
Telangana: సుపరిపాలనకు నూతన ఆవిష్కరణలు.. డిజిటల్ రూపంలోకి తెలంగాణ కేబినెట్ ఫైల్స్
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ప్రజలకు వేగవంతమైన, పారదర్శక సేవలందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా రంగంలో కీలకమైన సంస్కరణలు చేపడుతోంది. ఈ క్రమంలో అన్ని కేబినెట్ ఫైల్స్ను డిజిటల్ ఫార్మాట్లోకి మారుస్తోంది. ఇకపై ఫైల్స్ కేవలం కాగితపు రూపంలో కాకుండా, డిజిటల్ మాధ్యమంలోనే చేరవేయనున్నారు. అంతేకాక, ఇకపై నెలకు రెండు సార్లు కేబినెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశాల తేదీలను ముందుగానే ప్రకటించే విధానాన్ని కూడా తీసుకువచ్చేందుకు సిద్ధమవుతోంది.
వివరాలు
18 సార్లు కేబినెట్ సమావేశాలు
రాష్ట్రస్థాయిలో పాలన పురోగతిని సమీక్షించేందుకు ప్రతి మూడు నెలలకు ఒకసారి 'స్టేటస్ రిపోర్టు' మీటింగ్ నిర్వహించే ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేసింది. అంతేగాక, చేపట్టిన చర్యలపై 'యాక్షన్ టేకెన్ రిపోర్ట్' ఆధారంగా ప్రత్యేకంగా సమీక్షలు,సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటి వరకు మొత్తం 18 సార్లు కేబినెట్ సమావేశాలు నిర్వహించడం గమనార్హం.