Drug Overdose: డ్రగ్స్ ఓవర్డోస్లో తమిళనాడు టాప్.. రెండో స్థానానికి పడిపోయిన పంజాబ్
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో డ్రగ్స్ ఓవర్డోస్ మరణాల్లో జాతీయ నేర గణాంకాల సంస్థ(NCRB) తాజా నివేదిక ప్రకారం తమిళనాడు ముందంజలో నిలిచింది. 2024లో దేశవ్యాప్తంగా నమోదైన 978 మరణాల్లో తమిళనాడులోనే 313 కేసులు నమోదవగా,పంజాబ్లో 106, మధ్యప్రదేశ్లో 90 కేసులు నమోదయ్యాయి. వరుసగా మూడు సంవత్సరాలు అగ్రస్థానంలో ఉన్న పంజాబ్ను తమిళనాడు వెనక్కి నెట్టింది. గతంలో 2022లో తగ్గిన మరణాలు మళ్లీ పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
వివరాలు
డార్క్ వెబ్ ద్వారా డ్రగ్స్ సరఫరా
రాష్ట్రంలో మెతాంఫెటమైన్, హైడ్రోపోనిక్ గంజాయి వంటి డ్రగ్స్ వినియోగం పెరుగుతుండగా, ట్రామడాల్, ఆల్ప్రాజోలామ్, నైట్రాజెపామ్ వంటి మందులు కూడా దుర్వినియోగం అవుతున్నాయి. డార్క్ వెబ్ ద్వారా MDMA, LSD వంటి డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు నివేదికలో వెల్లడైంది. ఇదే అంశం రాజకీయంగా కూడా వేడెక్కింది. 2026 అసెంబ్లీ ఎన్నికల ముందు AIADMK, DMK మధ్య ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా డ్రగ్స్ సమస్య తీవ్రంగా పెరుగుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.