NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / SAS Survey: తెలంగాణలో సీట్లు తగ్గినా.. మూడోసారి బీఆర్ఎస్‌దే విజయం.. 'ఆత్మ సాక్షి' సర్వే వెల్లడి 
    తదుపరి వార్తా కథనం
    SAS Survey: తెలంగాణలో సీట్లు తగ్గినా.. మూడోసారి బీఆర్ఎస్‌దే విజయం.. 'ఆత్మ సాక్షి' సర్వే వెల్లడి 
    తెలంగాణలో సీట్లు తగ్గినా.. మూడోసారి బీఆర్ఎస్‌దే విజయం.. 'ఆత్మ సాక్షి' సర్వే వెల్లడి

    SAS Survey: తెలంగాణలో సీట్లు తగ్గినా.. మూడోసారి బీఆర్ఎస్‌దే విజయం.. 'ఆత్మ సాక్షి' సర్వే వెల్లడి 

    వ్రాసిన వారు Stalin
    Oct 30, 2023
    05:52 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపై ప్రధాన రాజకీయ పార్టీలు ధీమాగా ఉన్నాయి. ఇప్పటికే మెజార్టీ సీట్లలో అభ్యర్థులను ప్రకటించి.. వచ్చే ఎన్నికల్లో గెలుపు తమదంటే, తమదనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

    ప్రముఖ ప్రజాభిప్రాయ సేకరణ సంస్థ.. శ్రీ ఆత్మ సాక్షి (ఎస్ఏఎస్) తెలంగాణలోని పరిస్థితి, గ్రౌండ్ రియాలిటీపై చేసిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

    తెలంగాణలో మరోసారి బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుందని సర్వే తెలిపింది. ఆశ్చర్యకరంగా ఆ పార్టీకి ఈసారి తక్కువ సీట్లు, ఓట్లు వస్తాయని వెల్లడించింది.

    అయినా మూడోసారి పవర్‌లోకి వస్తుందని అంచనా వేసింది. అక్టోబర్ 28 వరకు నిర్వహించిన సర్వే ఫలితాలను ఆత్మ సాక్షి వెల్లడించింది.

    తెలంగాణ

    బీజేపీకి పెరగనున్న ఓట్ల శాతం

    బీఆర్ఎస్‌కు 42.5 శాతం ఓట్లను పొంది.. 64 నుంచి 70సీట్లలో విజయం సాధిస్తుందని, కాంగ్రెస్‌కు 36.5 శాతం ఓట్లు వచ్చి.. దాదాపు 37 నుంచి 43 సీట్లలో గెలుస్తుందని ఆత్మ సాక్షి సర్వే అంచనా వేసింది.

    ఈ సారి బీజేపీ ఓట్ల శాతం భారీగా పెరుగుతుందని, ఆ పార్టీకి 10.75 శాతం ఓట్లు వస్తాయని.. అలాగే 5 నుంచి 6 సీట్లను గెలుచుకునే అవకాశం ఉందని చెప్పింది.

    ఇక మజ్లిస్ పార్టీ తన సంప్రదాయ ఓటు బ్యాంకును కాపాడుకుందని ఆత్మసాక్షి పేర్కొంది. ఎంఐఎం ఏడు సీట్లను గెలుచుకొని, 2.75 శాతం ఓట్లను రాబట్టుకుంటుందని చెప్పింది.

    ఇతరులు 7.5 శాతం ఓట్లను సాందించి.. రెండు లేదా మూడు స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని వివరించింది.

    సర్వే

    ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్ది.. ఫలితాలు మారొచ్చు: ఆత్మ సాక్షి

    తెలంగాణలోని 110అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2,65,000మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. 820మంది ఎన్యూమరేటర్లతో సర్వే నిర్వహించారు.

    కమ్యూనిటీలు, ప్రాంతాలు, ఇలా వివిధ వర్గాలను స్పృశిస్తూ సర్వే చేసినట్లు ఎస్‌ఎఎస్‌ గ్రూప్‌ ప్రతినిధులు తెలిపారు.

    2018లో ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని ఆత్మ సాక్షి సర్వే అంచనా వేసింది. అది చివరికి నిజమైంది. రానున్న రోజుల్లో ప్రీ పోల్ సర్వే, ఎగ్జిట్ పోల్ సర్వేలను ప్రకటిస్తామని ఆత్మసాక్షి గ్రూప్ చెబుతోంది.

    ఆశ్చర్యకరంగా, రాబోయే రోజుల్లో మారుతున్న పరిణామాల కారణంగా ఫలితాల్లో మార్పులు ఉండవచ్చని ఆత్మ సాక్షి తెలిపింది.

    అయితే కొన్ని సర్వే సంస్థలు కాంగ్రెస్ అనుకూలంగా కూడా ఫలితాలను వెల్లడిస్తున్నాయి. అయితే పోలింగ్ జరిగి ఫలితాలు వెల్లడైన తర్వాత జనం నాడి ఎంటో తెలుస్తుందని నిపుణులు చెబుతున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    అసెంబ్లీ ఎన్నికలు
    భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్
    బీజేపీ

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    తెలంగాణ

    TELANGANA CASH SEIZURE : కేవలం నాలుగు రోజుల్లోనే రూ.37.07 కోట్లు సీజ్ ఎన్నికలు
    Telangana Ias Ips : ఐఏఎస్‌, ఐపీఎస్‌లకు కొత్త పోస్టింగ్స్ సిఫార్స్ చేసిన ఎన్నికల సంఘం.. ఆదేశాలిచ్చిన సీఎస్ ఎన్నికల సంఘం
    Bathukamma : బతుకమ్మ విశిష్టత..  ఎలా, ఎన్ని రోజులు జరుపుకుంటారో తెలుసా ? పండగలు
    ప్రవల్లికది ఆత్మహత్య కాదు, బీఆర్ఎస్ ప్రభుత్వ హత్య:  రాహుల్ గాంధీ ఆగ్రహం కాంగ్రెస్

    అసెంబ్లీ ఎన్నికలు

    నేడు ఖమ్మం సభకు రాహుల్ గాంధీ; కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల శంఖారావం  ఖమ్మం
    5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్: నేడు పార్టీ ఎన్నికల కమిటీ సమావేశం బీజేపీ
    BRS MLA List: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ప్రకటన.. రెండు చోట్ల నుంచి కేసీఆర్ పోటీ  తెలంగాణ
    బీఆర్ఎస్ పార్టీలో టిక్కెట్ల కుమ్ములాట.. మంత్రి హరీశ్‌రావుపై మైనంపల్లి తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణ

    భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్

    హైదరాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంఐఎం నేత రహ్మత్ బేగ్‌; మద్దతు ప్రకటించిన బీఆర్ఎస్ అసదుద్దీన్ ఒవైసీ
    నమస్తే ఆంధ్రప్రదేశ్‌: ఏపీలో న్యూస్ పేపర్ ఏర్పాటుపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్ ఆంధ్రప్రదేశ్
    D Srinivas: సీనియర్ నాయకుడు డి. శ్రీనివాస్‌కు తీవ్ర అస్వస్థత తెలంగాణ
    దిల్లీ మద్యం కేసు: 'సీబీఐ తర్వాత అరెస్టు చేసేది ఎమ్మెల్సీ కవితనే' కల్వకుంట్ల కవిత

    బీజేపీ

    'ఒకరు దోపిడీదారు.. మరొకరు దొంగ'.. అన్నాడీఎంకే, బీజేపీపై ఉదయనిధి స్టాలిన్ కామెంట్స్ ఉదయనిధి స్టాలిన్
    హిందీ రాష్ట్రాల్లో సీఎం అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికలకు బీజేపీ  అసెంబ్లీ ఎన్నికలు
    'గోవులను 'ఇస్కాన్' కసాయిలకు అమ్ముతోంది'.. మేనకా గాంధీ సంచలన ఆరోపణలు  ఇస్కాన్
    అసెంబ్లీ ఎన్నికలపై ప్రధాని మోదీ ఫోకస్.. 6రోజులు నాలుగు రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటన నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025