NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / PM-KUSUM: 'పీఎం కుసుమ్‌' అమలుకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు
    తదుపరి వార్తా కథనం
    PM-KUSUM: 'పీఎం కుసుమ్‌' అమలుకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు
    'పీఎం కుసుమ్‌' అమలుకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు

    PM-KUSUM: 'పీఎం కుసుమ్‌' అమలుకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 14, 2024
    01:02 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రాష్ట్రంలో రైతులకు అదనపు ఆదాయం కల్పించేందుకు ప్రభుత్వం ఓ వినూత్న నిర్ణయం తీసుకుంది.

    పంటల సాగుతోపాటు వ్యవసాయ భూముల్లో సౌరవిద్యుత్ ఉత్పత్తికి అనుమతి ఇస్తూ, ఈ పథకాన్ని అమలు చేయడానికి రాష్ట్ర ఇంధనశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

    'ప్రధాన మంత్రి కిసాన్ ఊర్జ సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్' (పీఎం కుసుమ్) పథకానికి కేంద్రం అనుమతిని ఇచ్చింది.

    ఈ పథకం కింద ప్రస్తుతం ఆర్థిక సంవత్సరములో 4,000 మెగావాట్ల సామర్థ్యంతో సౌరవిద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు రాష్ట్రం అనుమతిని అందించింది.

    ఈ పథకానికి 'తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ' (టీజీరెడ్కో) నోడల్ ఏజెన్సీగా నియమించబడింది.

    వివరాలు 

    10 ఎకరాల భూమి ఉంటే 2 మెగావాట్ల సామర్థ్యంతో ప్లాంట్ 

    సబ్ స్టేషన్ ల ఆధారంగా వివిధ ప్రాంతాల్లో సౌరవిద్యుత్ ప్లాంట్లు ఏర్పాటుకు సంబంధిత జాబితాను డిస్కంలు విడుదల చేస్తాయి.

    ఈ ప్లాంట్ల నుంచి విద్యుత్ సబ్ స్టేషన్ లకు చేరే విధంగా లైను, మౌలిక వసతుల ఏర్పాటుకు డిస్కం బాధ్యత వహిస్తుంది.

    రైతు స్వంతంగా 10 ఎకరాల భూమి ఉంటే 2 మెగావాట్ల సామర్థ్యంతో ప్లాంట్ ఏర్పాటు చేసుకోవచ్చు.

    1 మెగావాట్ ప్లాంట్ ఏర్పాటుకు సుమారు రూ.5 కోట్ల వ్యయం ఉంటుందని అంచనా. ఈ పెట్టుబడి కోసం బ్యాంకుల నుంచి రుణ సాయం పొందవచ్చు.

    వివరాలు 

    రూ.3 నుండి రూ.3.15 వరకు చెల్లించి కొనుగోలు

    గ్రామ పంచాయతీ, సహకార సంఘాలు, స్వయం సహాయక సంఘాలు, ఇతర సంస్థలు లేదా కంపెనీల భాగస్వామ్యంతో ప్లాంట్లు ఏర్పాటు చేసుకునేందుకు వీలుంది.

    భూమి యజమాని కంపెనీకి లీజుకు ఇచ్చి, కంపెనీ నుండి వచ్చే లీజు సొమ్ము బ్యాంకు ఖాతాకు జమ అవుతుంది.

    డిస్కంలు ఈ విద్యుత్‌ను రూ.3 నుండి రూ.3.15 వరకు చెల్లించి కొనుగోలు చేసే అవకాశం ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    Trump: $175 బిలియన్ల 'గోల్డెన్ డోమ్' రక్షణ వ్యవస్థను ఆవిష్కరించిన ట్రంప్  అమెరికా
    Andhra Pradesh: ఏపీలో రెండు నగరాల్లో ఫైవ్ స్టార్ హోటల్స్.. కొత్త పెట్టుబడులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఆంధ్రప్రదేశ్
    Marco Rubio: శాంతి చర్చలు నిలిచిపోతే రష్యాపై కొత్త ఆంక్షలు విధిస్తాం: మార్కో రూబియో అమెరికా
    Vizianagaram: ఐఈడీ సిద్ధం చేస్తుండగా సిరాజ్‌ అరెస్ట్.. ఎఫ్‌ఐఆర్‌లో కీలక అంశాలు విజయనగరం

    తెలంగాణ

    TG Ration Cards: ప్రజలకు శుభవార్త.. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి సర్కారు సిద్ధం  రేవంత్ రెడ్డి
    Revanth Reddy: గ్రూప్-1 అభ్యర్థులకు సీఎం రేవంత్‌ శుభాకాంక్షలు.. ఎటువంటి ఆందోళన లేకుండా పరీక్షలు రాయండి రేవంత్ రెడ్డి
    Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. ఇకపై కాన్వాయ్‌ వెళ్లే రోడ్లపై ట్రాఫిక్ జామ్‌లు ఉండవు! రేవంత్ రెడ్డి
    Telangana: సియోల్‌లో తెలంగాణ మంత్రుల పర్యటన.. నీటి వనరుల ప్రాజెక్టులపై దృష్టి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025