NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Betting App Case: బెట్టింగ్ యాప్స్ కేసులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం 
    తదుపరి వార్తా కథనం
    Betting App Case: బెట్టింగ్ యాప్స్ కేసులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం 
    బెట్టింగ్ యాప్స్ కేసులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

    Betting App Case: బెట్టింగ్ యాప్స్ కేసులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 26, 2025
    10:01 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ ప్రభుత్వం బెట్టింగ్ యాప్స్ కేసులపై కీలక నిర్ణయం తీసుకుంది.

    బెట్టింగ్ యాప్స్‌కు సంబంధించిన కేసులను సీఐడీకి బదిలీ చేయాలని తెలంగాణ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.

    హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో నమోదైన అన్ని కేసులను ఇకపై సీఐడీ విచారణ జరిపించనుంది.

    ఇప్పటికే హైదరాబాద్‌లో 11 మంది బెట్టింగ్ యాప్స్ ప్రచారకర్తలపై కేసులు నమోదయ్యాయి.

    సైబరాబాద్‌లో బెట్టింగ్ యాప్స్‌కు ప్రచారం చేసిన 25 మంది సెలబ్రిటీలపై కేసులు నమోదయ్యాయి.

    అగ్రహీరోల నుంచి యూట్యూబర్ల వరకు ఎవరినీ వదిలిపెట్టకుండా పోలీసులు కేసులు నమోదు చేశారు.

    అంతేకాదు, ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ కంపెనీలపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. కొన్ని సినీ ప్రముఖులను విచారణకు కూడా పిలిచారు.

    వివరాలు 

    రానున్న రోజుల్లో మరిన్ని వాస్తవాలు బయటపడే అవకాశం

    బెట్టింగ్ యాప్స్ కేసులో పోలీసులు సెలెబ్రిటీలను ఇప్పటికే విచారిస్తున్నారు.బుల్లితెర నటి రీతూ చౌదరి,యాంకర్ విష్ణు ప్రియా,యాంకర్ శ్యామల పోలీసులు ఎదుట విచారణకు హాజరయ్యారు.

    మియాపూర్ పోలీసులు ఎవరెవరు ఏ యాప్స్‌కు ప్రచారం చేశారో కనుగొన్నారు.పలు బెట్టింగ్ కంపెనీలపై కేసులు నమోదు చేస్తున్నారు.

    జంగిల్ రమ్మీ యాప్‌కు రానా, ప్రకాశ్ రాజ్ ప్రచారం చేసినట్లు, ఏ23 యాప్‌కు విజయ్ దేవరకొండ, యోలో 247 యాప్‌కు మంచు లక్ష్మి, ఫెయిర్ ప్లే లైవ్ యాప్‌కు హీరోయిన్ ప్రణీత, జీట్ విన్ యాప్‌కు నిధి అగర్వాల్, ఆంధ్ర 365 యాప్‌కు నటి శ్యామల ప్రచారం చేసినట్లు గుర్తించారు.

    ఇప్పుడు ఈ కేసులు సీఐడీకి బదిలీ అవ్వడంతో రానున్న రోజుల్లో మరిన్ని వాస్తవాలు బయటపడే అవకాశం ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    Pakistani official: పాకిస్తాన్‌కి షాక్ ఇచ్చిన భారత్.. హైకమిషన్ ఉద్యోగిని బహిష్కరించిన ఇండియా..కారణం ఏంటంటే..? పాకిస్థాన్
    CJI Sanjiv Khanna: 'ఇకపై ఎటువంటి అధికారిక పదవులను చేపట్టే ఉద్దేశం లేదు': జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా సంజీవ్ ఖన్నా
    Kolkata airport: కోల్‌కతాలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి' బాంబు బెదిరింపు.. హైఅలర్ట్‌ కోల్‌కతా
    Jinnah Tower: గుంటూరులో పాకిస్తాన్ వ్యవస్థాపకుడి పేరుతో స్తూపం ఎందుకు ఉంది? దాని చరిత్ర ఏమిటి? గుంటూరు జిల్లా

    తెలంగాణ

    TGPSC Group-3: తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్షల ఫలితాలు విడుదల.. జనరల్‌ ర్యాంకింగ్స్‌ జాబితా ఇదిగో.. భారతదేశం
    TG News: తెలంగాణలో మండుతున్న ఎండలు.. 40 డిగ్రీలకుపైగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు భారతదేశం
    T- SAFE App: సురక్షిత ప్రయాణానికి 'టీ-సేఫ్‌'.. 35 వేలకుపైగా ప్రయాణాలకు భద్రతా వలయం! ఇండియా
    #NewsBytesExplainer: తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన మావోయిస్టుల ఆధిపత్యం.. ఉనికి ప్రశ్నార్థకమా? ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025