NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కరోనాపై రాష్ట్రాలకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు.. ఆక్సిజన్ నిల్వలపై అప్రమత్తం
    తదుపరి వార్తా కథనం
    కరోనాపై రాష్ట్రాలకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు.. ఆక్సిజన్ నిల్వలపై అప్రమత్తం
    రాష్ట్రాలకు నూతన మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్రం

    కరోనాపై రాష్ట్రాలకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు.. ఆక్సిజన్ నిల్వలపై అప్రమత్తం

    వ్రాసిన వారు Stalin
    Dec 24, 2022
    06:02 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశానికి కరోనా కొత్త వేరియంట్ 'ఒమిక్రాన్ బీఎఫ్ 7' ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. భవిష్యత్తులో ఎదురయ్యే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు రాష్ట్రాలను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రాలకు కీలకమైన మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్రం.. తాజాగా మరికొన్ని సూచనలు చేసింది.

    రెండో వేవ్ ప్రారంభ రోజుల్లో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉండేది. దీంతో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. మ‌ళ్లీ అలాంటి ప‌రిస్థితులు రాకుండా ఉండేందుకు చర్యలను తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది.

    ఆక్సిజన్ నిల్వలు, వెంటిలేటర్లను తగినన్ని సిద్ధంగా ఉంచుకోవాలని, రీఫిల్లింగ్ సిస్టమ్ నిర్వహణను కూడా పటిష్టం చేసుకోవాలని కేంద్రం సూచించింది.రాష్ట్రాలు/ యూటీల స్థాయిలో ఆక్సిజన్ కంట్రోల్ రూమ్‌లను పునరుద్ధరించాలని కేంద్రం కోరింది.

    కరోనా

    ఆ దేశాల నుంచి వస్తే ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్ష

    మెడికల్ ఆక్సిజన్ నిర్వహణపై చేసిన సూచనలో పీసీఏ ప్లాంట్‌లను పూర్తిగా పని చేసేలా ఉంచాలని, వాటిని తనిఖీ చేయడానికి సాధారణ మాక్ డ్రిల్‌లు చేయాలని కోరింది.

    చైనా, జపాన్‌, దక్షిణ కొరియా, హాంకాంగ్‌, థాయ్‌లాండ్‌ నుంచి వచ్చే ప్రయాణికులందరికీ ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్ష చేయాలని, పాజిటివ్‌గా తేలితే వారిని క్వారంటైన్‌లో ఉంచాలని కేంద్రం చెప్పింది.

    శనివారం నుంచి 2% అంతర్జాతీయ ప్రయాణికులకు రాండమ్ పరీక్షలు చేయాలని విమానాశ్రయ అధికారులను ఆదేశించింది.

    చైనాలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. ముందస్తు జాగ్రత్తగా.. ప్ర‌తి పాజిటివ్ కేసును జీనోమ్ సిక్వెన్సింగ్ చేసేలా చ‌ర్య‌లు తీసుకోవాలని చెప్పింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కోవిడ్
    భారతదేశం

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    కోవిడ్

    మళ్లీ కరోనా భయాలు.. పాజిటివ్ కేసులపై రాష్ట్రాలను అలర్ట్ చేసిన కేంద్రం భారతదేశం
    కరోనా కథ ముగిసిపోలేదు.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధం: కేంద్రం భారతదేశం
    'భారత్ జూడో యాత్ర'కు కరోనా షాక్.. రాహుల్‌కు కేంద్రం లేఖ భారతదేశం
    భారత్‌లో జూలైలోనే బయటపడ్డ కరోనా 'BF.7'.. భయమంతా రీఇన్ఫెక్షన్‌తోనే.. భారతదేశం

    భారతదేశం

    రామానుజన్ నంబర్ 1729 కి ఉన్న విశేషం తెలుసుకోవాల్సిందే సినిమా
    మంచి ఉద్యోగం వదులుకోని.. సన్యాసిగా మారుతున్న యువ శాస్త్రవేత్త భారతదేశం
    PF చందాదారులకు శుభవార్త, నెలవారీ పెన్షన్ పెంపుపై జాతీయ కమిటీ నోటీసు వ్యాపారం
    భారత్ జూడో యాత్రను ఆపడానికి కేంద్రం సాకులు చెబుతోంది: రాహుల్ రాజస్థాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025