NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Farmers March: శంభు సరిహద్దు వద్ద రైతులపై టియర్‌ గ్యాస్‌.. 17 మందికి గాయాలు
    తదుపరి వార్తా కథనం
    Farmers March: శంభు సరిహద్దు వద్ద రైతులపై టియర్‌ గ్యాస్‌.. 17 మందికి గాయాలు
    శంభు సరిహద్దు వద్ద రైతులపై టియర్‌ గ్యాస్‌.. 17 మందికి గాయాలు

    Farmers March: శంభు సరిహద్దు వద్ద రైతులపై టియర్‌ గ్యాస్‌.. 17 మందికి గాయాలు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 14, 2024
    04:08 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    శంభు సరిహద్దు వద్ద మరోసారి రైతుల ఉద్యమం తీవ్రంగా మారింది. తమ డిమాండ్ల పరిష్కారానికి గాను రైతులు చేపట్టిన 'దిల్లీ చలో' మార్చ్‌ను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి.

    హర్యానాపోలీసులు రైతులపై టియర్ గ్యాస్, జల ఫిరంగులను ప్రయోగించడంతో, సుమారు 17 మంది రైతులు గాయపడ్డారు.

    ఈ ఘటన అనంతరం, రైతు సంఘాల నేతలు తమ తదుపరి కార్యాచరణపై కీలక నిర్ణయం తీసుకున్నారు.

    దిల్లీకి పాదయాత్రను నిలిపివేసిన రైతు నేతలు, తమ డిమాండ్ల పరిష్కారానికి మరోసారి చర్చలు జరిపే అంశాన్ని సమీక్షించాలని తెలిపారు.

    ఈ రోజు మధ్యాహ్నం 'చలో ఢిల్లీ' మార్చ్ ప్రారంభమైనా హర్యానా పోలీసులు శంభు సరిహద్దు వద్ద రైతులను అడ్డుకున్నారు.

    Details

    రైతులను అడ్డుకోవడం మూడోసారి

    101 మంది రైతులు ఈ మార్చ్‌లో పాల్గొనగా, వారు కనీస మద్దతు ధర సహా 11 డిమాండ్ల సాధన కోసం ప్రదర్శన చేస్తున్నారు.

    ఇదే సందర్భంలో, రైతుల దిల్లీ చలో ప్రయత్నాన్ని అడ్డుకోవడం ఇదే మూడోసారి.

    డిసెంబర్ 6 నుంచి దిల్లీ వైపు వెళ్లేందుకు రైతులు ప్రయత్నించగా, ఇప్పటికే రెండు సార్లు పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ చర్యలపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

    హర్యానా ప్రభుత్వం, రైతుల 'ఢిల్లీ చలో' కార్యక్రమం నేపథ్యంలో అప్రమత్తమైంది.

    ముందస్తు జాగ్రత్తగా, శనివారం ఉదయం 6 గంటల నుంచి 17వ తేదీ అర్ధరాత్రి వరకు మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేయాలని ప్రకటించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    హర్యానా

    తాజా

    Ride Connect: అదిరే లుక్, టెక్ ఫీచర్లతో యాక్సెస్ స్కూటర్ కొత్త వెర్షన్ విడుదల స్కూటర్
    Operation Sindoor: ఉగ్రవాదంపై పాక్‌ పాత్రను ప్రపంచానికి చెప్పేందుకు ఏడుగురు ప్రతినిధులు సిద్ధం భారతదేశం
    Nayanthara: మెగాస్టార్-లేడీ సూపర్ స్టార్ కాంబో ఫిక్స్.. ధ్రువీకరించిన మూవీ టీం నయనతార
    Boycott turkey: 'బాయ్‌కాట్‌ తుర్కియే' ఉద్యమానికి మద్దతుగా మింత్రా, అజియో కీలక నిర్ణయం ఆపరేషన్‌ సిందూర్‌

    దిల్లీ

    Delhi Air Pollution: దిల్లీని కప్పేసిన దట్టమైన పొగమంచు.. పలు విమానాల దారి మళ్లింపు భారతదేశం
    Delhi Pollution: దిల్లీని కమ్మేసిన పొగమంచు.. 300లకు పైగా విమాన సర్వీసులు ఆలస్యం భారతదేశం
    Delhi Air Pollution: గ్రాఫ్ 3 అమలు చేయాలని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం.. ఏవి నిషేధించారంటే? భారతదేశం
    Delhi: మహిళా ఉద్యోగుల హక్కులకు గుర్తింపుగా దేశంలో మొదటి బస్‌ డిపో ఉద్యోగులు

    హర్యానా

    Haryana: ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొట్టిన కారు .. 6 మంది మృతి, 6 మందికి గాయాలు రోడ్డు ప్రమాదం
    PM Modi: అభివృద్ధిని చూసి 'ఇండియా' కూటమి నేతలకు నిద్ర పట్టడం లేదు: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    Manohar Lal Khattar: హర్యానా సీఎం మనోహర్ లాల్ రాజీనామా  మనోహర్ లాల్ ఖట్టర్
    Nayab Singh Saini: హర్యానా కొత్త ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనీ  ముఖ్యమంత్రి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025