LOADING...
Prashant Kishor: 'ప్రజలు ఇప్పటికే మీను తిరస్కరించారు'.. ప్ర‌శాంత్ కిషోర్‌పై సుప్రీం ఆగ్ర‌హం
'ప్రజలు ఇప్పటికే మీను తిరస్కరించారు'.. ప్ర‌శాంత్ కిషోర్‌పై సుప్రీం ఆగ్ర‌హం

Prashant Kishor: 'ప్రజలు ఇప్పటికే మీను తిరస్కరించారు'.. ప్ర‌శాంత్ కిషోర్‌పై సుప్రీం ఆగ్ర‌హం

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 06, 2026
01:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

గత సంవత్సరం నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో,ప్ర‌శాంత్ కిషోర్ కి చెందిన జ‌న్ సూరజ్ పార్టీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల ఫలితాలను రద్దు చేయాలని ప్ర‌శాంత్ కిషోర్ దాఖ‌లు చేసిన పిటీషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. పార్టీ 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రభుత్వం తన సంక్షేమ పథకాల ద్వారా ఓటర్లకు నిధులు పంపిందని ఆరోపించింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీతో కూడిన ధర్మాసనం ఆ పిటీషన్‌ను కొట్టివేసింది.

వివరాలు 

38 సీట్లలో పోటీ చేసి ఒక్క సీటు కూడా గెలవని జ‌న్ సూరజ్ పార్టీ

"ప్ర‌జ‌లు మిమ్మ‌ల్ని తిర‌స్క‌రించార‌ని.. ఇప్పుడు పబ్లిసిటీ కోసం మీరు న్యాయ వ్యవస్థను వాడుతున్నారు. మీకెన్ని ఓట్లు వ‌చ్చాయి, ఒక‌సారి ప్ర‌జ‌లు తిర‌స్క‌రిస్తే, జుడిషియల్ ఫోరమ్ ద్వారా రిలీఫ్ కోరడం సరైనది కాదు. ఆ స్కీమ్‌ను ఎవ‌రో ఒక‌రు ముందుగా ఛాలెంజ్ చేసి ఉండాల్సింద‌ని కోర్టు పేర్కొన్న‌ది. జ‌న్ సూరజ్ పార్టీ మొత్తం 238 సీట్లలో పోటీ చేసి ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. అయితే, పార్టీ ఈ పిటీషన్‌ను బీహార్ హైకోర్టుకు పంపించింది.పార్టీ ఆరోపణ ప్రకారం,ప్రభుత్వ కుటుంబంలోని మహిళలకు ఇచ్చిన పదివేల రూపాయల పంపిణీ అక్రమంగా జరిగింది. ఆర్టికల్ 32 కింద దాఖలు చేసిన ఈ పిటీషన్‌లో,సుమారు 36లక్షల మహిళలకు నిధులు పంపించబడిన విషయం,అధికార పార్టీ ద్రుష్టిలో అక్రమ విధానాలు జరిగాయని తెలిపింది.

Advertisement