NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / తెలంగాణలో ఐటీ దాడుల కలకలం: బీఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్యేల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు 
    తదుపరి వార్తా కథనం
    తెలంగాణలో ఐటీ దాడుల కలకలం: బీఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్యేల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు 
    తెలంగాణలో ఐటీ దాడుల కలకలం: బీఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్యేల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు

    తెలంగాణలో ఐటీ దాడుల కలకలం: బీఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్యేల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు 

    వ్రాసిన వారు Stalin
    Jun 14, 2023
    11:08 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణలో బుధవారం ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులే లక్ష్యంగా ఐటీ దాడులు జరుతున్నాయి.

    ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లోఆదాయ పన్నుశాఖ అధికారులు దాడులు చేస్తున్నారు.

    పైళ్ల శేఖర్ రెడ్డికి చెందిన కొత్తపేట, భువనగిరి, హైదరాబాద్‌లోని గ్రీన్‌హిల్స్‌ కాలనీ కార్యాలయాలు సహా మొత్తం 12 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి.

    హిల్ ల్యాండ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, మెయిన్‌ల్యాండ్ డిజిటల్ టెక్నాలజీస్ లిమిటెడ్‌లోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. శేఖర్ రెడ్డి భార్య వనిత ఈ కంపెనీలకు డైరెక్టర్‌గా ఉన్నారు.

    ఆదాయపు పన్ను చెల్లింపుల వివరాలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.

    ఐటీ

    70 బృందాలతో ఏకకాలంలో దాడులు

    నగరంలోని గచ్చిబౌలిలో ప్రభాకర్‌రెడ్డి ఇంటిపై అధికారులు దాడులు చేశారు.

    మర్రి జనార్దన్ రెడ్డికి చెందిన షాపింగ్ మాల్‌లో సోదాలు నిర్వహిస్తున్నారు. లావాదేవీలను తనిఖీ చేస్తున్నారు. ఉదయం 6గంటల నుంచి ఈ సోదాలు జరుగుతున్నాయి.

    దాదాపు 70 బృందాలతో ఐటీ అధికారులు బీఆర్ఎస్ నేత ఇళ్లలో ఒకే సమయంలో సోదాలను చేపట్టినట్లు సమాచారం. అయితే ఈ దాడులు ఎందుకు చేస్తున్నారనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

    ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఐటీ దాడులు బీఆర్ఎస్‌ను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఇలాంటి ఐటీ దాడులు జరుగుతాయని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలోనే ఎమ్మెల్యేలు, మంత్రులను హెచ్చరించడం గమనార్హం.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

     మర్రి జనార్దన్ రెడ్డి మాల్‌లో సోదాలు

    హైదరాబాద్‌: నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి చెందిన షాపింగ్ మాల్‌పై ఐటీ శాఖ దాడులు.. కేపీహెచ్‌బీ కాలనీలోని జేసీ బ్రదర్స్‌లో తనిఖీలు.. ఉదయం 6 గంటల నుంచి కొనసాగుతున్న సోదాలు.. జేసీ బ్రదర్స్‌లో జరిగిన లావాదేవీలపై ఆరా తీస్తున్న అధికారులు.#itraid #hyderabad #telugunews

    — NTV Breaking News (@NTVJustIn) June 14, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆదాయపు పన్నుశాఖ/ఐటీ
    తెలంగాణ

    తాజా

    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ
    Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం ముంబయి ఇండియన్స్

    ఆదాయపు పన్నుశాఖ/ఐటీ

    విదేశీ నిధుల్లో అవకతవకలు; బీబీసీపై కేసు నమోదు చేసిన ఈడీ  బీబీసీ
    2023-24 ఐటీ రిటర్న్స్: ITR-1, ITR-4 ఆఫ్‌లైన్ ఫామ్స్ విడుదల ఆదాయం
    కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ చెట్లపై నోట్ల కట్టలు  కర్ణాటక
    హైదరాబాద్ ఆదాయపు పన్ను ఆఫీస్‌కు బాంబు బెదిరింపు.. భయం భయంలో అధికారులు ప్రభుత్వం

    తెలంగాణ

    తెలంగాణలో తప్పనిసరిగా సందర్శించే ఈ టూరిస్టు ప్రదేశాల గురించి తెలుసుకోండి పర్యాటకం
    విద్యార్థులకు 1.17కోట్ల నోట్‌బుక్‌లను ఉచితంగా అందించనున్న తెలంగాణ ప్రభుత్వం  తాజా వార్తలు
    హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు... పలు రూట్లలో నో పర్మిషన్  భారతదేశం
    టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్; మరో డీఏని ప్రకటించిన యాజమాన్యం  టీఎస్ఆర్టీసీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025