Telangana: వారు పార్టీ మారినట్లే ఆధారాలు లేవు.. ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు కొట్టివేసిన స్పీకర్
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించిన వివాదంపై స్పీకర్ విచారణ చివరి దశకు చేరింది. సుప్రీంకోర్టు ఇవ్వగా గడువు రేపటితో ముగియనుండగా, స్పీకర్ గడ్డం ప్రసాద్ ఏ నిర్ణయం తీసుకుంటారన్న ఉత్కంఠ వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ఫిరాయించిన ఎమ్మెల్యేలపై కేసును పరిశీలించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కీలక తీర్పును ప్రకటించారు. కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లుగా ఎటువంటి ఆధారాలు లేవని స్పష్టంచేశారు. అందువల్ల, MLAల అనర్హతకు సంబంధించిన పిటిషన్లను స్పీకర్ రద్దు చేశారు. ఈ విధంగా ఐదుగురు ఎమ్మెల్యేల పిటిషన్లను కొట్టి వేసారు. అరెకపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, కృష్ణమోహన్, ప్రకాశ్గౌడ్, గూడెం మహిపాల్కు ఈ తీర్పు ఊరటను కలిగించింది. అయితే, మరొక ఐదుగురు ఎమ్మెల్యేలపై తుది తీర్పు ఇంకా రావాల్సి ఉంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వారు పార్టీ మారినట్లే ఆధారాలు లేవు.. MLAల అనర్హత పిటిషన్లపై స్పీకర్ కీలక తీర్పు
బ్రేకింగ్ న్యూస్
— VAVILALA RAJASHEKHAR (@VRajeshekar) December 17, 2025
పార్టీ ఫిరాయించిన ఐదుగురు ఎమ్మెల్యేలపై వేటు వేయడానికి నిరాకరించిన స్పీకర్ గడ్డం ప్రసాద్
ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు కొట్టివేసిన స్పీకర్
అనర్హత వేటుకు తగిన ఆధారాలు లేవని, ఆ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని తెలిపిన స్పీకర్ గడ్డం ప్రసాద్ pic.twitter.com/CtbFlnOZAG