NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana Assembly Special Session : తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు.. కులగణన, ఎస్సీ వర్గీకరణపై చర్చ
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Telangana Assembly Special Session : తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు.. కులగణన, ఎస్సీ వర్గీకరణపై చర్చ
    తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు.. కులగణన, ఎస్సీ వర్గీకరణపై చర్చ

    Telangana Assembly Special Session : తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు.. కులగణన, ఎస్సీ వర్గీకరణపై చర్చ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 04, 2025
    09:51 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శాసనసభ సమావేశాలకు సిద్ధమవుతోంది. ఈ సమావేశాల్లో ప్రధానంగా బీసీ కులగణన సర్వే నివేదిక, ఎస్సీ వర్గీకరణ రిపోర్ట్‌ను చర్చించనుంది.

    త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలనుకుంటున్న నేపథ్యంలో, రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.

    బీసీ రిజర్వేషన్ల పెంపుపై అసెంబ్లీ తీర్మానం

    తెలంగాణ సర్కార్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు కట్టుబడి ఉంది. అయితే, ఇందుకు పార్లమెంటులో చట్టసవరణ అవసరమని ప్రభుత్వం స్పష్టం చేయనుంది.

    ఈ అంశాన్ని అసెంబ్లీ తీర్మానంగా ఆమోదించి కేంద్రానికి పంపనుంది.

    బీఆర్ఎస్, బీజేపీ సభ్యులను చర్చలో భాగస్వామ్యం చేయడంతో పాటు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే చట్టసవరణ చేయాలని కేంద్రాన్ని కోరనుంది. పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 11 వరకు కొనసాగనున్నాయి.

    Details

     కులగణన సర్వే - నివేదిక సమర్పణ 

    తెలంగాణ ప్రభుత్వం 2023 ఫిబ్రవరి 4న కులగణన నిర్వహించాలనే నిర్ణయం తీసుకుంది.

    ఈ నెల 2న ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా క్యాబినెట్ సబ్ కమిటీకి కులగణన నివేదిక అందజేశారు.

    ఇందులో కులాల వారీగా జనాభా శాతం వివరాలు పొందుపరిచారు. అసెంబ్లీ సమావేశానికి ఒక గంట ముందు క్యాబినెట్ ముందు సబ్ కమిటీ ఈ నివేదికను ప్రవేశపెట్టనుంది.

    Details

    ఎస్సీ వర్గీకరణపై కీలక చర్చ 

    ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇచ్చిన నివేదికను క్యాబినెట్ ఆమోదించి అసెంబ్లీలో చర్చకు పెడుతుంది.

    ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వడంతో తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధమైంది.

    మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ సిఫారసుల మేరకు ఏకసభ్య కమిషన్ నియమించారు.

    ఈ కమిషన్ ఎస్సీ వర్గీకరణలో తలెత్తే సమస్యలు, పరిష్కార మార్గాలపై నివేదిక అందించింది. ఈ నివేదికను అసెంబ్లీలో ప్రస్తావించనున్నారు.

    Details

    బీసీ రిజర్వేషన్ల పెంపుపై సవాళ్లు 

    ఎస్సీ వర్గీకరణ అంశంలో పెద్దగా ఇబ్బందులు లేకపోయినా బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో కొన్ని సవాళ్లు ఎదురుకానున్నాయి.

    ప్రస్తుత 50% రిజర్వేషన్ పరిమితి కారణంగా, అదనపు రిజర్వేషన్లు కల్పించాలంటే కేంద్రం చట్టసవరణ అవసరం.

    తమిళనాడు ప్రభుత్వం 50శాతం మించి రిజర్వేషన్లు అమలు చేస్తున్న విధానాన్ని తెలంగాణ కూడా అనుసరించాలని భావిస్తోంది.

    Details

    న్యాయపరమైన చిక్కులు నివారించేందుకు లీగల్ ఎక్స్‌పర్ట్స్‌తో చర్చ 

    ఈ రిజర్వేషన్ల పెంపు ప్రక్రియలో ఎటువంటి న్యాయపరమైన ఇబ్బందులు ఎదురుకాకుండా ప్రభుత్వం లీగల్ ఎక్స్‌పర్ట్స్‌తో మంతనాలు జరుపుతోంది.

    ఈ చర్చల ఆధారంగా క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది.

    ఇక ఎస్సీ వర్గీకరణపై కమిషన్ ఇచ్చిన నివేదికకు ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందనేది ఉత్కంఠ రేపుతోంది.

    ఈ కీలక అసెంబ్లీ సమావేశాలు రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపుగా మారనున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    బీఆర్ఎస్
    బీజేపీ

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    తెలంగాణ

    Kishan Reddy: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ.. బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు కిషన్ రెడ్డి
    Engineering Fees: కొత్త ఫీజులకు దరఖాస్తు చేసిన కళాశాలలు.. వచ్చే విద్యాసంవత్సరం నుంచి కొత్త రుసుములు భారతదేశం
    Bamboo Cultivation: తెలంగాణలో 2 లక్షల ఎకరాల్లో వెదురు సాగు లక్ష్యంగా ప్రణాళికలు ప్రభుత్వం
    Grants: తెలంగాణకు కేంద్రం నుంచి నిధుల జాప్యం.. ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం

    బీఆర్ఎస్

    Hyderabad : ఇబ్రహీంపట్నంలో హై-టెన్షన్.. రాళ్లు రువ్వుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు ఇబ్రహీంపట్నం
    Kcr : రెండో విడత ప్రచారానికి గులాబీ బాస్ రెడి.. షెడ్యూల్ ఇదే భారతదేశం
    Gangula Kamalakar : 'ఎన్నికలపై గంగుల సంచలన వ్యాఖ్యలు.. మనకు ఆంధ్రోళ్లకే ఈ ఎన్నికలు' తెలంగాణ
    Minister Sathyavathi Rathod : మంగళహారతి పల్లెంలో డబ్బులు పెట్టారు..పోలీసులు కేసు పెట్టారు ప్రభుత్వం

    బీజేపీ

    Naib Singh Saini: అక్టోబరు 17న హర్యానా సీఎంగా నాయబ్‌సింగ్‌ సైనీ ప్రమాణస్వీకారం హర్యానా
    Haryana: హర్యానాలో బీజేపీ శాసనసభాపక్షానికి నాయబ్ సింగ్ సైనీ నాయకత్వం.. ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణస్వీకారం  హర్యానా
    Atishi: శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉంది: అతిషి మార్లెనా అతిషి మార్లెనా
    Delhi BJP chief : యమునా నదిలో దిల్లీ బీజేపీ అధ్యక్షుడు స్నానం.. శ్వాసకోశ ఇబ్బందులతో ఆస్పత్రిలో చేరిక దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025