LOADING...
Nalgonda: సౌరశక్తి ఆధారిత ఎలక్ట్రిక్ క్యాంపస్ కార్ట్‌.. రూపొందించిన మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం విద్యార్థులు 
రూపొందించిన మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం విద్యార్థులు

Nalgonda: సౌరశక్తి ఆధారిత ఎలక్ట్రిక్ క్యాంపస్ కార్ట్‌.. రూపొందించిన మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం విద్యార్థులు 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 12, 2025
01:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

నల్గొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ట్రిపుల్‌ఈ శాఖ విద్యార్థులు తమ యూనివర్సిటీ అవసరాల కోసం ప్రత్యేకంగా ఒక ఎలక్ట్రిక్‌ క్యాంపస్‌ కార్ట్‌ను తయారు చేశారు. ఈ ప్రాజెక్టును గత ఏడాది పూర్తిచేసిన 12 మంది విద్యార్థులు,ఆచార్యులు నాగరాజు, ప్రొఫెసర్‌ మౌనికల సహాయంతో రూపొందించారు. వాహనం బ్యాటరీ ఛార్జింగ్‌ కోసం సౌర శక్తిని ఉపయోగించేందుకు మోనో క్రిస్టల్‌ సోలార్‌ ప్యానెల్స్‌ను అమర్చారు. వాహనం ఎండలో 8గంటల పాటు ఉండగానే బ్యాటరీ పూర్తిగా ఛార్జ్‌ అయ్యేలా డిజైన్‌ చేశారు. ప్రొఫెసర్‌ మౌనిక తెలిపినట్లుగా,ఒక్కసారి పూర్తిగా ఛార్జ్‌ చేసిన తరువాత ఈ వాహనం గంటకు 40 కిలోమీటర్ల వేగంతో 90 కిలోమీటర్లు ప్రయాణించగలదని పేర్కొన్నారు. 8సీట్ల సామర్థ్యం కలిగిన ఈ క్యాంపస్‌ కార్ట్ 1500కిలోల బరువును మోయగలదు.

వివరాలు 

ఈ వాహనాన్ని అధికారికంగా ప్రారంభించిన విశ్వవిద్యాలయ వీసీ

ఇందులో Battery Monitoring System (BMS), స్పీడోమీటర్‌, రివర్స్‌ కెమెరాలు వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలు కూడా అమర్చారు. విద్యార్థుల నిర్మాణం పూర్తైన తరువాత, ఈ వాహనాన్ని 2023 జూన్‌ 27న యూనివర్సిటీకి అందజేశారు. విశ్వవిద్యాలయ వీసీ ప్రొఫెసర్‌ ఖాజా అల్తాఫ్‌ హుస్సేన్‌ ఈ వాహనాన్ని అధికారికంగా ప్రారంభించి, క్యాంపస్‌లో వివిధ అవసరాలకు ఉపయోగించేలా ఒక డ్రైవర్‌ను నియమించారు.