LOADING...
UP: నోయిడాలో ఉగ్ర కుట్ర బహిర్గతం.. ఇద్దరు అరెస్ట్‌, ఆయుధాలు స్వాధీనం
నోయిడాలో ఉగ్ర కుట్ర బహిర్గతం.. ఇద్దరు అరెస్ట్‌, ఆయుధాలు స్వాధీనం

UP: నోయిడాలో ఉగ్ర కుట్ర బహిర్గతం.. ఇద్దరు అరెస్ట్‌, ఆయుధాలు స్వాధీనం

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 24, 2026
10:39 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాలో ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను ఉత్తర ప్రదేశ్ ఉగ్రవాద నిరోధక దళం అరెస్ట్ చేసింది. సోషల్‌ మీడియా ద్వారా యువతను తీవ్రవాద భావజాలం వైపు మళ్లిస్తూ, ఉగ్రదాడులకు కుట్ర పన్నుతున్నారనే ఆరోపణలపై వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరూ పాకిస్థాన్‌ గ్యాంగ్‌స్టర్లతో పాటు ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ కోసం పనిచేస్తున్నట్లు గుర్తించారు. అరెస్ట్‌ చేసిన వారి వద్ద నుంచి పిస్టళ్లు, మందుగుండు సామగ్రి, కత్తులు, మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. భారతదేశ సార్వభౌమత్వం, ఐక్యత, సమగ్రతకు భంగం కలిగించేలా ఐఎస్ఐ ఆదేశాల మేరకు కుట్ర జరుగుతోందన్న సమాచారంతో ఏటీఎస్ ముందుగా నిఘా పెట్టింది.

వివరాలు

యువతే లక్ష్యంగా తీవ్రవాద కార్యకలాపాలు

సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా యువతను లక్ష్యంగా చేసుకుని తీవ్రవాద కార్యకలాపాలకు ప్రేరేపిస్తున్నట్లు గుర్తించారు. ఈ కేసులో బాఘ్‌పత్‌కు చెందిన తుషార్‌ చౌహాన్‌ అలియాస్‌ హిజ్బుల్లా అలీ ఖాన్‌ (20), ఢిల్లీకి చెందిన సమీర్‌ ఖాన్‌ (20)లను అరెస్ట్ చేశారు. తపాకిస్థానీ గ్యాంగ్‌స్టర్లతో నేరుగా సంబంధాలు కొనసాగిస్తూ, భారత్‌లో పెద్ద ఉగ్రదాడికి సన్నాహాలు చేస్తున్నట్లు విచారణలో బయటపడినట్లు అధికారులు వెల్లడించారు.

Advertisement