NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / CAA : పశ్చిమ బెంగాల్‌లోని మతువా కమ్యూనిటీపై 'సీఏఏ' ప్రభావం ఎంత? 
    తదుపరి వార్తా కథనం
    CAA : పశ్చిమ బెంగాల్‌లోని మతువా కమ్యూనిటీపై 'సీఏఏ' ప్రభావం ఎంత? 
    CAA : పశ్చిమ బెంగాల్‌లోని మతువా కమ్యూనిటీపై 'సీఏఏ' ప్రభావం ఎంత?

    CAA : పశ్చిమ బెంగాల్‌లోని మతువా కమ్యూనిటీపై 'సీఏఏ' ప్రభావం ఎంత? 

    వ్రాసిన వారు Stalin
    Mar 12, 2024
    12:39 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశంలో ఎట్టకేలకు పౌరసత్వ సవరణ చట్టం (CAA) అమల్లోకి వచ్చింది. లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి ముందు సీఏఏ నిబంధనలను మోదీ ప్రభుత్వం నోటిఫై చేసింది.

    సీఏఏ నోటిఫికేషన్‌ను జారీ చేయడం ద్వారా.. పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి హింస కారణంగా భారతదేశానికి వచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వం ఇవ్వడానికి మార్గం సుగమం అయ్యింది.

    సీఏఏ అమల్లోకి రావడంతో బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన శరణార్థుల హిందూ శాఖ అయిన పశ్చిమ బెంగాల్‌లోని 'మతువా' కమ్యూనిటీ సంబురాలు జరుపుకుంటున్నారు.

    మతువా శరణార్థులకు శాశ్వత పౌరసత్వం ఇవ్వాలనే ఎప్పటి నుంచి డిమాండ్ ఉంది.

    ఈ క్రమంలో లోక్‌సభ ఎన్నికల వేళ.. శరార్ధులను లక్ష్యంగా చేసుకొని మోదీ ప్రభుత్వం సీఏఏను అమల్లోకి తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది.

    సీఏఏ

    మతువా కమ్యూనిటీ ప్రజలు ఎవరు?

    భారతదేశ విభజన తరువాత తూర్పు పాకిస్థాన్ (ప్రస్తుతం బంగ్లాదేశ్) నుంచి పెద్ద సంఖ్యలో హిందూ మతువా శరణార్థులు బెంగాల్‌కు భారీ సంఖ్యలో వచ్చారు.

    వీరికి ఇప్పటికీ భారత పౌరసత్వం లేదు. దశాబ్దాలుగా భారతీయ పౌరసత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ కల నెరవేరింది.

    బెంగాల్‌లోని మతువా శరణార్థులు ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలు, నదియా, జల్పాయిగురి, సిలిగురి, కూచ్ బెహార్, బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్న తూర్పు, పశ్చిమ బద్దమాన్ జిల్లాల్లో విస్తరించి ఉన్నారు.

    మతువా కమ్యూనిటీని హరిచంద్ ఠాకూర్ స్థాపించారు. దేశ విభజన తర్వాత హరిచంద్-గురుచంద్ ఠాకూర్ వారసుడైన ప్రమథ రంజన్ ఠాకూర్, అతని భార్య వీణాపాణి రాష్ట్రంలోని మతువా సమాజాన్ని ఏకం చేశారు. భారత పౌరసత్వం కోసం ఉద్యమించారు.

    బంగాల్

    పశ్చిమ బెంగాల్ మొత్తం ఎస్సీ జనాభాలో 17.4 శాతంగా మతువా కమ్యూనిటీ

    బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందూ శరణార్థులను షెడ్యూల్డ్ కులం (SC)గా పశ్చిమ బెంగాల్‌లో వర్గీకరించారు.

    వీరిని మతువా నామశూద్ర లేదా దిగువ కుల హిందూ శరణార్థులుగా పిలుస్తారు. పశ్చిమ బెంగాల్ మొత్తం SC జనాభాలో 17.4శాతం నామసుద్రలు ఉన్నారు.

    ఉత్తర బెంగాల్‌లో రాజ్‌బంషీల తర్వాత రాష్ట్రంలో రెండవ అతిపెద్ద ఎస్సీ కమ్యూనిటీ నామసుద్రలు కావడం గమనార్హం.

    బెంగాల్‌లోని 1.8కోట్ల షెడ్యూల్డ్ కులాల జనాభాలో (99.96%) హిందువుల సంఖ్య అత్యధికంగా ఉంది.

    రాష్ట్రంలోని 42 లోక్‌సభ స్థానాల్లో బెంగాల్‌లోని 10 సీట్లు షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేయబడ్డాయి. వీటిలో 2019లో బీజేపీ నాలుగు సీట్లను గెలుచుకుంది.

    ఇప్పుడు సీఏఏ అమలు నిర్ణయంతో షెడ్యూల్డ్ కులాలు గంపగుత్తగా బీజేపీ వైపు మొగ్గే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పశ్చిమ బెంగాల్
    తాజా వార్తలు

    తాజా

    ITRFiling: ఐటీఆర్ ఫైలింగ్‌లో ఫారం 16కు సంబంధించి కీలక మార్పులు.. జీతం పొందే ఉద్యోగులు తప్పనిసరిగా తెలుసుకోవలసిన విషయాలు ఆదాయపు పన్నుశాఖ/ఐటీ
    Tatkal Tkt Booking: జూలై 1 నుంచి తత్కాల్ టికెట్లకు కొత్త నిబంధనలు: మోసాల నివారణకు భారతీయ రైల్వే కీలక నిర్ణయం  రైల్వే శాఖ మంత్రి
    Gold Rate: మళ్లీ రూ.లక్ష మార్క్‌ దాటిన బంగారం ధర  బంగారం
    Stock Market: ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@25,100 స్టాక్ మార్కెట్

    పశ్చిమ బెంగాల్

    IMD: ఈ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు; ఐఎండీ హెచ్చరికలు జారీ  ఐఎండీ
    పశ్చిమ బెంగాల్‌: బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ఏడుగురు మృతి అగ్నిప్రమాదం
    ఎమ్మెల్యేలకు మమతా బెనర్జీ బంపర్ బొనాంజా.. ఒక్కొక్కరి జీతం దాదాపు రూ.40 వేలు పెంపు మమతా బెనర్జీ
    ఉపపోరు: 6 రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు, మధ్యాహ్నం వరకు ఫలితాలు అసెంబ్లీ ఎన్నికలు

    తాజా వార్తలు

    Maldives-India: మాల్దీవుల ప్రజల పక్షాల భారత్‌ను క్షమాపణలు కోరుతున్నా: మాజీ అధ్యక్షుడు నషీద్  మాల్దీవులు
    Madhya Pradesh: మధ్యప్రదేశ్ సచివాలయంలో భారీ అగ్నిప్రమాదం.. కీలక పత్రాలు దగ్ధం  మధ్యప్రదేశ్
    Arunachal Pradesh: ప్రపంచంలోనే అతి పొడవైన టన్నెల్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ అరుణాచల్ ప్రదేశ్
    Polishetty Rambabu: టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత  టాలీవుడ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025