NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఈ నెలాఖరులోగా ఖాతాల్లో నిధులు జమ
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Telangana: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఈ నెలాఖరులోగా ఖాతాల్లో నిధులు జమ
    రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఈ నెలాఖరులోగా ఖాతాల్లో నిధులు జమ

    Telangana: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఈ నెలాఖరులోగా ఖాతాల్లో నిధులు జమ

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 14, 2025
    03:39 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో రైతులకు శుభవార్తను అందించనుంది.

    'రైతు భరోసా' పథకంలోని నిధులను రైతుల ఖాతాల్లోకి జమ చేయడాన్ని లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

    నాలుగు ఎకరాల నుండి పది ఎకరాల వరకు భూమి కలిగిన రైతులకు మే నెలాఖరులోగా నిధులను విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు సమాచారం.

    వివరాలు 

    నాలుగు ఎకరాల లోపు ఉన్న రైతులకు ఇప్పటికే పంపిణీ 

    రైతుభరోసా పథకానికి అనుగుణంగా, ప్రతి పంట సీజన్‌కు ఎకరాకురూ.6,000 చొప్పున,సంవత్సరానికి రెండు సీజన్లకు కలిపిరూ.12,000 ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి జమ చేస్తోంది.

    ఈఏడాది జనవరి 26న ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, ఫిబ్రవరి 5, 11 తేదీల్లో రెండు విడతల్లో నాలుగు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు నిధులను జమ చేశారు.

    మిగిలిన రైతులకు ఈ నెలాఖరులోగా నిధులు

    నాలుగు ఎకరాలకు మించి భూమి కలిగిన రైతులకు ఇప్పటి వరకు ఈ పథకంలోని సాయం అందలేదు.

    ఈనేపథ్యంలో,వారి ఖాతాల్లో పెట్టుబడి సాయంగా'రైతు భరోసా' నిధులను మే చివరి వారంలోగా జమ చేయాలని ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.

    ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ ఇప్పటికే సిద్ధమవుతోంది.

    వివరాలు 

    రాబోయే వారంలో సమీక్ష 

    రైతు భరోసా నిధుల చెల్లింపులపై సీఎం రేవంత్ రెడ్డి రాబోయే వారంలో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్ష అనంతరం పెండింగ్‌లో ఉన్న చెల్లింపులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

    సీజన్‌కు రూ.6,000 చొప్పున..

    రైతు భరోసా కింద ప్రభుత్వం ఒక సీజన్‌కు ఒక్కో ఎకరాకు రూ.6,000 చొప్పున నిధులు అందిస్తోంది. గత రబీ సీజన్‌లో కూడా ఇదే విధంగా నాలుగు ఎకరాల లోపు రైతులకు మూడు దశల్లో నిధులు పంపిణీ చేశారు.

    వివరాలు 

    35 లక్షల మంది రైతులు లబ్ధిదారులు 

    ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా నాలుగు ఎకరాలకు మించిన భూమిని కలిగి ఉన్న రైతుల సంఖ్య సుమారు 35 లక్షలుగా ప్రభుత్వం అంచనా వేసింది.

    రబీ సీజన్‌ నిధులు ఇంకా అందని ఈ రైతులు ప్రస్తుతం రైతు భరోసా సాయంకోసం వేచి చూస్తున్నారు.

    మే నెలాఖరులోగా వీరి ఖాతాల్లో నిధులు జమ కానున్నాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

    వివరాలు 

    జూలై నుంచి ఖరీఫ్ నిధులు 

    జూన్ నెలలో ఖరీఫ్ పంట సీజన్ ప్రారంభమవుతుంది.

    అందువల్ల రబీ చెల్లింపులను జూన్ లోపల పూర్తి చేసి, జూలై నుంచి ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా నిధుల చెల్లింపులను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

    ఈ మేరకు త్వరలో సీఎం అధికారులతో సమావేశం నిర్వహించి తుదినిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    Telangana: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఈ నెలాఖరులోగా ఖాతాల్లో నిధులు జమ తెలంగాణ
    Gold Rates: అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గిన నేపథ్యంలో.. కుప్పకూలిన బంగారం ధర.. తులం రేటు ఎంతంటే ? బంగారం
    cyber attacks: రెచ్చిపోయిన్‌ పాక్‌.. 15 లక్షల పైగా సైబర్ దాడులు.. భారత్ ఎలా అధిగమించిందంటే..? సైబర్ దాడులు
    Virat Kohli-Anushka Sharma: కోహ్లీ రిటైర్మెంట్‌పై ఇన్‌స్టాలో అనుష్క శర్మ స్టోరీ వైరల్‌ విరాట్ కోహ్లీ

    తెలంగాణ

    TG ENC: గోదావరి, కృష్ణా నదీ యాజమాన్య బోర్డులకు.. బనకచర్ల లింక్ విషయం ప్రస్తావన భారతదేశం
    Telangana: తెలంగాణ ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్ కాంగ్రెస్
    Ranga Reddy: ప్రియుడు కోసం భర్త ప్రాణాలు తీసిన భార్య రంగారెడ్డి
    Telangana: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల్లో 41 లక్షల మంది అనర్హులే ప్రభుత్వం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025