Page Loader
ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 3నుంచి ఎస్ఎస్‌సీ పరీక్షలు; విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ఉచితం
ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రీల్ 3నుంచి ఎస్ఎస్‌సీ పరీక్షలు; విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ఉచితం

ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 3నుంచి ఎస్ఎస్‌సీ పరీక్షలు; విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ఉచితం

వ్రాసిన వారు Stalin
Apr 01, 2023
04:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఏప్రిల్ 3 నుంచి 10వ తరగతి (ఎస్‌ఎస్‌సీ) పరీక్షలను నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విస్తృత ఏర్పాట్లు చేసినట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శనివారం తెలిపారు. పదో తరగతి పరీక్షలు సోమవారం ఏప్రిల్ 3న ప్రారంభమై, ఏప్రిల్ 18న ముగుస్తాయని చెప్పారు. 6.69 లక్షల మంది విద్యార్థులు బోర్డు పరీక్షలకు హాజరవుతారని, మొత్తం 3,449 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా పరీక్ష కోసం నమోదు చేసుకున్న మొత్తం అభ్యర్థుల్లో 3.1 లక్షల మంది బాలురు, 2.97 లక్షల మంది బాలికలు ఉన్నారు.

ఆంద్రప్రదేశ్

ఉదయం 9.30 గంటలకు పరీక్షలు ప్రారంభం

ఉదయం 9గంటల నుంచి విద్యార్థులను పరీక్ష హాలులోకి అనుమతిస్తామని బొత్స సత్యనారాయణ తెలిపారు. పరీక్షలు ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.45 గంటలకు ముగుస్తాయని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లను అనుమతించబోమని, పరీక్షల సమయంలో ఇన్విజిలేటర్లకు సెల్‌ఫోన్ జోన్‌లు ఏర్పాటు చేయలేదని తెలిపారు. పరీక్షల సమయంలో విద్యార్థులు అవకతవకలకు పాల్పడకుండా 156 ఫ్లయింగ్ స్క్వాడ్‌లతో సహా 800 స్క్వాడ్‌లను మోహరించనున్నట్లు మంత్రి తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ) ఉచిత బస్సు ప్రయాణాన్ని అందిస్తుందని మంత్రి తెలిపారు. పరీక్షా కేంద్రాలుగా నోటిఫై చేయబడిన పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.