NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana High Education council: ప్రవేశ పరీక్షల నిర్వహణ బాధ్యతల్లో పలు మార్పులు.. ఏడు ప్రవేశ పరీక్షల ర్యాంకులే ఆధారం
    తదుపరి వార్తా కథనం
    Telangana High Education council: ప్రవేశ పరీక్షల నిర్వహణ బాధ్యతల్లో పలు మార్పులు.. ఏడు ప్రవేశ పరీక్షల ర్యాంకులే ఆధారం
    ప్రవేశ పరీక్షల నిర్వహణ బాధ్యతల్లో పలు మార్పులు.. ఏడు ప్రవేశ పరీక్షల ర్యాంకులే ఆధారం

    Telangana High Education council: ప్రవేశ పరీక్షల నిర్వహణ బాధ్యతల్లో పలు మార్పులు.. ఏడు ప్రవేశ పరీక్షల ర్యాంకులే ఆధారం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 18, 2024
    11:10 am

    ఈ వార్తాకథనం ఏంటి

    రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశ పరీక్షల నిర్వహణలో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి.

    విద్యార్థులు ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశం పొందేందుకు ఏడు రకముల ప్రవేశ పరీక్షల ర్యాంకుల ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు.

    ప్రతి సంవత్సరం రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఒక్కో వర్సిటీకి ఒకటి లేదా రెండు ప్రవేశ పరీక్షల నిర్వహణ బాధ్యతలను అప్పగిస్తుంది.

    ఈసారి ఈ బాధ్యతలను చూసే మూడు వర్సిటీలతోపాటు, మూడు కొత్త కన్వీనర్లను నియమించనుంది.

    ఈ నిర్ణయాలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య బాలకిష్టారెడ్డి మంగళవారం ఖరారు చేశారు.

    వివరాలు 

    కేయూ నుంచి తొలగింపు ఎందుకంటే? 

    ఈసారి కాకతీయ విశ్వవిద్యాలయానికి (కేయూ) ఐసెట్ నిర్వహణ బాధ్యతను తొలగించి, ఎడ్‌సెట్ నిర్వహణ బాధ్యతను అప్పగించారు.

    ఐసెట్‌ను తొలిసారిగా మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయానికి (ఎంజీయూ) కేటాయించారు.

    అదేవిధంగా, ఇప్పటివరకు ఏ ప్రవేశ పరీక్షను నిర్వహించనివి అయిన పాలమూరుకు ఫిజికల్ ఎడ్యుకేషన్ (పీఈ) సెట్ బాధ్యతను అప్పగించారు.

    ఈ పరీక్షలు మొత్తం మే నెలలో జరగవచ్చని అంచనా వేస్తున్నారు.

    కేయూ నుంచి ఐసెట్ బాధ్యతలను తొలగించడంపై కారణాలు కూడా ఉన్నాయి.

    గతంలో కేయూ ఈ పరీక్ష నిర్వహణలో బాధ్యత వహించినప్పటికీ, ఇటీవల ఐసెట్ అడ్మినిస్ట్రేషన్‌లో అక్రమాలు జరిగాయని, పన్నుల చెల్లింపుల్లో అనవసర ఇబ్బందులు వచ్చాయని ఆరోపణలు రావడంతో ఈ మార్పు తీసుకున్నట్లు సమాచారం.

    వివరాలు 

    పరీక్ష బాధ్యతలను ఎంజీయూ కు..

    తాజగా, ఈ పరీక్ష బాధ్యతలను ఎంజీయూ కు అప్పగించి, అక్కడే మేనేజ్‌మెంట్ ఆచార్యుడిగా ఉన్న ఆచార్య అలువాల రవిని కన్వీనర్‌గా నియమించారు.

    పాలమూరు కు కేటాయించిన పీఈ సెట్ సంబంధించి, అక్కడ ప్రొఫెసర్లు లేకపోవడంతో జేఎన్‌టీయూహెచ్‌ ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం ఆచార్యుడు దిలీప్‌ కన్వీనర్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.

    అలాగే, కేయూకు ఎడ్‌సెట్‌ను అప్పగించడంతో అక్కడి భౌతికశాస్త్రం ఆచార్యుడు వెంకట్రామ్‌రెడ్డిని కన్వీనర్‌గా నియమించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    Maharashtra Tragedy: షోలాపూర్ టెక్స్‌టైల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. ఏడాదిన్నర చిన్నారితో సహా 8 మంది మృతి  మహారాష్ట్ర
    Golden Temple: పంజాబ్‌లోని స్వర్ణ దేవాలయాన్ని టార్టెట్‌ చేసిన పాక్‌.. భారత వైమానిక రక్షణ ఎలా కాపాడిందంటే? అమృత్‌సర్
    Sarfaraz Khan: ఫిట్‌నెస్‌ పై ఫోకస్‌.. 10 కేజీల బరువు తగ్గిన సర్ఫరాజ్‌ ఖాన్‌ సర్ఫరాజ్ ఖాన్
    Shreyas Iyer: ఐపీఎల్ చరిత్రలో తొలి కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ ఘనత శ్రేయస్ అయ్యర్

    తెలంగాణ

    Telangana: యాసంగికి 365 టీఎంసీల కేటాయింపు.. నీటిపారుదల శాఖ నిర్ణయం  భారతదేశం
    Telangana: తెలంగాణ ప్రభుత్వం, గూగుల్ మధ్య కీలక ఒప్పందం.. గూగుల్
    TG Assembly Session: డిసెంబర్‌ 9 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం భారతదేశం
    Eco Tourism policy: తెలంగాణాలో త్వరలో ఎకో టూరిజం పాలసీ.. అటవీశాఖ నివేదిక విడుదల చేసిన మంత్రి సురేఖ భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025