిక్తతల ఎఫెక్టు.. పాక్ సూపర్ లీగ్‌ మ్యాచ్‌లు యూఏఈకి షిఫ్ట్ పాకిస్థాన్

    ఆంధ్రప్రదేశ్

    AP Budget 2025: ఇవాళ ఏపీ బడ్జెట్.. వ్యవసాయం, విద్య, వైద్యం రంగాలకు భారీ కేటాయింపులు బడ్జెట్
    TG Non Local: విద్యాశాఖ కీలక నిర్ణయం.. తెలంగాణలో నాన్-లోకల్ కోటా రద్దు! తెలంగాణ
    Nara Lokesh:  ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. గీతం యూనివర్శిటీలో మెగా కెరీర్ ఫెయిర్  ఇండియా
    Coastal Andhra : ఏపీ తీరంలో సముద్రం రంగు మార్పు.. అసలు కారణాలు ఇవే! లైఫ్-స్టైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025