NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / అఖిల్ వర్ధన్‌ హత్య కేసులో సంచలనం.. చంపింది అదే పాఠశాలలోని సీనియర్ విద్యార్థులేనట
    తదుపరి వార్తా కథనం
    అఖిల్ వర్ధన్‌ హత్య కేసులో సంచలనం.. చంపింది అదే పాఠశాలలోని సీనియర్ విద్యార్థులేనట
    మిస్టరీ ఛేదించిన పోలీసులు

    అఖిల్ వర్ధన్‌ హత్య కేసులో సంచలనం.. చంపింది అదే పాఠశాలలోని సీనియర్ విద్యార్థులేనట

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jul 14, 2023
    02:49 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు వసతి గృహంలో అఖిల్ వర్ధన్‌ హత్యలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ మేరకు మిస్టరీ వీడింది.దీనికి కారణం ఎవరో కాదు ఆ స్కూల్ విద్యార్థులేనని పోలీసులు వెల్లడించారు.

    గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో సోమవారం అర్థరాత్రి అఖిల్ వర్థన్‌ను, అదే పాఠశాలలోని ఇద్దరు పదోతరగతి విద్యార్థులే హత్య చేసినట్లు పోలీసులు నిర్థారించారు.

    బుట్టాయిగూడెం మండలం పులిరాముడిగూడెంలో హాస్ట‌ల్‌లో నిద్రిస్తున్న అఖిల్ వర్ధన్‌ను కిడ్నాప్ చేసి చంపేశారు. వివిధ కోణాల్లో కేసుపై దర్యాప్తు చేసిన పోలీసులు నోట్‌బుక్, చేతి రాత ఆధారంగా నిందితులను గుర్తించారు.

    పాఠశాలలో జరిగిన చిన్న తగాదాతో విభేదాలు పెరిగి పెద్దగయ్యాయి. ఈ క్రమంలోనే సీనియర్లు హత్యకు పాల్పడినట్టు ఏలూరు ఎస్పీ ప్రశాంతి వెల్లడించారు.

    DETAILS

    ట్రైబల్ వేల్ఫేర్ హాస్టళ్లలో భద్రత లేమి, వసతుల కొరతపై తల్లిదండ్రుల ఆగ్రహం

    నిందితులను అరెస్ట్ చేసి జువైనల్ కోర్టుకు తరలించామని ఎస్పీ ప్రశాంతి చెప్పారు. దర్యాప్తులో భాగంగా విద్యార్థులు, సిబ్బంది, తల్లిదండ్రుల నుంచి వివరాలు సేకరించామన్నారు.

    విద్యార్థుల పుస్తకాలను పరిశీలిస్తున్న క్రమంలో ఓ పుస్తకంలోని పేజీలు చిరిగి ఉండటాన్ని గుర్తించామన్నారు. ఈ మేరకు విచారిస్తే హంతకులు పట్టుబడ్డారన్నారు.

    మృతుడి చేతిలో దొరికిన లెటర్‌పై ఉన్న చేతిరాత ఓ విద్యార్థిదిగా కనిపెట్టామన్నారు. మరోవైపు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రాజన్నదొర బాధితులను పరామర్శించి ఆర్థిక సాయం ప్రకటించారు.

    ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వేల్ఫేర్ హాస్టళ్లలో భద్రతా లేమి, వసతుల కొరతపై అటు తల్లిదండ్రులు, ఇటు విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

    ప్రభుత్వ వసతిగృహాల్లో భద్రతకు సంబంధించి విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకమవుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    హత్య

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    ఆంధ్రప్రదేశ్

    నేటి నుంచి ఏపీలో వర్షాలు..తెలంగాణకు మరో 3 రోజుల పాటు తీవ్ర ఎండలు తెలంగాణ
    గజపతినగరం మాజీ ఎమ్మెల్యే తాడ్డి సన్యాసినాయుడు ఇకలేరు కాంగ్రెస్
    ఏపీలో రికార్డు స్థాయిలో 260.96 ఎంయూల విద్యుత్ డిమాండ్‌.. డిస్కంల చరిత్రలోనే ఫస్ట్ టైమ్ విద్యుత్
    వర్షాల జడలేక, ప్రాజక్టుల్లో తగ్గుతున్న నీటి నిల్వలు  వర్షాకాలం

    హత్య

    ఐదుగురు పిల్లలను చంపిన తల్లికి కారుణ్య మరణం; 16 ఏళ్ల తర్వాత ఘటన బెల్జియం
    Andrey Botikov: 'స్పుత్నిక్ వీ' వ్యాక్సిన్‌ని అభివృద్ధి చేసిన రష్యా శాస్త్రవేత్త హత్య రష్యా
    యూట్యూబ్‌లో వీడియోలు చూసి బిడ్డను ప్రసవించిన బాలిక; ఆ తర్వాత చిన్నారి హత్య మహారాష్ట్ర
    పాకిస్థాన్‌లో హిందూ డాక్టర్ గొంతు కోసి హత్య చేసిన డ్రైవర్ పాకిస్థాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025