Page Loader
Mamata Banerjee: మత అల్లర్లకు ఆజ్యం పోసి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడవద్దు.. బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేసిన మమతా బెనర్జీ..
బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేసిన మమతా బెనర్జీ..

Mamata Banerjee: మత అల్లర్లకు ఆజ్యం పోసి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడవద్దు.. బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేసిన మమతా బెనర్జీ..

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 31, 2025
12:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్ రోడ్‌లో నిర్వహించిన ఈద్ ప్రార్థనా సభలో ప్రసంగిస్తూ... రాష్ట్రంలో ఉల్లాసాన్ని భగ్నం చేసేందుకు, అల్లర్లను రెచ్చగొట్టేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆమె వ్యాఖ్యానించారు. ప్రజలను ఈ విధమైన ఉచ్చుల్లో పడకూడదని హెచ్చరిస్తూ... బెంగాల్ ప్రభుత్వం మైనారిటీలకు అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎవరూ ఉద్రిక్తతలు రేకెత్తించకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. భారతీయ జనతా పార్టీకి మైనారిటీలతో సమస్య ఉంటే... దేశ రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నారా? అని మమతా బెనర్జీ ప్రశ్నించారు. తమ ప్రభుత్వం అన్ని మతాలను గౌరవిస్తున్నప్పటికీ, బీజేపీ మాత్రం విభజన రాజకీయాలను ప్రోత్సహిస్తోందని ఆమె ఆరోపించారు.

వివరాలు 

హిందువులను బీజేపీ సంక్షోభంలోకి నెట్టేస్తోంది 

అలాగే, బీజేపీ హిందువులను సంక్షోభంలోకి నెట్టివేస్తోందని, ముస్లింలపై అణిచివేతకు పాల్పడుతోందని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. మత రాజకీయాలను పూర్తిగా తుడిచిపెట్టివేయాలని బీజేపీని కోరుతూ... పశ్చిమ బెంగాల్‌లో విభజన సృష్టించేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే, తమ ప్రభుత్వం దీన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తుందని హెచ్చరించారు. ఐక్యతను కాపాడుకోవడం ఎంతో కీలకమని, ప్రజలు ఒక్కటిగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో మత రాజకీయాలను వ్యాపింపజేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆమె వివరించారు.