NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కరోనాపై రాష్ట్రాలకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు.. ఆక్సిజన్ నిల్వలపై అప్రమత్తం
    భారతదేశం

    కరోనాపై రాష్ట్రాలకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు.. ఆక్సిజన్ నిల్వలపై అప్రమత్తం

    కరోనాపై రాష్ట్రాలకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు.. ఆక్సిజన్ నిల్వలపై అప్రమత్తం
    వ్రాసిన వారు Naveen Stalin
    Dec 24, 2022, 06:02 pm 1 నిమి చదవండి
    కరోనాపై రాష్ట్రాలకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు.. ఆక్సిజన్ నిల్వలపై అప్రమత్తం
    రాష్ట్రాలకు నూతన మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్రం

    దేశానికి కరోనా కొత్త వేరియంట్ 'ఒమిక్రాన్ బీఎఫ్ 7' ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. భవిష్యత్తులో ఎదురయ్యే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు రాష్ట్రాలను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రాలకు కీలకమైన మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్రం.. తాజాగా మరికొన్ని సూచనలు చేసింది. రెండో వేవ్ ప్రారంభ రోజుల్లో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉండేది. దీంతో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. మ‌ళ్లీ అలాంటి ప‌రిస్థితులు రాకుండా ఉండేందుకు చర్యలను తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. ఆక్సిజన్ నిల్వలు, వెంటిలేటర్లను తగినన్ని సిద్ధంగా ఉంచుకోవాలని, రీఫిల్లింగ్ సిస్టమ్ నిర్వహణను కూడా పటిష్టం చేసుకోవాలని కేంద్రం సూచించింది.రాష్ట్రాలు/ యూటీల స్థాయిలో ఆక్సిజన్ కంట్రోల్ రూమ్‌లను పునరుద్ధరించాలని కేంద్రం కోరింది.

    ఆ దేశాల నుంచి వస్తే ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్ష

    మెడికల్ ఆక్సిజన్ నిర్వహణపై చేసిన సూచనలో పీసీఏ ప్లాంట్‌లను పూర్తిగా పని చేసేలా ఉంచాలని, వాటిని తనిఖీ చేయడానికి సాధారణ మాక్ డ్రిల్‌లు చేయాలని కోరింది. చైనా, జపాన్‌, దక్షిణ కొరియా, హాంకాంగ్‌, థాయ్‌లాండ్‌ నుంచి వచ్చే ప్రయాణికులందరికీ ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్ష చేయాలని, పాజిటివ్‌గా తేలితే వారిని క్వారంటైన్‌లో ఉంచాలని కేంద్రం చెప్పింది. శనివారం నుంచి 2% అంతర్జాతీయ ప్రయాణికులకు రాండమ్ పరీక్షలు చేయాలని విమానాశ్రయ అధికారులను ఆదేశించింది. చైనాలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. ముందస్తు జాగ్రత్తగా.. ప్ర‌తి పాజిటివ్ కేసును జీనోమ్ సిక్వెన్సింగ్ చేసేలా చ‌ర్య‌లు తీసుకోవాలని చెప్పింది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    కోవిడ్
    భారతదేశం

    తాజా

    IPL2023 Opening Ceremony: ఐపిఎల్ ఆరంభ వేడుకలలో తెలుగు పాటల హవా ఐపీఎల్
    ప్రేరణ: ప్రతీ అనుభవాన్ని మనసులో దాచుకుంటే ఆనందకరమైన జ్ఞాపకాలకు చోటుండదు ప్రేరణ
    టేకిలా తర్వాత, గిగాబియర్‌ను ప్రారంభించిన టెస్లా ఎలోన్ మస్క్
    2023 ఫారిన్ ట్రేడ్ పాలసీని ఆవిష్కరించిన కేంద్ర ప్రభుత్వం వ్యాపారం

    కోవిడ్

    దేశంలో కొత్తగా 3,095 మందికి కరోనా; 15వేల మార్కును దాటిన యాక్టివ్ కేసులు భారతదేశం
    దేశంలో ఆగని కరోనా ఉద్ధృతి; 3వేలు దాటిన కొత్త కేసులు; దిల్లీ ప్రభుత్వం అప్రమత్తం భారతదేశం
    కరోనా వ్యాక్సిన్‌ మార్గదర్శకాలను సవరించిన డబ్ల్యూహెచ్‌ఓ; కొత్త సిఫార్సులు ఇలా ఉన్నాయి! ప్రపంచ ఆరోగ్య సంస్థ
    దేశంలో మళ్లీ పుంజుకుంటున్న కరోనా; కొత్తగా 2,151 కేసులు, 5 నెలల్లో ఇదే అత్యధికం తాజా వార్తలు

    భారతదేశం

    సామ్ సంగ్ బుక్ 3-సిరీస్‌ కన్నా Dell Inspiron 14 ల్యాప్‌టాప్‌లు మెరుగైన ఎంపిక ల్యాప్ టాప్
    మాన్యువల్ ధర నుండి ChatGPT వరకు టాటా ఆధ్వర్యంలో ఎయిర్ ఇండియాలో వస్తున్న మార్పులు విమానం
    పాటియాలా జైలు నుంచి రేపు విడుదల కానున్న పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ పంజాబ్
    టాప్ 100 కంపెనీలు తప్పనిసరిగా పుకార్లను ధృవీకరించాలంటున్న సెబీ స్టాక్ మార్కెట్

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023