NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Srisailam: శ్రీశైలంలో ఘనంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. భక్తుల కోసం ఎటువంటి ఏర్పాట్లు చేశారంటే..?
    తదుపరి వార్తా కథనం
    Srisailam: శ్రీశైలంలో ఘనంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. భక్తుల కోసం ఎటువంటి ఏర్పాట్లు చేశారంటే..?

    Srisailam: శ్రీశైలంలో ఘనంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. భక్తుల కోసం ఎటువంటి ఏర్పాట్లు చేశారంటే..?

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 20, 2025
    03:34 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా ప్రారంభమయ్యాయి.

    ఈ ఉత్సవాల సందర్భంగా ఆలయ పరిసరాలు రంగురంగుల విద్యుత్ దీపాలతో మిలమిలా మెరుస్తూ భక్తుల మనసులను ఆనందపరిచాయి. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దేవస్థానం ఈవో ఎం. శ్రీనివాసరావు వెల్లడించారు.

    బ్రహ్మోత్సవాల భాగంగా గురువారం రెండవ రోజు స్వామివారి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు.

    సాయంత్రం భృంగి వాహన సేవ ప్రత్యేకంగా నిర్వహించనున్నారు.

    లోకక్షేమం కోసం రుద్రహోమం,చండీహోమం,జపాలు, పారాయణాలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

    మహోత్సవాల ప్రారంభ రోజున యాగశాలలో అర్చకులు, వేదపండితుల సమక్షంలో ఈవో శ్రీనివాసరావు పూజ కార్యక్రమాలను ప్రారంభించారు.

    తొమ్మిది రోజుల పాటు కొనసాగనున్న ఈ మహోత్సవాల్లో ప్రత్యేక పూజలు, రథోత్సవం, లింగోద్భవ సమయానికి విశేష అభిషేకాలు జరుపుతారు.

    వివరాలు 

    రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక ఏర్పాట్లు

    భక్తుల అధిక రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టినట్లు ఈవో తెలిపారు.

    ఆలయ దర్శనార్థం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయడంతో పాటు తాత్కాలిక వసతిగృహాలను సిద్ధం చేశారు.

    భక్తుల కోసం ఉచిత అన్నప్రసాదం, స్వచ్ఛమైన తాగునీరు, పార్కింగ్ సౌకర్యాలను అందుబాటులో ఉంచినట్లు తెలియజేశారు.

    పాదయాత్ర భక్తుల సౌకర్యార్థం మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరిచినట్లు వివరించారు.

    భక్తుల ప్రయాణ సౌలభ్యం కోసం పార్కింగ్ ప్రాంతాల నుంచి సత్రాల వరకు ఉచిత బస్సు సౌకర్యాన్ని అందుబాటులో ఉంచారు.

    మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    శ్రీశైలం

    తాజా

    Vijay Mallya: అరెస్టు అయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టే.. భారత్‌ను వీడా: విజయ్‌ మాల్యా విజయ్ మాల్యా
    Covid 19: దేశంలో డేంజర్ బెల్స్ మోగిస్తున్న కరోనా.. 5,364 కొవిడ్‌ యాక్టివ్‌ కేసులు.. 55 మరణాలు కరోనా కొత్త కేసులు
    USA: హార్వర్డ్‌ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థుల ప్రవేశం నిలిపివేత.. ట్రంప్ కి షాక్ ఇచ్చిన ఫెడరల్‌ కోర్టు ..  అమెరికా
    Stock Market: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వడ్డీ రేట్లను తగ్గించిన నేపథ్యంలో.. సెన్సెక్స్ 700 పాయింట్లు జంప్‌ స్టాక్ మార్కెట్

    శ్రీశైలం

    నల్లమలలో 75 పులులు; ఎన్ఎస్‌టీఆర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏర్పడి 50ఏళ్లు నాగార్జునసాగర్
    శ్రీశైలం మల్లికార్జున స్వామి సన్నిధిలో భారీ అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం ఆంధ్రప్రదేశ్
    Srisailam Dam:ఎగువ నుంచి వరద.. నాగార్జునసాగర్‌ 22 గేట్ల ద్వారా నీటి విడుదల   భారతదేశం
    Andrapradesh: జలాశయాల్లో పూడిక పెరుగుతోంది.. కేంద్ర జలసంఘం నివేదక రాష్ట్రం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025