NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Pawan Kalyan :దోషులను కఠినంగా శిక్షించాలి.. తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన పవన్ కళ్యాణ్
    తదుపరి వార్తా కథనం
    Pawan Kalyan :దోషులను కఠినంగా శిక్షించాలి.. తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన పవన్ కళ్యాణ్
    దోషులను కఠినంగా శిక్షించాలి.. తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన పవన్ కళ్యాణ్

    Pawan Kalyan :దోషులను కఠినంగా శిక్షించాలి.. తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన పవన్ కళ్యాణ్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 22, 2024
    11:44 am

    ఈ వార్తాకథనం ఏంటి

    జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

    ఆలయాల ధ్వంసం, తిరుమల లడ్డూ కల్తీ ఘటనలను నిరసిస్తూ ఆయన 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.

    గుంటూరు జిల్లా నంబూరులోని దశావతార వేంకటేశ్వరస్వామి ఆలయంలో పవన్ ప్రత్యేక పూజలు చేసి దీక్ష ప్రారంభించారు.

    దీక్ష అనంతరం ఆయన మాట్లాడారు. వైసీపీ పాలనలో ఆలయాలపై దాడులు, పూజా విధానాల్లో మార్పులు, ప్రసాదాల నాణ్యత లేమి వంటి అంశాలపై తీవ్ర విమర్శలు చేశారు.

    2019 నుంచి వైసీపీ ప్రభుత్వం ఆలయాలపై ఆచరణాత్మక మార్పులు చేసిందన్నారు.

    Details

    హిందువుల మనోభావాలను దెబ్బతీశారు

    రథాన్ని తగులబెట్టడం, స్వామివారి పూజా విధానాలను మార్చడం వంటి చర్యలతో హిందువుల మనోభావాలను దెబ్బతీసిందన్నారు.

    ఇక శ్రీవాణి ట్రస్టు పేరుతో హుండీ ద్వారా వసూలు చేసిన డబ్బులకు సరైన రసీదులు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు.

    మహాప్రసాదమైన తిరుపతి లడ్డూను కూడా కల్తీ చేయడంపై ఆయన అవేదన వ్యక్తం చేశారు.

    ఈ స్థాయిలో కల్తీ జరుగుతుందని ఊహించలేదని, ఇది భక్తుల విశ్వాసాలను అపవిత్రం చేయడమే అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఈ తప్పులను ఎలా సమర్థిస్తుందో అర్థం కావడం లేదని పవన్‌ అన్నారు.

    ఈ వ్యవహారంలో దోషులకు కఠినమైన శిక్ష పడాలని, ఈ అంశంపై కేబినెట్‌ భేటీ, అసెంబ్లీలో చర్చ జరగాలన్నారు

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పవన్ కళ్యాణ్
    తిరుమల తిరుపతి దేవస్థానం

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    పవన్ కళ్యాణ్

    Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ను కలిసిన వైసీపీ ఎంపీ బాలశౌరి  భారతదేశం
    Johnny Master: జనసేనలో చేరిన స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్  జనసేన
    Pawan Kalyan's OG: రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న పవన్ కళ్యాణ్ OG  సినిమా
    Pawan Kalyan: ఈ నెల 14 నుంచి గోదావరి జిల్లాల్లో పవన్‌ కళ్యాణ్ పర్యటన  జనసేన

    తిరుమల తిరుపతి దేవస్థానం

    నందిని నెయ్యిపై కర్ణాటకలో రాజకీయ దుమారం  కర్ణాటక
    Bhumana Karunakar Reddy: టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలను స్వీకరించిన భూమన కరుణాకర్‌రెడ్డి భూమన కరుణాకర్‌ రెడ్డి
    Tirumala: తిరుమలలో విషాదం.. చిరుత దాడిలో చిన్నారి మృతి  తిరుమల తిరుపతి
    తిరుమలలో రోహిత్ శర్మ.. కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న భారత కెప్టెన్ ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025