NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Supreme Court: కంచె గచ్చిబౌలి భూములపై సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు - పర్యావరణ అనుమతులపై స్పష్టత కోరిన ధర్మాసనం
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Supreme Court: కంచె గచ్చిబౌలి భూములపై సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు - పర్యావరణ అనుమతులపై స్పష్టత కోరిన ధర్మాసనం
    కంచె గచ్చిబౌలి భూములపై సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు

    Supreme Court: కంచె గచ్చిబౌలి భూములపై సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు - పర్యావరణ అనుమతులపై స్పష్టత కోరిన ధర్మాసనం

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 15, 2025
    02:05 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణలోని కంచె గచ్చిబౌలి భూముల వివాదంపై సుప్రీంకోర్టు కఠినంగా స్పందించింది.

    న్యాయస్థానాలు పనిచేయని సెలవు దినాల్లో ప్రభుత్వ అధికారులు పనులు ఎందుకు చేపట్టారని ప్రశ్నించింది.

    ప్రత్యేకంగా లాంగ్ వీకెండ్ సమయంలో చెట్లను నరికేయడాన్ని కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది.

    పర్యావరణానికి జరిగిన నష్టాన్ని పూరించేందుకు ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుందన్న విషయాన్ని వివరంగా కోర్టుకు తెలియజేయాలంటూ ఆదేశాలు జారీచేసింది.

    అంతేకాకుండా, ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు పొందారో లేదో స్పష్టత ఇవ్వాలని తెలిపింది. తదుపరి విచారణకు ముందు అఫిడవిట్‌ దాఖలు చేయాలని కూడా సూచించింది.

    వివరాలు 

    చెట్ల నరికిన వ్యవహారంపై కోర్టు తీవ్ర అసంతృప్తి

    బుధవారం సీజేఐ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ అంశంపై విచారణ చేపట్టింది.

    తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాదులు, ప్రస్తుతం ప్రాజెక్టు పనులు నిలిపివేశామని, ప్రస్తుతం పర్యావరణ పునరుద్ధరణ సంబంధిత కార్యక్రమాలు మాత్రమే కొనసాగుతున్నాయని కోర్టుకు తెలిపారు.

    అయితే, చెట్ల నరికిన వ్యవహారంపై కోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. సెలవు దినాల్లో ఎలాంటి హడావుడి కార్యక్రమాలు అవసరమేమిటని ప్రశ్నించింది.

    అదేవిధంగా, కంచె గచ్చిబౌలి భూములపై పర్యావరణ అనుమతులు తీసుకున్నారా లేదా అనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన వివరణ ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది.

    ఈ అంశంలో విజిల్‌ బ్లోయర్స్‌ (తప్పు వెలుగులోకి తెచ్చిన వారు), విద్యార్థులపై కేసులు నమోదు చేసిన విషయాన్ని న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

    వివరాలు 

    జూలై 23 లోపు కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేయాలి 

    పర్యావరణ పునరుద్ధరణ విషయంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తే సహించేది లేదని కోర్టు స్పష్టం చేసింది.

    ఈ విషయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సహా అరడజను మంది ఉన్నతాధికారులు జైలుకు వెళ్లే పరిస్థితి కూడా రావొచ్చని హెచ్చరించింది.

    జూలై 23 లోపు కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేయాలని, పర్యావరణ నష్టాన్ని నిర్దిష్టంగా వివరించాలంటూ ఆదేశాలు జారీచేసింది.

    అభివృద్ధి పేరిట అడవులను నరికేయడాన్ని ఏ పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది.

    కంచె గచ్చిబౌలి భూములపై జరిగిన విచారణలో తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

    ఇప్పటికే ఈ కేసుపై ఏప్రిల్ 16న సుప్రీం కోర్టు జోక్యం చేసుకుని, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పనులపై స్టే విధించిన సంగతి తెలిసిందే.

    వివరాలు 

    జులైకు కేసు వాయిదా 

    చెట్ల నరికే వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు అఫిడవిట్ సమర్పించింది.

    ఆ భూములు హెచ్‌సీయూ పరిధిలో ఉన్నప్పటికీ,అవి ప్రభుత్వ భూములే అని,అటవీ భూములు కావని రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు వివరణ ఇచ్చింది.

    అయితే ఈ వివరణ సరిపోదని భావించిన ధర్మాసనం, సుమోటోగా విచారణను ప్రారంభించింది.

    గురువారం జరిగిన ఈ విచారణ సందర్భంగా జస్టిస్ గవాయ్ తెలంగాణ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

    పర్యావరణంపై రాజీకి స్థానం లేదని, ప్రైవేట్ అటవీ భూముల్లోనైనా చెట్లు నరికితే కఠిన చర్యలు తప్పవని కోర్టు స్పష్టం చేసింది.

    అభివృద్ధి పేరిట ప్రకృతి సంరక్షణను రక్షించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. చివరగా, కేసు విచారణకు జులైకు వాయిదా పడింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సుప్రీంకోర్టు

    తాజా

    Supreme Court: కంచె గచ్చిబౌలి భూములపై సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు - పర్యావరణ అనుమతులపై స్పష్టత కోరిన ధర్మాసనం సుప్రీంకోర్టు
    Adampur Airbase: పాక్‌ తాటాకు చప్పుళ్లకు బెదరకుండా.. గర్వంగా నిలబడిన ఆదంపుర్‌ ఎయిర్‌ బేస్‌..  ఆదంపుర్‌ ఎయిర్ బేస్
    RAPO 22 : రామ్ పోతినేని కొత్త సినిమా గ్లింప్స్ వచ్చేసింది.. అదిరిపోయిన టైటిల్ .. రామ్ పోతినేని
    Rashmika Mandanna : 'బేబీ' జంట కోసం వచ్చిన రష్మిక.. 'నైంటీస్' ద‌ర్శ‌కుడితో ఆనంద్ దేవ‌ర‌కొండ‌, వైష్ణవి చైతన్య ఆనంద్ దేవరకొండ

    సుప్రీంకోర్టు

    Supreme Court: భావప్రకటనా స్వేచ్ఛను పోలీసులు ఆర్థం చేసుకోవాలి : సుప్రీం కోర్టు భారతదేశం
    Supreme Court: పాకిస్తానీ అని పిలవడం మతపరమైన మనోభావాలను దెబ్బతీయడం కాదు: సుప్రీంకోర్టు   భారతదేశం
    Supreme Court: రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం కారణంగా ఔషధాల ధరలు పెరిగాయి: సుప్రీం కోర్టు  భారతదేశం
    Supreme Court: తెలంగాణ అసెంబ్లీలో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీం నోటీసులు! తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025