NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / మంగపేటలోని 23 గ్రామాలపై హైకోర్టు సంచలన తీర్పు.. 75 ఏళ్లకు గిరిజనులకు అనుకూలమైన తీర్పు 
    తదుపరి వార్తా కథనం
    మంగపేటలోని 23 గ్రామాలపై హైకోర్టు సంచలన తీర్పు.. 75 ఏళ్లకు గిరిజనులకు అనుకూలమైన తీర్పు 
    75 ఏళ్లకు గిరిజనులకు అనుకూలమైన తీర్పు

    మంగపేటలోని 23 గ్రామాలపై హైకోర్టు సంచలన తీర్పు.. 75 ఏళ్లకు గిరిజనులకు అనుకూలమైన తీర్పు 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jul 05, 2023
    02:26 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    చరిత్రాత్మకమైన కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ములుగు జిల్లా మంగపేట మండలంలోని 23 గ్రామాలు షెడ్యూల్‌ ప్రాంతాలేనని గుర్తించింది. ఈ మేరకు ఉన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది.

    సదరు గ్రామాలన్నీ రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్‌ పరిధిలోకే వస్తాయని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ బెంచ్‌ ఆదేశాలు జారీ చేసింది.

    ఈ విషయంలో సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పులో తాము జోక్యం చేసుకోలేమని సీజే ధర్మాసనం పేర్కొంది. ఈ నేపథ్యంలోనే గిరిజనేతరుల అప్పీల్‌ను కొట్టి వేస్తూ తీర్పు వెలువరించింది.

    DETAILS

    అవన్నీ షెడ్యూల్ స్టేటస్ కలిగిన గ్రామాలే : హైకోర్టు

    దాదాపు 75 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం అనంతరం తీర్పు అనుకూలంగా రావడంతో ఆయా గ్రామాల్లోని గిరిజనులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

    మంగపేట మండలంలోని 23 గ్రామాలన్నీషెడ్యూల్ 5 పరిధిలోకే వస్తాయని హైకోర్టు స్పష్టం చేసింది.

    రాజ్యాంగంలోని షెడ్యూల్ - 5 అంటే గిరిజనులకు, ఆదివాసీయులకు సంబంధించిన ప్రత్యేక ప్రాంతాలు, వాటి హక్కులు. ఆయా ఏరియాల్లో ఎస్టీలకు ప్రత్యేకంగా భూ హక్కులు కల్పించబడతాయి.

    రాజ్యాంగం ప్రకారం ఒక నిర్థిష్టమైన భూ భాగాన్ని ఐదో షెడ్యూల్ పరిధిలోకి తీసుకువచ్చినప్పుడు గిరిజనుల నుంచి గిరిజనేతరులకు భూ బదలాయింపు జరగదు.ఒకవేళ బలవంతంగా చేసినా కోర్టులు వాటిని రాజ్యంగా విరుద్ధంగా ప్రకటిస్తూ కొట్టేస్తాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హైకోర్టు
    తెలంగాణ

    తాజా

    Motivation: అవమానాలు తాత్కాలికం.. మీ విలువే శాశ్వతం! జీవితం
    MI vs DC: ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన ముంబై.. ఇంటిబాట పట్టిన ఢిల్లీ ముంబయి ఇండియన్స్
    Operation Sindoor: పాకిస్థాన్ అధికారిని అవాంఛనీయ వ్యక్తిగా ప్రకటించిన భారత్.. 24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశం పాకిస్థాన్
    Mohan Lal: మోహన్‌లాల్ పుట్టినరోజున 'వృషభ' ఫస్ట్ లుక్ విడుదల.. భీకర యోధుడి అవతారంలో లాలెట్టన్ మాలీవుడ్

    హైకోర్టు

    జీఓ నెం.1ను సస్పెండ్ చేసిన ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఆంధ్రప్రదేశ్
    ఐసీఐసీఐ-వీడియోకాన్ రుణం కేసు: వేణుగోపాల్ ధూత్‌కు బెయిల్ మంజూరు బ్యాంక్
    సుప్రీంకోర్టు ఆదేశాలు: జీఓ నెం.1 పిటిషన్‌పై 23న ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ ఆంధ్రప్రదేశ్
    డోలో-650 తయారీదారుపై ఈఎస్ఐ కుంభకోణం ఆరోపణ, అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ ఉత్తర్‌ప్రదేశ్

    తెలంగాణ

    తెలంగాణ: సర్కారు పాఠశాలల్లో రాగి‌జావ పంపిణీని ప్రారంభించిన ప్రభుత్వం విద్యా శాఖ మంత్రి
    సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్.. డబ్బులు, మద్యం పంచుకుండా గెలిపించాలని సూచన సిరిసిల్ల
    ముడుమాల్‌ మెన్హిర్స్‌ కు యునెస్కో గుర్తింపు కోసం తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం పర్యాటకం
    రేపు రైల్వే కోచ్‌ ప్యాక్టరీని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025