NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ముగిసిన సీఎం వైఎస్ జగన్ దిల్లీ పర్యటన; అమిత్ షా, నిర్మలతో కీలక భేటీ
    తదుపరి వార్తా కథనం
    ముగిసిన సీఎం వైఎస్ జగన్ దిల్లీ పర్యటన; అమిత్ షా, నిర్మలతో కీలక భేటీ
    ముగిసిన సీఎం వైఎస్ జగన్ దిల్లీ పర్యటన; అమిత్ షాతో కీలక భేటీ

    ముగిసిన సీఎం వైఎస్ జగన్ దిల్లీ పర్యటన; అమిత్ షా, నిర్మలతో కీలక భేటీ

    వ్రాసిన వారు Stalin
    Mar 30, 2023
    12:53 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిల్లీ పర్యటన ముగిసింది. బుధవారం సాయంత్రం దిల్లీ వెళ్లిన ఆయన గురువారం ఉదయం తిరిగి ఆంధ్రప్రదేశ్‌కు బయలుదేరారు.

    బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమై దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర సమస్యలపై చర్చించి పరిష్కరించాలని కోరారు.

    కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో గురువారం ఉదయం సమావేశమయ్యారు. దాదాపు 40 నిమిషాలకు పైగా జరిగిన ఈ సమావేశంలో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. పోలవరం ప్రాజెక్టు పెండింగ్‌లో ఉన్న నిధులను విడుదల చేయాలని కోరారు.

    జగన్

    అమిత్ షాతో సీఎం జగన్ భేటీ ముఖ్యాంశాలు

    అశాస్త్రీయ విభజన కారణంగా ఆర్థిక, ఆదాయం, అభివృద్ధి పరంగా ఆంధ్రప్రదేశ్‌చాలా నష్టపోయిందని అమిత్ షాకు జగన్ వివరించారు. విభజన జరిగి 9ఏళ్లు కావస్తున్నా కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చినా అనేక సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని, తక్షణమే వీటిపై దృష్టి పెట్టాలని కోరారు.

    పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగవంతం చేసేందుకు రూ.10వేల కోట్ల గ్రాంట్‌ను విడుదల చేయాలని జగన్ విజ్ఞప్తి చేశారు.

    అనూహ్య వరదల కారణంగా పోలవరం వద్ద డయాఫ్రమ్ పాడైందని, మరమ్మతులకోసం రూ.2020 కోట్లు అవసరమవుతాయని డీడీఆర్‌ఎంపీ అంచనా వేసిన నేపథ్యంలో విడుదల చేయాలని కోరారు.

    పోలవరం ప్రాజెక్టుకు సాంకేతిక సలహా కమిటీ అంచనాలు రూ. 55,548 కోట్లు కాగా, ఈ మొత్తానికి తక్షణమే ఆమోదించాలని జగన్ అభ్యర్థించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    ఆంధ్రప్రదేశ్
    ముఖ్యమంత్రి
    అమిత్ షా

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    రాజకీయాల్లోకి వైఎస్ భారతి; జమ్మలమడుగు నుంచి అసెంబ్లీ బరిలో? జమ్మలమడుగు
    ఆంధ్రప్రదేశ్: 18మంది ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన వైఎస్సార్సీపీ ఆంధ్రప్రదేశ్
    ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రమాణస్వీకారం, సీఎం జగన్‌ హాజరు ఆంధ్రప్రదేశ్
    వైజాగ్‌: 'ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023'ను ప్రారంభించిన జగన్: దిగ్గజ కంపెనీలు హాజరు ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్

    మూడు రాజధానులపై మార్చి 28కి సుప్రీంకోర్టులో విచారణ; జగన్ వైజాగ్ షిఫ్టింగ్ వాయిదా పడ్డట్టేనా? ప్రభుత్వం
    చంద్రయాన్-3 కీలక రాకెట్ ఇంజన్ ను విజయవంతంగా పరీక్షించిన ఇస్రో ఇస్రో
    ఆంధ్రప్రదేశ్‌కు గుడ్‌న్యూస్: విశాఖలో హైడ్రోజన్ హబ్ ఏర్పాటు విశాఖపట్టణం
    ప్రియుడి ఘాతుకం: బెంగళూరులో కాకినాడ యువతి దారుణ హత్య బెంగళూరు

    ముఖ్యమంత్రి

    వచ్చే ఏడాది నుంచి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్‌ తరగతులు: సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్
    దిల్లీ: 'మీకు వడ్డించడం అంటే చాలా ఇష్టం', కేజ్రీవాల్‌కు లెఫ్టినెంట్ గవర్నర్ కౌంటర్ దిల్లీ
    ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా విశాఖపట్నం, సీఎం జగన్ ప్రకటన ఆంధ్రప్రదేశ్
    ధన్‌బాద్‌: అపార్ట్‌మెంట్‌లో ఘోర అగ్నిప్రమాదం, 15 మంది సజీవ దహనం జార్ఖండ్

    అమిత్ షా

    త్రిపురలో అసెంబ్లీ పోరు: 'రథయాత్ర'తో ప్రజల్లోకి బీజేపీ త్రిపుర
    తెలంగాణకు మరో కేంద్ర మంత్రి పదవి? ఆ నలుగురిలో వరించేదెవరిని? బీజేపీ
    అదానీ వ్యవహారంపై మౌనం వీడిన అమిత్ షా భారతీయ జనతా పార్టీ/బీజేపీ
    అమిత్ షా నేతృత్వంలో బీజేపీ నేతల సమావేశం; తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై చర్చ తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025