LOADING...
Telangana Speaker: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నేడు తెలంగాణ స్పీకర్‌ తీర్పు 
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నేడు తెలంగాణ స్పీకర్‌ తీర్పు

Telangana Speaker: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నేడు తెలంగాణ స్పీకర్‌ తీర్పు 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 17, 2025
09:38 am

ఈ వార్తాకథనం ఏంటి

ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ ఈరోజు తుది నిర్ణయం ప్రకటించనున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి, ప్రకాశ్‌ గౌడ్‌, అరికెపూడి గాంధీపై దాఖలైన పిటిషన్లను పరిశీలించిన అనంతరం స్పీకర్‌ తీర్పు వెల్లడించనున్నారు. ఈ తీర్పును మధ్యాహ్నం 3.30 గంటలకు ఓపెన్‌ కోర్టులో ప్రకటించనున్నారు. అలాగే, తీర్పుకు సంబంధించిన పూర్తి వివరాలను శాసనసభ అధికారిక వెబ్‌సైట్‌లో అధికారులు అప్‌లోడ్‌ చేయనున్నారు.

వివరాలు 

సుప్రీంకోర్టును ఆశ్రయించిన భారత రాష్ట్ర సమితి

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ భారత రాష్ట్ర సమితి సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై అత్యున్నత న్యాయస్థానంలో పలుమార్లు విచారణ జరిగింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు, ఆ దిశానిర్దేశాలను అనుసరించి స్పీకర్‌ తన నిర్ణయాన్ని ఈరోజు వెల్లడించనున్నారు.

Advertisement