
Manish Sisodia: మనీష్ సిసోడియాకు సుప్రీం కోర్టు ఊరట.. మద్యం పాలసీ కేసులో బెయిల్, షరతులు సడలింపులు
ఈ వార్తాకథనం ఏంటి
మద్యం పాలసీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది, ఇందులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీష్ సిసోడియాకు సుప్రీం కోర్టు ఊరటను అందించింది.
మద్యం పాలసీ కేసులో తాను వారంలో సోమవారం, బుధవారం పోలీస్స్టేషన్కు హాజరవ్వాల్సి వస్తుందని,ఈ అంశంలో తనకు వెసులు బాటు కల్పించాలని కోరుతూ సిసోడియా సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
జస్టిస్ బీఆర్ గవాయ్, కేవీ విశ్వనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణ నిర్వహించి, సిసోడియా పోలీస్స్టేషన్కు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ, విచారణకు తప్పనిసరిగా హాజరుకావాలని సూచించింది. తదుపరి విచారణను డిసెంబర్ 17కి వాయిదా వేసింది.
వివరాలు
సిసోడియాను గతేడాది అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు
గతేడాది ఫిబ్రవరి 26న సీబీఐ అధికారులు సిసోడియాను అరెస్ట్ చేయగా, రెండు రోజుల తర్వాత ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఆ సమయంలో నుంచి 17 నెలలుగా జైల్లో ఉన్న ఆయన, ఇటీవల సుప్రీం కోర్టులో బెయిల్ కోసం పిటిషన్ వేశారు.
ఆగస్ట్ 9న కోర్టు పలు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది, అందులో రూ.10 లక్షల పూచీకత్తు, ఇద్దరు షూరిటీలు, పాస్పోర్ట్ సమర్పణ, సాక్షులను ప్రభావితం చేయరాదని ఆదేశాలు ఉన్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మనీష్ సిసోడియాకు సుప్రీం కోర్టు ఊరట.
माननीय सुप्रीम कोर्ट का हृदय से आभार, जिसने ज़मानत की शर्त को हटाकर राहत प्रदान की है। यह निर्णय न केवल न्यायपालिका में मेरी आस्था को और मजबूत करता है, बल्कि हमारे संवैधानिक मूल्यों की शक्ति को भी दर्शाता है। मैं हमेशा न्यायपालिका और संविधान के प्रति अपने कर्तव्यों का सम्मान करता… https://t.co/er7qTn2QMU
— Manish Sisodia (@msisodia) December 11, 2024