NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Tirupati Stampede: తిరుపతిలో తొక్కిసలాట ఘటన.. ఏ సమయానికి ఏం జరిగిందంటే.. 
    తదుపరి వార్తా కథనం
    Tirupati Stampede: తిరుపతిలో తొక్కిసలాట ఘటన.. ఏ సమయానికి ఏం జరిగిందంటే.. 
    తిరుపతిలో తొక్కిసలాట ఘటన.. ఏ సమయానికి ఏం జరిగిందంటే..

    Tirupati Stampede: తిరుపతిలో తొక్కిసలాట ఘటన.. ఏ సమయానికి ఏం జరిగిందంటే.. 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 09, 2025
    08:06 am

    ఈ వార్తాకథనం ఏంటి

    వైకుంఠ ఏకాదశి రోజున భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని భావించారు, కానీ ఈ పవిత్రమైన సందర్భం కొందరి జీవితాలకు విషాదాన్ని మిగిల్చింది.

    టోకెన్లు తీసుకునే క్రమంలో, అనుకోని తొక్కిసలాట చోటుచేసుకొని ఐదుగురు ప్రాణాలు కోల్పోవడంతో ఈ హృదయ విదారక ఘటన అందరినీ తీవ్రంగా కలచివేసింది.

    వివరాలు 

    తప్పిన అధికారుల లెక్క..

    బైరాగిపట్టెడలోని రామానాయుడు పాఠశాల వద్ద తాకిడి తక్కువగా ఉంటుందని భావించి భక్తులు ఉదయం పదింటికే చేరుకున్నారు.

    రాత్రికి ఆ ప్రాంతం భక్తులతో నిండిపోవడంతో, పోలీసులు వారిని శ్రీపద్మావతి పార్కులో ఉంచి, రాత్రి 8.20 గంటలకు క్యూలైన్లలోకి అనుమతించారు.

    అయితే, ప్రధాన గేటు వద్ద తోపులాట కారణంగా పలువురు కిందపడటంతో విషాదం చోటుచేసుకుంది.

    సకాలంలో సహాయ చర్యలు ప్రారంభించడంతో ప్రాణనష్టం మరింత తగ్గింది. గాయపడిన భక్తులను వెంటనే అంబులెన్స్‌ల ద్వారా ఆసుపత్రులకు తరలించారు.

    వివరాలు 

    బారికేడ్ల లేమి కారణమా? 

    తిరుపతిలోని టోకెన్ల జారీ కేంద్రాల్లో భక్తుల కోసం బారికేడ్లు ఏర్పాటు చేసినప్పటికీ,బైరాగిపట్టెడలో అలాంటి ఏర్పాట్లు లేకపోవడం ప్రమాదానికి దారితీసిందని భావిస్తున్నారు.

    డీఎస్పీ రమణకుమార్‌కు రహదారిలో బారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించినప్పటికీ,అదనపు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఈ ఘోరం జరిగిందని ఆరోపణలు ఉన్నాయి.

    ఘటన టైమ్‌లైన్

    ఉదయం 10:00: భక్తులు రామానాయుడు పాఠశాల కౌంటర్ వద్దకు చేరారు.

    మధ్యాహ్నం 2:00: శ్రీపద్మావతి పార్కు భక్తులతో నిండిపోయింది.

    సాయంత్రం 7:00: పార్కు పూర్తిగా నిండిపోయి అదుపు చేయడం కష్టమైంది.

    రాత్రి 8:20: టికెట్ల కౌంటర్‌లోకి భక్తులను అనుమతించగా తోపులాట జరిగింది.

    రాత్రి 8:40: అంబులెన్స్‌లు చేరుకొని గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించాయి.

    రాత్రి 9:27: తితిదే అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

    వివరాలు 

    వ్యూహం ఫలితంగా గందరగోళానికి చెక్ 

    రాత్రి 9:30: భక్తులను క్యూ పద్ధతిలో క్రమబద్ధంగా అనుమతించారు.

    జీవకోన సత్యనారాయణపురం కేంద్రంలో తొక్కిసలాట తర్వాత అప్రమత్తమైన అధికారులు ప్రతి 500 మందిని విడివిడిగా క్యూలైన్లలోకి అనుమతించారు.

    ఎస్పీ సుబ్బరాయుడు మరింత జాగ్రత్తగా చర్యలు చేపట్టడంతో భక్తులు క్రమంగా ముందుకు సాగారు.

    ఈ ఘటనలో అధికారుల వైఫల్యం స్పష్టంగా కనిపించింది. భక్తుల భద్రతకు మరింత ప్రాధాన్యతనిచ్చి, ఇటువంటి విషాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తిరుమల తిరుపతి

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    తిరుమల తిరుపతి

    ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ను ప్రారంభించిన తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి
    TSRTC: 'బాలాజీ దర్శనం' ప్యాకేజీకి విశేష స్పందన; తిరుమలకు 1.14 లక్షల మంది భక్తులు తెలంగాణ
    తిరుమలో భద్రతా లోపం: 'ఆనంద నిలయం' దృశ్యాలను ఫోన్‌లో చిత్రీకరించిన భక్తుడు  తిరుపతి
    తిరుమల: ఏడాదిలోపు చిన్నారుల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం; అదెలాగో తెలుసుకోండి హిందువులు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025