LOADING...
Delhi Pollution: దిల్లీలో కాలుష్య సమస్యపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
దిల్లీలో కాలుష్య సమస్యపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Delhi Pollution: దిల్లీలో కాలుష్య సమస్యపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 17, 2025
04:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజధాని దిల్లీ శీతాకాలపు కాలంలో భారీ కాలుష్యంతో కూడిన పరిస్థితుల్లో చిక్కుకుంటుంది. ఈ సీజన్‌లో గాలి నాణ్యత సూచీ (AQI) 300-400 మధ్య ఉండడం సాధారణంగా మారింది. దీన్ని దృష్టిలో ఉంచి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తాత్కాలిక పరిష్కారాలతో కాలుష్యాన్ని అరికట్టలేమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అలాగే, రాజధానిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను నిలిపి నిర్మాణాలపై నిషేధం విధించడానికి కోర్టు నిరాకరించింది. పర్యావరణ సమస్యలు మరియు అభివృద్ధి మధ్య సమతుల్యత ఉండాలని కోర్టు సూచించింది.

Details

దీర్ఘకాలిక పరిష్కారాలు అవసరం

దిల్లీలో వేగంగా పెరుగుతున్న కాలుష్య సమస్యను తాత్కాలిక చర్యలతో పరిష్కరించడం సాధ్యంకాదు. కాబట్టి కేంద్రం నవంబర్ 19లో ఒక పూర్తి ప్రణాళికతో ముందుకు రావాలి. దీర్ఘకాలిక పరిష్కారాలను రూపొందించడం ద్వారా మాత్రమే ఈ కాలుష్య సంక్షోభాన్ని ఎదుర్కొనవచ్చని కోర్టు ఆదేశించింది.