NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Andhra pradesh: ఉత్కంఠగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్; ఓటేసిన సీఎం జగన్
    తదుపరి వార్తా కథనం
    Andhra pradesh: ఉత్కంఠగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్; ఓటేసిన సీఎం జగన్
    ఉత్కంఠగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్; ఓటేసిన సీఎం జగన్

    Andhra pradesh: ఉత్కంఠగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్; ఓటేసిన సీఎం జగన్

    వ్రాసిన వారు Stalin
    Mar 23, 2023
    11:30 am

    ఈ వార్తాకథనం ఏంటి

    వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక శాసనమండలి ఆవరణలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. గురువారం ఉదయాన్నే సీఎం జగన్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

    అధికార వైఎస్సార్సీపీ నుంచి ఏడుగురు, ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం నుంచి ఒకరు బరిలో నిలవడంతో పోరు రతవత్తరంగా మారింది.

    ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మొత్తం సభ్యుల సంఖ్య 175 కాగా, వైఎస్సార్‌సీపీకి 151 మంది, టీడీపీకి 23 మంది, జనసేనకు ఒక సభ్యుడు ఎన్నికల్లో గెలిచారు.

    అయితే ప్రస్తుతం టీడీపీ నుంచి గెలిచిన నలుగురు సభ్యులు మాత్రం ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. దీంతో టీడీపీకి 19 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. అలాగే జనసేన సభ్యుడు కూడా పార్టీని వీడారు.

    ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

    వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు టీడీపీకి ఓటు వేస్తారా?

    ఒక్కో ఎమ్మెల్సీ గెలుపునకు 22మంది సభ్యుల ఓట్లు అవసరం. వైఎస్సార్సీపీ స్పష్టమైన ఆధిక్యత నేపథ్యంలో ఏడు స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపింది.

    టీడీపీకి ఒక్క సీటు కూడా గెలిచేంత బలం లేదు. అయిబా అభ్యర్థిని నిలబెట్టడం చర్చనీయాంశంగా మారింది.

    వైఎస్సార్‌సీపీలో వచ్చే ఎన్నికల్లో టికెట్ రాకపోవచ్చని భావిస్తున్న రెబల్ ఎమ్మెల్యేల మద్దతుతో తమ అభ్యర్థిని గెలిపించుకోవాలని టీడీపీ భావిస్తోంది.

    దీంతో ఇరు పార్టీలు విప్ జారీ చేసిన నేపథ్యంలో ఇరు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేల ఒటింగ్ సరిళి ఎలా ఉంటుందో అని సర్వత్రా ఉత్కంఠగా మారింది.

    ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పోలింగ్, సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఫలితాలను ప్రకటిస్తారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    ఎమ్మెల్సీ
    ఎన్నికలు

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    ఆంధ్రప్రదేశ్

    రాజకీయాల్లోకి వైఎస్ భారతి; జమ్మలమడుగు నుంచి అసెంబ్లీ బరిలో? జమ్మలమడుగు
    ఆంధ్రప్రదేశ్: 18మంది ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన వైఎస్సార్సీపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ మధ్య ఘర్షణ: గన్నవరంలో హైటెన్షన్, పోలీసుల ఆంక్షలు గన్నవరం
    '24గంటలుగా నా భర్త కనిపించడం లేదు'; టీడీపీ నేత పట్టాభి భార్య నిరసన గన్నవరం

    ఎమ్మెల్సీ

    టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కన్నుమూత ఆంధ్రప్రదేశ్
    ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్; 16వ తేదీన ఫలితాలు తెలంగాణ
    ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన వేపాడ చిరంజీవి ఎవరంటే? ఆంధ్రప్రదేశ్
    కాంగ్రెస్‌లోకి బీజేపీ ఎమ్మెల్సీ; ఎన్నికల వేళ కమలం పార్టీకి షాక్ బీజేపీ

    ఎన్నికలు

    ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు; ప్యానెల్ ఏర్పాటు సుప్రీంకోర్టు
    2024ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తా: మమత బెనర్జీ మమతా బెనర్జీ
    రాజకీయ పార్టీల విరాళాల్లో 66శాతం అజ్ఞాత వ్యక్తులు ఇచ్చినవే: ఏడీఆర్ నివేదిక బీజేపీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025