NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Swati Maliwal: ఆప్ మహిళా నేతపై అసభ్య ప్రవర్తన .. ఆమెకు ప్రాణ హాని ఉందంటున్న మాజీ భర్త
    తదుపరి వార్తా కథనం
    Swati Maliwal: ఆప్ మహిళా నేతపై అసభ్య ప్రవర్తన .. ఆమెకు ప్రాణ హాని ఉందంటున్న మాజీ భర్త
    ఆప్ మహిళా నేతపై అసభ్య ప్రవర్తన .. ఆమెకు ప్రాణ హాని ఉందంటున్న మాజీ భర్త

    Swati Maliwal: ఆప్ మహిళా నేతపై అసభ్య ప్రవర్తన .. ఆమెకు ప్రాణ హాని ఉందంటున్న మాజీ భర్త

    వ్రాసిన వారు Stalin
    May 15, 2024
    12:37 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆప్ మాజీ రాజ్య సభ సభ్యురాలు స్వాతి మలివాల్ కు ప్రాణ హాని ఉందని ఆమె మాజీ భర్త నవీన్ జైహింద్ ఆరోపించారు.

    స్వాతిమలివాల్ గతంలో అక్కడి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు వ్యక్తిగత కార్యదర్శిగా పని చేశారు.

    స్వాతి మలివాల్ పై ఇటీవలే అనుచితమైన దాడి జరిగింది. దీని వెనుక కేజ్రీవాల్ ప్రస్తుత వ్యక్తిగత కార్యదర్శి బైబవ్ కుమార్ ప్రమేయం వుండవచ్చని ఆమె అనుమానిస్తున్నారు.

    దీనిని ఆ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ధృవీకరించారు.ఈ విషయాన్ని ముఖ్యమంత్రి తీవ్రంగా పరిగణిస్తున్నారని దోషిపై కఠిన చర్య తీసుకుంటారన్నారు.

    మరో వైపు ఇదంతా సంజయ్ సింగ్ కు తెలిసే జరుగుతుందని స్వాతి మాజీ భర్త నవీన్ ఫేస్ బుక్ వీడియోలో ఆరోపించటం ప్రాధాన్యత సంతరించుకుంది.

    Details 

    నవీన్ జైహింద్ హర్యానా రాష్ట్రానికి ఆప్ కన్వీనర్

    జైలు నుంచి బయటికి వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ ను కలవటానికి స్వాతి సోమవారం ఆయన క్యాంప్ ఆఫీసుకి వెళ్లారు.

    అక్కడ ఆమెతో బైబవ్ కుమార్ అనుచితంగా వ్యవహరించారు .ఈ విషయమై స్వాతి ఎటువంటి ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం.

    హర్యానా రాష్ట్రానికి 2019 ఎన్నికలు ముగిసే వరకు అంటే 2020 వరకు నవీన్ జైహింద్ హర్యానా రాష్ట్రానికి ఆప్ కు కన్వీనర్ గా ఉన్నారు.

    ఆ సమంలో స్వాతి,నవీన్ జైహింద్ ఇష్టపడి వివాహం చేసుకున్నారు. అయితే మూడేళ్లకే వారిద్దరూ వైవాహిక జీవితానికి స్వస్తి పలికారు.

    ఇందుకు కారణం నవీన్ తండ్రి తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె ఆరోపించారు.

    అటువంటిదేమీ జరగలేదని నవీన్ జైహింద్ చెప్పుకొచ్చారు. కావాలనే స్వాతి తమ కుటుంబంపై నిరాధార ఆరోపణలు చేస్తోందన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్

    తాజా

    Pm Modi: భారత సైనిక పరాక్రమం త్రివిధ దళాల ఐక్యతకు ప్రతీక: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    Cockroaches and Lizards: బొద్దింకలు, బల్లుల సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?.. ఐతే ఈ సులభమైన పద్ధతితో చెక్ పెట్టండి..! జీవనశైలి
    Amazon Prime Video: ప్రైమ్ వీడియోలో ప్రకటనలు వద్దనుకుంటే.. అదనపు చార్జ్ తప్పదు! అమెజాన్ ప్రైమ్
    Donald Trump: ట్రంప్‌నకు ఖతార్‌ రాజకుటుంబం విమానం గిఫ్ట్‌..! డొనాల్డ్ ట్రంప్

    ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్

    పంజాబ్‌: డ్రగ్స్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టుపై కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు  పంజాబ్
    లిక్కర్ పాలసీ కేసులో సంజయ్ సింగ్ సన్నిహితులకు విచారణ సంస్థ ఈడీ సమన్లు ​​జారీ   ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ
    ప్రభుత్వ బంగ్లా కోసం దిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా  దిల్లీ
    దిల్లీ లిక్కర్ కేసులో నేడు హైకోర్టు విచారణ..ఎంపీ సంజయ్ సింగ్ పిటిషన్ దాఖలు దిల్లీ లిక్కర్ స్కామ్‌
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025