NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / వైఎస్ వివేక హత్య కేసులో స్వయంగా వాదనలు వినిపించిన సునీతారెడ్డి.. ఎంపీ అవినాశ్ రెడ్డికి సుప్రీం నోటీసులు 
    తదుపరి వార్తా కథనం
    వైఎస్ వివేక హత్య కేసులో స్వయంగా వాదనలు వినిపించిన సునీతారెడ్డి.. ఎంపీ అవినాశ్ రెడ్డికి సుప్రీం నోటీసులు 
    ఎంపీ అవినాశ్ రెడ్డికి సుప్రీం నోటీసులు

    వైఎస్ వివేక హత్య కేసులో స్వయంగా వాదనలు వినిపించిన సునీతారెడ్డి.. ఎంపీ అవినాశ్ రెడ్డికి సుప్రీం నోటీసులు 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 19, 2023
    03:29 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసులో వైఎస్ సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారించింది. ఈ మేరకు కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి నోటీసులను జారీ చేసింది.

    అవినాశ్ రెడ్డికి ఇచ్చిన ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలంటూ సునీతా దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం వాయిదా వేస్తూ అవినాశ్ రెడ్డికి, సీబీఐకి నోటీసులు జారీ చేసింది. సునీత పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

    మే 31న తెలంగాణ హైకోర్టు అవినాశ్ రెడ్డికి ఇచ్చిన ముందస్తు బెయిల్‌ ఆర్డర్స్ ను వివేకా కుమార్తె సునీతా గతంలోనే సుప్రీంలో సవాల్ చేశారు.

    DETAILS

    సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందుకు చేరిన తదుపరి విచారణ

    వైఎస్ సునీతా వేసిన పిటిషన్ను విచారించిన ధర్మాసనం, తదుపరి విచారణను జులై 3కి వాయిదా వేసింది. అంతే కాకుండా తదుపరి వాయిదాను విచారించేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్‌ వద్ద లిస్ట్‌ చేసింది.

    ఎంపీ అవినాశ్ రెడ్డికి ముందస్తు బెయిల్ రద్దు కోరుతూ గత మంగళవారం సునీతా దాఖలు చేసిన పిటిషన్‌ ను న్యాయమూర్తులు జస్టిస్‌ విక్రమ్‌ నాథ్‌, జస్టిస్‌ అహసనుద్దీన్‌ అమానుల్లాతో కూడిన వెకేషన్‌ బెంచ్‌ విచారణ చేపట్టింది.

    అయితే ఈ కేసులో హతుడు వైఎస్ వివేకా కుమార్తె సునీతారెడ్డి స్వయంగా ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. ఈ క్రమంలో ఆమెకు సుప్రీం సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా సహకరించేందుకు కోర్టు అనుమతివ్వడం గమనార్హం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సుప్రీంకోర్టు
    సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
    వైఎస్సార్ కడప

    తాజా

    IPL 2025: ప్లేఆఫ్స్ రేసులో ముంబయి, ఢిల్లీకి ఇంకా ఆశలు ఉన్నాయా? ఐపీఎల్
    Stock Market: అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాల నడుమ.. ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు స్టాక్ మార్కెట్
    Naveen Polishetty: మణిరత్నం దర్శకత్వంలో నవీన్‌ పోలిశెట్టి.. క్రేజీ కాంబో రాబోతుందా? టాలీవుడ్
    Revanth Reddy: నేడు నాగర్‌ కర్నూలు జిల్లాలో సీఎం రేవంత్‌ పర్యటన రేవంత్ రెడ్డి

    సుప్రీంకోర్టు

    అమరావతిపై విచారణను జులై 11కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్
    ఎన్సీపీ నేత మహ్మద్ ఫైజల్ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ లోక్‌సభ
    'అంతా ఏప్రిల్ 30లోగా అయిపోవాలి'; వైఎస్ వివేకా హత్య కేసుపై సుప్రీంకోర్టు ఆదేశాలు కడప
    రూ. 160కోట్ల ఖరీదైన బంగ్లాను కొనుగోలు చేసిన భారత మాజీ అటార్నీ జనరల్ భార్య దిల్లీ

    సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

    సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తులు; ప్రమాణ స్వీకారం చేయించిన సీజేఐ సుప్రీంకోర్టు
    మద్రాస్ హైకోర్టు జడ్టిగా గౌరీ ప్రమాణం, ఆమెకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను కొట్టేసిన సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు
    2 కొత్త న్యాయమూర్తులతో 34 మంది పూర్తి బలాన్ని తిరిగి పొందిన సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు
    హిజాబ్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన కర్ణాటక విద్యార్థినులు; బెంచ్ ఏర్పాటుకు సీజేఐ హామీ సుప్రీంకోర్టు

    వైఎస్సార్ కడప

    వైఎస్ వివేకా హత్య కేసులో కీలక మలుపు; దర్యాప్తు అధికారిని మార్చాలని సీబీఐని ఆదేశించిన సుప్రీంకోర్టు సీబీఐ
    వివేకా హత్యకు కుట్ర పన్నిన విషయం అవినాష్ రెడ్డికి ముందే తెలుసు: సీబీఐ ఆంధ్రప్రదేశ్
    వివేకా హత్య కేసు: తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సునీత ఆంధ్రప్రదేశ్
     వైఎస్ వివేకా హత్య కేసు: అవినాష్‌రెడ్డి బెయిల్‌పై స్టే విధించిన సుప్రంకోర్టు  సుప్రీంకోర్టు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025