LOADING...
Year Ender 2025: తుఫాన్లు, వరదలు, వడగాలులు.. ప్రపంచాన్ని వణికించిన 2025! ఇక వచ్చే ఏడాది ఎలా ఉండబోతోంది?
తుఫాన్లు, వరదలు, వడగాలులు.. ప్రపంచాన్ని వణికించిన 2025! ఇక వచ్చే ఏడాది ఎలా ఉండబోతోంది?

Year Ender 2025: తుఫాన్లు, వరదలు, వడగాలులు.. ప్రపంచాన్ని వణికించిన 2025! ఇక వచ్చే ఏడాది ఎలా ఉండబోతోంది?

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 22, 2025
04:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

2025లో ప్రపంచం ఒక కఠినమైన నిజాన్ని స్పష్టంగా గమనించింది. ప్రకృతి విపత్తులు ఇక అపవాదులు కావు. అవి ముందే ఊహించగలిగే విధంగా, షెడ్యూల్ ప్రకారమే వస్తున్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి. ఒక నెల ఎండలతో భూమి కాలిపోతే, మరుసటి నెల అదే ప్రాంతం వరద నీటిలో మునిగిపోతోంది. ఒక ఖండంలో అడవులు అగ్నికి ఆహుతి అవుతుంటే, మరో ఖండంలో సముద్రం నగరాల్లోకి చొచ్చుకువస్తోంది. ఇది వాతావరణ మార్పుపై హెచ్చరికలు వినే దశ కాదు. ఆ దశ చాలా కాలం క్రితమే దాటిపోయింది.2025లో ప్రపంచం మొత్తం ఒకేసారి ఊపిరి ఆడని దృశ్యాలను చూసింది. భూమి పగిలిపోతుందేమో అన్న భావన కలిగించే స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఆ వేడితో ఉప్పొంగిన సముద్రాలు తుఫాన్లుగా మారి నగరాలపై విరుచుకుపడ్డాయి.

Details

ఇంతకుముందు ఎప్పుడు చూడని వరదలు

అమెరికా నుంచి చైనా వరకు, భారత్ నుంచి ఫిలిప్పీన్స్ వరకు ప్రకృతి ఒకే భాషలో మాట్లాడింది. వరదలు ఇంతకు ముందు ఎప్పుడూ చూడని ప్రాంతాల్లోకి దూసుకెళ్లాయి. తుఫాన్లు గతంలో ఎన్నడూ చూడని శక్తితో తీరాలను తాకాయి. శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం సముద్ర ఉష్ణోగ్రత కేవలం ఒక డిగ్రీ పెరిగితే, తుఫాన్ల శక్తి పది రెట్లు పెరుగుతుంది. ఇది ప్రకృతి కోపం కాదు. ప్రకృతి సమతుల్యత పూర్తిగా మారిపోతున్నదనే హెచ్చరిక. 2025లో ఎదురైన ప్రతి విపత్తు మనిషి చర్యలకు ప్రకృతి ఇచ్చిన ప్రత్యుత్తరమే. ఈ ఏడాది ఇలా ఉంటే, 2026 ఎలా ఉండబోతోందన్న భయం ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతోంది

Details

పుడమి తల్లి గజగజా వణికిన ఏడాది

2025లో సంభవించిన విపత్తులు ఒక్కో దేశానికో ప్రాంతానికో పరిమితం కాలేదు. భూమి మొత్తం ఒకేసారి దెబ్బతిన్నట్లుగా కనిపించింది. అమెరికాలో రికార్డు స్థాయి హీట్‌వేవ్స్ కారణంగా విద్యుత్ గ్రిడ్‌లు కుప్పకూలాయి. అడవుల్లో చెలరేగిన అగ్ని మంటలు వారాల తరబడి అదుపులోకి రాలేదు. చైనాలో కొన్ని ప్రాంతాల్లో ఎండల తీవ్రతతో నదులు ఎండిపోయాయి. అదే సమయంలో మరికొన్ని ప్రాంతాల్లో వరదలు రైలు మార్గాలు, హైవేలను కొట్టుకుపోయాయి. భారత్‌లో ఎండల తీవ్రత కారణంగా పట్టణాల్లో ఉష్ణోగ్రతలు మానవ శరీరం తట్టుకోలేని స్థాయికి చేరాయి. అదేఏడాది మాన్సూన్‌లో కొన్ని రాష్ట్రాలు భారీ వరదల్లో మునిగిపోయాయి. ఫిలిప్పీన్స్‌లో వరుస తుఫాన్లు తీర ప్రాంతాలను ఒకదాని తర్వాత ఒకటి తాకాయి. ఇళ్లు మాత్రమే కాదు, ఊర్లు కూడా మ్యాప్‌ల నుంచి మాయమయ్యాయి.

Advertisement

Details

సముద్రాల వేడే మూలకారణం

ఈ అన్ని విపత్తులకు ఒక కామన్ లింక్ ఉంది. అదే సముద్రాల ఉష్ణోగ్రత పెరుగుదల. శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్న విషయం 2025లో కళ్లకు కట్టినట్లుగా నిజమైంది. సముద్రాలు వేడెక్కుతున్న కొద్దీ వాటిలో నిల్వ అయ్యే శక్తి పెరుగుతోంది. అదే శక్తి తుఫాన్ల రూపంలో బయటకు వస్తోంది. అందుకే ఈ ఏడాది తుఫాన్లు కేవలం ఎక్కువగా మాత్రమే కాకుండా, అత్యంత శక్తివంతంగా మారాయి. గాలుల వేగం, వర్షాల తీవ్రత, తీర ప్రాంతాలపై ప్రభావం గతంతో పోలిస్తే అసాధారణంగా పెరిగింది. ఒక డిగ్రీ ఉష్ణోగ్రత పెరుగుదల ఎంత ప్రమాదకరమో 2025 స్పష్టంగా చూపించింది.

Advertisement

Details

ప్రాణాంతకంగా మారిన ఎండలు

భూమి వేడెక్కడం వల్ల వర్షాల వ్యవస్థ పూర్తిగా తారుమారైంది. ఎక్కడ వర్షం పడాలో అక్కడ పడటం లేదు. ఎక్కడ పడకూడదో అక్కడ అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా కొన్ని ప్రాంతాలు ఎడారులుగా మారుతుంటే, మరికొన్ని ప్రాంతాలు ఏడాదంతా వరదల్లో మునిగిపోతున్నాయి. వ్యవసాయం తీవ్రంగా దెబ్బతింటోంది. తాగునీటి వనరులు కలుషితం అవుతున్నాయి. కోట్లాది మంది జీవనోపాధి ప్రమాదంలో పడుతోంది. 2025లో ఎండలు కేవలం అసహనంగా మాత్రమే లేవు. అవి ప్రాణాంతకంగా మారాయి. ప్రపంచ వాతావరణ సంస్థల డేటా ప్రకారం అనేక దేశాల్లో ఈ ఏడాది ఉష్ణోగ్రతలు గత రికార్డులను దాటాయి. కొన్ని నగరాల్లో ఉష్ణోగ్రతలు మానవ శరీరం తట్టుకోలేని స్థాయిని మించాయి.

Details

వరదలు, వ్యాధులు, విధ్వంసం

వేడి పెరిగిన కొద్దీ నీటి చక్రం పూర్తిగా మారిపోయింది. 2025లో ప్రపంచవ్యాప్తంగా వర్షపాతం తీవ్ర అసమానంగా నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో నెలల తరబడి చినుకూ పడలేదు. మరోవైపు కొన్ని దేశాల్లో ఒకే రోజులో నెలల వర్షం కురిసింది. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలో అనేక నగరాలు వరదల్లో మునిగిపోయాయి. ఐక్యరాజ్యసమితి సంస్థల అంచనాల ప్రకారం వరద నీరు తగ్గిన తర్వాత కూడా సమస్యలు ఆగలేదు. తాగునీటి వనరులు కలుషితమయ్యాయి. పంట భూములు పనికిరాని స్థితికి చేరాయి. వ్యాధులు వ్యాప్తి చెందాయి.

Details

 మరింత తీవ్రతరమైన తుఫాన్లు

2025లో తుఫాన్ల తీవ్రత కొత్త స్థాయికి చేరింది. అట్లాంటిక్, పసిఫిక్, హిందూ మహాసముద్రాల్లో తుఫాన్ల సంఖ్య మాత్రమే కాదు, వాటి శక్తి కూడా పెరిగింది. క్యాటగిరీ-4, క్యాటగిరీ-5 స్థాయి తుఫాన్లు గతంతో పోలిస్తే ఎక్కువగా నమోదయ్యాయి. శాస్త్రవేత్తలు చెబుతున్న కారణం ఒక్కటే. సముద్రాల ఉష్ణోగ్రతలు చరిత్రలో ఎప్పుడూ లేనంతగా పెరగడం. ఈ ఏడాది తుఫాన్లు తీరాలను తాకినప్పుడు కేవలం గాలులతోనే కాదు.. భారీ వర్షాలు, ఉప్పెనలతో కలిసి విపరీత విధ్వంసం సృష్టించాయి.

Details

మనిషి చెల్లించిన భారీ మూల్యం

ఈ విపత్తుల మధ్య మనిషి చెల్లించిన మూల్యం అపారమైనది. వేలల్లో కాదు, లక్షల్లో కాదు, కోట్ల మంది జీవితాలు ప్రభావితమయ్యాయి. ఇళ్లు కోల్పోయిన కుటుంబాలు, జీవనోపాధి దెబ్బతిన్న రైతులు, మత్స్యకారులు, చిన్న వ్యాపారులు ప్రపంచవ్యాప్తంగా కనిపించారు. అభివృద్ధి చెందిన దేశాలైనా, అభివృద్ధి చెందుతున్న దేశాలైనా ప్రకృతి ముందు సమానంగానే బలహీనంగా నిలబడ్డాయి. డబ్బు, సాంకేతికత, మౌలిక సదుపాయాలు ఉన్నా కూడా ఈ తీవ్రత ముందు అవి సరిపోలేదు. ఈ ఏడాది కొన్ని విపత్తులు తమ పేర్లతోనే చరిత్రలో నిలిచిపోయాయి. అట్లాంటిక్‌లో అత్యంత శక్తివంతమైన హరికేన్‌లు తీర ప్రాంతాలను ధ్వంసం చేశాయి.

Details

తన

పసిఫిక్‌లో వచ్చిన సూపర్ టైఫూన్లు ఫిలిప్పీన్స్, జపాన్, తైవాన్‌లను వరుసగా తాకాయి. భారత మహాసముద్రంలో ఏర్పడిన తుఫాన్లు తీర గ్రామాలను ఖాళీ చేయించాల్సిన పరిస్థితిని తెచ్చాయి. యూరప్‌లో వేసవిలో చెలరేగిన అడవి మంటలు వేల చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతాన్ని నాశనం చేశాయి. ఇవన్నీ ఒకే ఏడాదిలో జరగడం ప్రపంచాన్ని వణికించింది.

Details

వందల బిలియన్ల నష్టం.. తీరని గాయాలు

2025లో వాతావరణ విపత్తుల వల్ల ప్రపంచానికి వందల బిలియన్ల డాలర్ల ఆర్థిక నష్టం జరిగినట్లు అంతర్జాతీయ అంచనాలు చెబుతున్నాయి. ఇది కేవలం భవనాలు, రోడ్లు, మౌలిక సదుపాయాల నష్టం మాత్రమే కాదు. కోల్పోయిన పంటలు, ఆగిపోయిన వ్యాపారాలు, కోలుకోడానికి పట్టే సంవత్సరాల కథ ఇది. పేద దేశాలకు ఇది మరింత ఘోరం. ఎందుకంటే అక్కడ ఒక్క విపత్తు ప్రభావం తరతరాల వరకు కొనసాగుతుంది. ఈ ఏడాది గణాంకాలు ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయి. వాతావరణ మార్పు ఇక భవిష్యత్తు సమస్య కాదు. ఇది ఇప్పటికే మన జీవితాల్లోకి పూర్తిగా ప్రవేశించింది.

Details

ప్రకృతి తన సహజత్వాన్ని కోల్పోతోంది

అడవుల్లో చెలరేగిన అగ్ని కారణంగా లక్షల హెక్టార్ల చెట్లు కాలిపోయాయి. అనేక జంతు జాతులు తమ నివాసాలను కోల్పోయాయి. సముద్రాల్లో ఉష్ణోగ్రతలు పెరగడంతో కోరల్ రీఫ్‌లు తెల్లబడిపోయాయి. మొత్తం సముద్ర ఆహార గొలుసు దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. పక్షులు తమ వలస మార్గాలను మార్చుకుంటున్నాయి. ప్రకృతి తన సహజత్వాన్ని కోల్పోతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే 2025ను కేవలం ఒక చెడు సంవత్సరంగా తేల్చేయడం అత్యంత ప్రమాదకరం. ఎందుకంటే శాస్త్రవేత్తలు ఇప్పుడు స్పష్టంగా చెబుతున్న మాట ఒక్కటే. ఈ ఏడాది జరిగినదంతా కేవలం ఒక శాంపిల్ మాత్రమే. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న వేగం ఇలాగే కొనసాగితే, ఇలాంటి విపత్తులు మరింత తరచుగా, మరింత తీవ్రంగా ఎదురయ్యే అవకాశముంది.

Details

 2026లో మనం ఏ ప్రపంచాన్ని చూడబోతున్నాం?

ఇప్పుడు తప్పించుకోలేని ప్రశ్న ఒక్కటే మిగులుతోంది. 2026లో మనం ఏ ప్రపంచాన్ని చూడబోతున్నాం? 2025లో చూసిన ఎండలు, వరదలు, తుఫాన్లు ఇంకా శక్తివంతంగా మారతాయా? లేదా మనిషి ఇప్పటికైనా మార్పు వైపు అడుగేస్తాడా? ప్రకృతి ఇప్పటికే తన దారిని మార్చుకుంటే, మనిషి తన దారిని మార్చుకోగలడా? 2025 సమాధానాలు ఇవ్వలేదు. కానీ ప్రశ్నలను మాత్రం చాలా స్పష్టంగా వదిలి వెళ్లింది.

Advertisement