NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Narayana: ఐదు అంతస్తుల వరకు ఎలాంటి అనుమతులు అవసరం లేదు : నారాయణ 
    తదుపరి వార్తా కథనం
    Narayana: ఐదు అంతస్తుల వరకు ఎలాంటి అనుమతులు అవసరం లేదు : నారాయణ 
    ఐదు అంతస్తుల వరకు ఎలాంటి అనుమతులు అవసరం లేదు : నారాయణ

    Narayana: ఐదు అంతస్తుల వరకు ఎలాంటి అనుమతులు అవసరం లేదు : నారాయణ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 23, 2024
    04:52 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భవన నిర్మాణాలకు సంబంధించి ఐదు అంతస్తుల వరకు ఎలాంటి అనుమతులు అవసరం లేదని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు.

    ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి అనుమతులు పొందవచ్చని తెలిపారు. లేఅవుట్‌లు, భవనాలకు సంబంధించిన మున్సిపాలిటీ రుసుములు చెల్లించిన వెంటనే అన్ని అనుమతులు అందుబాటులో ఉంటాయని వివరించారు.

    రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు,తాగునీటి సరఫరా,వీధిదీపాలు,వరదనీటిని నిర్వహించడం,ఘనవ్యర్థాల నిర్వహణ వంటి అంశాలపై 15 రోజుల్లో ప్రాజెక్టు నివేదికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

    పాత పన్నుల బకాయిల వసూళ్ల కోసం చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు.

    ఆచార్య నాగార్జున వర్సిటీలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కార్యశాలలో 123 మంది పురపాలక కమిషనర్లు హాజరయ్యారు.

    వివరాలు 

    మున్సిపల్ నిధులను పక్కదారి పట్టించిన వైకాపా ప్రభుత్వం

    ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి నారాయణ, నెల్లూరు, కాకినాడ, రాజమండ్రి ప్రాంతాల్లో ఘన వ్యర్థాల నిర్వహణకు అనుమతి లభించిందని, ఈ చర్యల ద్వారా చెత్త సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయని తెలిపారు.

    2014-2019 కాలంలో మున్సిపల్ శాఖ అద్భుతమైన పనితీరు చూపించిందని, ఆ సమయంలో మున్సిపల్ పన్నులను పెంచకుండా పనులను సజావుగా నిర్వహించామని వివరించారు.

    వైకాపా ప్రభుత్వం మున్సిపల్ నిధులను పక్కదారి పట్టించిందని పేర్కొన్నారు.

    ప్రస్తుతం గుత్తేదారులు ముందుకు రావడం లేదని, ఈ సమస్యను పరిష్కరించి, సీఎఫ్‌ఎంఎస్‌తో సంబంధం లేకుండా మున్సిపాలిటీలకు నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు.

    వివరాలు 

    123 మున్సిపాలిటీలకు తాగునీటిని అందించడమే లక్ష్యం

    123 మున్సిపాలిటీలకు తాగునీటిని అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని, విశాఖపట్నంలో వ్యర్థాల నుంచి విద్యుదుత్పత్తి చేసే ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామని వివరించారు.

    ఆధునిక సాంకేతికతను ఉపయోగించి టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని కొనసాగిస్తామని, మన సాంకేతికతను ఇతర రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్నాయని నారాయణ అన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    ఆంధ్రప్రదేశ్

    New tourism policy: కొత్త పర్యాటక విధానంపై మార్గదర్శకాలు జారీచేసిన ప్రభుత్వం భారతదేశం
    Ap Government: ఏపీలో స్కూల్ విద్యార్థులకు ఉచితంగా కిట్‌లు.. ఈసారి ముందుగానే! భారతదేశం
    Nagababu: నాగబాబుకు కూటమి ప్రభుత్వంలో కీలక పదవి భారతదేశం
    Andhrapradesh: వాట్సప్‌ గవర్నెన్స్‌కు శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం.. వాట్సప్‌ ద్వారా పౌరసేవలు భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025