
Telangana: నేడు తెలంగాణ క్యాబినెట్ భేటీ.. రైతు భరోసా, స్థానిక ఎన్నికలపై కీలక చర్చలు?
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం మంత్రులతో సమావేశం కానున్నారు. ఈ సమావేశం హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరుగనుంది.
ఇటీవల ప్రమాణస్వీకారం చేసిన కొత్త మంత్రులు గడ్డం వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ ఈ భేటీలో తొలిసారి పాల్గొననున్నారు.
వారికి ఈ సందర్భంగా పరిచయ కార్యక్రమం జరగనుండగా, ముఖ్యమంత్రి వారి శాఖల బాధ్యతలు, ప్రభుత్వం నిబద్ధతలపై దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది.
ఈ క్యాబినెట్ సమావేశంలో ముఖ్యంగా నాలుగు ప్రధాన అంశాలపై చర్చ జరుగనుంది.
వానాకాలం ముందు రైతులకు పెట్టుబడి సహాయం అందించాలన్న దృష్టితో రైతు భరోసా పథకం అమలు, గత యాసంగి బకాయిల చెల్లింపులు ఈసారి వారం రోజుల్లోపు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్న దిశగా చర్చ జరుగనుంది.
Details
జూన్ నెలాఖరులోగా నోటిఫికేషన్
రాజీవ్ యువ వికాసం పథకం పురోగతి, యువతకు ఉపాధి, నైపుణ్యాభివృద్ధిపై చేపట్టిన కార్యక్రమాల సమీక్ష కూడా ఈ సమావేశంలో కీలక అంశంగా ఉండనుంది.
ఇతర ముఖ్య అంశంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సీఎం మంత్రుల అభిప్రాయాలను తెలుసుకోనున్నారు.
ముందుగా పంచాయతీ ఎన్నికలా? లేదా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలాయా? అనే దానిపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జూన్ నెలాఖరులోగా నోటిఫికేషన్ వస్తుందని సంకేతాలిచ్చిన సంగతి తెలిసిందే.
Details
ఎన్నికల షెడ్యూల్ పై స్పష్టత వచ్చే అవకాశం
ఈ నేపథ్యంలో ఈ సమావేశం ద్వారా ఎన్నికల షెడ్యూల్పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
అంతేకాకుండా కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ డ్యామేజ్ సేఫ్టీ అథారిటీ (NDMA), విజిలెన్స్ నివేదికలు కూడా ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చే అవకాశముంది.
ప్రస్తుతం విచారణలో ఉన్న ఇతర ప్రాజెక్టులపైనా చర్చ సాగనుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టు విషయమై కూడా తెలంగాణ ప్రభుత్వం స్పందన చర్చకు రావొచ్చని సమాచారం.
మొత్తం మీద, ఈ రోజు జరగనున్న క్యాబినెట్ భేటీ పాలనాపరంగా ఎంతో కీలకంగా మారనుంది.