India-Pakistan border: 'భారత్-పాక్ సరిహద్దు నుండి 10 కి.మీ దూరంలో ఉండండి': యూకే ట్రావెల్ అడ్వైజరీ
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీలో జరిగిన పేలుడు దేశవ్యాప్తంగా ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ఈ సంఘటన నేపథ్యంలో అనేక దేశాలు తమ పౌరులకు ట్రావెల్ అడ్వైజరీలు జారీ చేస్తున్నాయి. యునైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వం తన పౌరులకు భారత్-పాకిస్థాన్ సరిహద్దు (India-Pakistan border) నుంచి కనీసం 10 కిలోమీటర్ల పరిధిలోకి వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేసింది. అలాగే, జమ్ముకశ్మీర్లోని కొన్ని ప్రాంతాలకు ప్రయాణం చేయకుండా ఉండాలని కూడా సూచించింది. ముఖ్యంగా శ్రీనగర్, పహల్గామ్, గుల్మార్గ్, సోన్మార్గ్ వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో విహరించేటప్పుడు స్థానిక అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని పౌరులను అప్రమత్తం చేసింది. అయితే, జమ్మూ నగరానికి విమాన మార్గంలో రాకపోకలు మాత్రం అనుమతించబడ్డాయని స్పష్టం చేసింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
యూకే ట్రావెల్ అడ్వైజరీ
🇬🇧🇮🇳🇵🇰❗ UK issues travel advisory against all travel to parts of India following an explosion at the Red Fort (Lal Qila) Metro Station FCDO advises against all travel within 10km of the India-Pakistan border ,Manipur and Jammu And Kashmir. Wagah-Attari border crossing is closed. pic.twitter.com/hTlW6xZ8MY
— OSINT Expert (@OsintExperts) November 11, 2025