NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana: తెలంగాణలోని అన్ని దేవాలయాలలో ఆన్‌లైన్ టికెట్ వ్యవస్థ 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Telangana: తెలంగాణలోని అన్ని దేవాలయాలలో ఆన్‌లైన్ టికెట్ వ్యవస్థ 
    తెలంగాణలోని అన్ని దేవాలయాలలో ఆన్‌లైన్ టికెట్ వ్యవస్థ

    Telangana: తెలంగాణలోని అన్ని దేవాలయాలలో ఆన్‌లైన్ టికెట్ వ్యవస్థ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 11, 2025
    04:29 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇటీవల కొమురవెల్లి, బల్కంపేట, బాసర వంటి ప్రముఖ దేవాలయాల్లో టికెట్ల దుర్వినియోగం, అక్రమ విక్రయాలు వెలుగులోకి రావడంతో, రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

    ఇకపై అన్ని రకాల టికెట్లను ఆన్లైన్ ద్వారా మాత్రమే భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించబడింది.

    మాన్యువల్ టికెట్లను పునఃపరిశీలించకుండా, వాటిని దుర్వినియోగం చేయడం, నకిలీ టికెట్ల చలామణి వంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలపై ప్రభుత్వం తీవ్రమైన దృష్టి పెట్టింది.

    వివరాలు 

    ఈ నెల 15న మంత్రి సమీక్షా సమావేశం 

    ఈ అంశంపై ఈ నెల 15వ తేదీన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

    ఈ సమీక్ష అనంతరం ఆన్లైన్ టికెట్ల విధానాన్ని అధికారికంగా అమలు చేయడం ప్రారంభం కానుంది.

    ఈ వ్యవస్థ ద్వారా భక్తులకు పారదర్శకంగా సేవలు అందించడమే కాకుండా, దేవాలయాల్లో జరిగే ఆదాయ, ఖర్చుల ప్రక్రియపై కఠినంగా పర్యవేక్షణ కొనసాగించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది.

    మరోవైపు, భక్తులు ఇక టికెట్ల కోసం ఆలయాలకు ప్రయాణించాల్సిన అవసరం లేకుండా, ముందే ఇంటి నుంచే ఆన్లైన్ ద్వారా టికెట్లు పొందే వీలుంటుంది.

    వివరాలు 

    ప్రస్తుత పరిస్థితి - అవకతవకలు వెలుగులోకి 

    ప్రస్తుతం రాష్ట్రంలోని వేములవాడ, భద్రాచలం, యాదగిరిగుట్ట, బాసర, భద్రకాళి, చెర్వుగట్టు, కొమురవెల్లి తదితర ప్రముఖ ఆలయాల్లో టికెట్ల విక్రయాల్లో అనేక అక్రమాలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు.

    ముఖ్యంగా వీఐపీ టికెట్ల విక్రయాల్లో తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. రోజూ 200 నుంచి 500 టికెట్లు వరకూ భక్తులకు నిబంధనలు అతిక్రమించి విక్రయించబడుతున్నట్లు సమాచారం.

    సాధారణంగా రూ.500కు లభించాల్సిన టికెట్లు, రూ.2,000 నుంచి రూ.5,000 వరకు అమ్ముతూ కొందరు సిబ్బంది, మధ్యవర్తులు భారీగా లాభాలు సంపాదిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

    వివరాలు 

    నకిలీ టికెట్లు, రీసైక్లింగ్ దందాలు 

    గతంలో బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో టికెట్ కౌంటర్ సిబ్బంది నకిలీ టికెట్లు ముద్రించి విక్రయించిన సంఘటన కలకలం రేపింది.

    ఒక్కరోజే రూ.31,000 విలువైన నకిలీ టికెట్లు విక్రయించి ఆదాయం పొందినట్లు వెలుగులోకి రావడంతో, భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత చెలరేగింది.

    అనంతరం ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది.

    చెర్వుగట్టు దేవాలయంలోనూ టికెట్లను రీసైకిల్ చేయడం, పార్కింగ్ ఫీజుల విషయంలో కూడా దందాలు వెలుగుచూశాయి.

    బాసర ఆలయంలో లడ్డూ టికెట్ల చుట్టూ ఏర్పడిన అక్రమాల నేపథ్యంలో ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేయగా, నలుగురు తాత్కాలిక సిబ్బందిని విధుల నుంచి తొలగించారు.

    వివరాలు 

    వీఐపీ టికెట్ల కేటాయింపుపైనా చర్చ 

    ఈ మొత్తం వ్యవస్థలో వీఐపీ టికెట్ల కేటాయింపుపైనా సమగ్ర పరిశీలన అవసరమైందని తెలుస్తోంది.

    పెద్ద సంఖ్యలో భక్తులు సాధారణ క్యూలైన్లలో నిన్నడలేక, వీఐపీ టికెట్ల కోసం ప్రయత్నిస్తున్న సందర్భాలను కొందరు తమ లాభాల కోసం వినియోగించుకుంటున్నారు.

    దేవాలయాల్లో కొంతమంది సిబ్బంది, ఏండ్ల తరబడి ఒకే చోట పనిచేస్తూ, స్వచ్చందంగా వ్యవహరిస్తున్నారని భక్తుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    2025 Yezdi Adventure:సరికొత్త 2025 యెజ్డి అడ్వెంచర్ లాంచ్.. ధర ఎంతంటే?  ఆటో మొబైల్
    World Environment Day 2025: నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం.. ప్లాస్టిక్ కాలుష్యాన్ని జయిద్దాం అనే థీమ్‌తో వేడుకలు ముఖ్యమైన తేదీలు
    11 years of NDA: ఎన్డీయే ప్రభుత్వానికి నిన్నటితో 11 ఏళ్లు.. ఆసక్తికర పోస్ట్ చేసిన మోదీ  నరేంద్ర మోదీ
    Stampede in India: గత ఏడాది కాలంలో దేశంలో జరిగిన తొక్కిసలాట ఘటనలు ఇవే.. భారతదేశం

    తెలంగాణ

    Kamareddy: కామారెడ్డిలో విషాదం.. చెరువులో పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి కామారెడ్డి
    TGPSC: తెలంగాణ గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌ విడుదల.. మహిళా అభ్యర్థి టాప్ ఇండియా
    Telangana: ఉగాది కానుకగా రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం.. సీఎం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి
    Betting App Case: బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై సిట్‌ ఏర్పాటు.. బృందంలో పలువురు ఎస్పీలు, అదనపు ఎస్పీలు భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025