
Amrut Project: రూ.7,976 కోట్ల వ్యయంతో అమృత్ పథకానికి సంబంధించి.. 281 ప్రాజెక్టులకు టెండర్లు ఆహ్వానం
ఈ వార్తాకథనం ఏంటి
రాష్ట్రంలోని 117 పట్టణ స్థానిక సంస్థల్లో అమృత్ 2.0 పథకాన్ని అమలు చేయనున్నట్లు రాష్ట్ర పట్టణ ఆర్థిక,మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (APUFIDC) ఛైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ వెల్లడించారు. గురువారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో మొత్తం రూ.7,976 కోట్ల అంచనా వ్యయంతో 281 ప్రాజెక్టుల పనులకు టెండర్లు పిలిచినట్లు తెలిపారు. వీటిలో తాగునీటి సరఫరా, మురుగు నీటి పారుదల, అలాగే నీటి వనరుల పునరుద్ధరణకు సంబంధించిన పలు ప్రాజెక్టులు ఉన్నాయి.
వివరాలు
రాష్ట్రవ్యాప్తంగా 98 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అమలు
వివరాల్లోకి వెళితే, రూ.5,566.80 కోట్ల వ్యయంతో 134 తాగునీటి సరఫరా ప్రాజెక్టులు, రూ.2,037.43 కోట్లతో 30 మురుగునీటి పారుదల ప్రాజెక్టులు, రూ.371.77 కోట్ల అంచనాతో 117 నీటి వనరుల పునరుద్ధరణ పనులు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఈ మొత్తం ప్రాజెక్టులు రాష్ట్రవ్యాప్తంగా 98 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అమలవనున్నాయని వివరించారు. అన్ని టెండర్ల ప్రక్రియలు పూర్తయ్యాక త్వరలోనే పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిపారు.