NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana elections: తెలంగాణ ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం.. తొలి రిజల్ట్స్ భద్రాచలం నుంచే.. 
    తదుపరి వార్తా కథనం
    Telangana elections: తెలంగాణ ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం.. తొలి రిజల్ట్స్ భద్రాచలం నుంచే.. 
    తెలంగాణ ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం.. తొలి రిజల్ట్స్ భద్రాచలం నుంచే..

    Telangana elections: తెలంగాణ ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం.. తొలి రిజల్ట్స్ భద్రాచలం నుంచే.. 

    వ్రాసిన వారు Stalin
    Dec 02, 2023
    11:15 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

    రాష్ట్రవ్యాప్తంగా 49కేంద్రాల్లో ఆదివారం ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందని ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్ తెలిపారు.

    కౌంటింగ్‌లో ఉన్న సిబ్బంది, పోటీలో ఉన్న అభ్యర్థుల ఏజెంట్లు రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 5గంటలకే ఆయా కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.

    ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు. తర్వాత ఈవీఎంలను లెక్కిస్తారు.

    ఒక్కో నియోజకవర్గానికి 14టేబుళ్లు, పెద్ద నియోజకవర్గం అయితే మరిన్ని కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేశారు.

    1.80లక్షల మంది పోస్టల్ బ్యాలెట్లను వినియోగించుకుట్లు ఈసీ తెలిపింది.

    119అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను మొత్తం 2,290మంది అభ్యర్థులు బరిలో ఉండగా అందులో 221మంది మహిళలు ఉన్నారు. తెలంగాణలో 71.34 శాతం పోలింగ్ నమోదైంది.

    ఈసీ

    49 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు

    రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 49 కౌంటింగ్ కేంద్రాల్లో కేంద్ర బలగాలు, రాష్ట్ర సాయుధ బలగాలు, స్థానిక పోలీసులతో సహా మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు.

    అన్ని చోట్ల కలిపి దాదాపు 40 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసులను మోహరించారు.

    అన్ని నియోజకవర్గాలకు కలిపి 1798 కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేశారు. మొత్తం 2417 రౌండ్లలో ఓట్లను లెక్కిస్తారు.

    ఒక్కో టేబుల్ వద్ద ఒక కౌంటింగ్ సూపర్‌వైజర్, ఒక కౌంటింగ్ అసిస్టెంట్, ఒక మైక్రో అబ్జర్వర్, కౌంటింగ్ సిబ్బంది ఓట్లను లెక్కించనున్నారు.

    ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో 28 చొప్పున టేబుళ్లను ఏర్పాటు చేశారు.

    ఈసీ

    మధ్యాహ్నం 12 గంటలకు తొలి ఫలితం

    మధ్యాహ్నం 12 గంటలకు చిన్న నియోజకవర్గం ఫలితం వెలువడే అవకాశం ఉంది. రాష్ట్రంలో అతి కౌంటింగ్ ఉన్నది భద్రాచలంలోనే కావడంతో తొలి ఫలితం ఇక్కడి నుంచే వచ్చే అవకాశం ఉంది.

    అన్ని కేంద్రాల్లో చివరి రౌండ్ కౌంటింగ్ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని ఎన్నికల సిబ్బంది, పోలీసు సిబ్బందిని ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్ ప్రత్యేకంగా ఆదేశించారు.

    తెలంగాణలో అసెంబ్లీకి 119 మంది సభ్యులను ఎన్నుకునేందుకు 3 కోట్ల 26 లక్షల మంది ఓటర్లలో మొత్తం 71.34 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

    కౌంటింగ్ పూర్తయ్యే వరకు రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని డీజీపీ వెల్లడించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    అసెంబ్లీ ఎన్నికలు
    తాజా వార్తలు
    ఎన్నికల సంఘం

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    తెలంగాణ

    Alampur : అలంపూర్ లో బీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్ లో చేరిన ఎమ్యెల్యే  బీఆర్ఎస్
    Telangana Elections : తెలంగాణలో 35,635 పోలింగ్ కేంద్రాలు.. ఎన్నివేల ఈవీఎంలో తెలుసా ఎన్నికల సంఘం
    Telangana Elections: బర్రెలక్క భద్రతపై ఎన్నికల సంఘానికి హైకోర్టు కీలక ఆదేశాలు  హైకోర్టు
    IT Raids: బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ దాడులు.. భారీగా నగదు స్వాధీనం  తాండూరు

    అసెంబ్లీ ఎన్నికలు

    Telangana TDP: టీడీపీ కీలక నిర్ణయం.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరం తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకపోవడం వల్ల ఏ పార్టీ లాభం?  తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    తెలంగాణలోని ఆ 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4గంటల వరకే పోలింగ్: ఈసీ  తెలంగాణ
    Congress Crowdfunding: 2024 సార్వత్రిక ఎన్నికల నిధులకోసం 'క్రౌడ్ ఫండింగ్'పై కాంగ్రెస్ ఫోకస్  కాంగ్రెస్

    తాజా వార్తలు

    High Court: చంద్రబాబు, కొల్లు రవీంద్రపై తొందరపాటు చర్యలొద్దు: ఏపీ హైకోర్టు ఆదేశం  చంద్రబాబు నాయుడు
    Personal Loan నిబంధనలను ఆర్‌బీఐ కఠినతరం చేసినా.. ఇలా చేస్తే పొందడం చాలా సులభం  రుణం
    Uttarakhand tunnel: రెస్క్యూ ఆపరేషన్‌లో 'రాట్ హోల్' నిపుణులు.. 5మీటర్ల దూరంలో కార్మికులు  ఉత్తరాఖండ్
    Congress: నేడు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక ప్రచారం షెడ్యూల్ ఇదే  కాంగ్రెస్

    ఎన్నికల సంఘం

    తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు, ఈవీఎంలను తనిఖీ చేశాం: సీఈఓ  తెలంగాణ
    తెలంగాణలో నేటి నుంచి మూడు రోజుల పాటు కేంద్ర ఎన్నికల బృందం పర్యటన తెలంగాణ
    5 రాష్ట్రాలకు ఎన్నికలు తేదీ ఖరారు చేసిన ఎన్నికల సంఘం  భారతదేశం
    నేడు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించనున్న ఎన్నికల సంఘం భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025