Page Loader
Satyendra Das: శ్రీరామ జన్మభూమి ప్రధాన పూజారి ఇకలేరు.. అయోధ్యలో విషాదం
శ్రీరామ జన్మభూమి ప్రధాన పూజారి ఇకలేరు.. అయోధ్యలో విషాదం

Satyendra Das: శ్రీరామ జన్మభూమి ప్రధాన పూజారి ఇకలేరు.. అయోధ్యలో విషాదం

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 12, 2025
12:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

యూపీలోని అయోధ్యలో విషాదం నెలకొంది. శ్రీ రామ జన్మభూమి ప్రధాన పూజారి మహంత్ సత్యేంద్ర దాస్ కన్నుమూశారు. 87 ఏళ్ల ఆయన బ్రెయిన్ స్ట్రోక్‌తో బాధపడుతూ ఆదివారం లక్నోలోని ఎస్‌జీపీజీటీలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. డయాబెటిస్, అధిక రక్తపోటుతో బాధపడుతున్న ఆయనను న్యూరాలజీ విభాగంలోని ఐసీయూలో చేర్చారు, అయితే చికిత్స ఫలించలేదు. మహంత్ సత్యేంద్ర దాస్ 1992 డిసెంబర్ 6న జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో రామాలయ ప్రధాన పూజారిగా వ్యవహరించారు.

Details

విషాదంలో ప్రజలు

అయోధ్యలో అత్యంత గౌరవం పొందిన ఆయన, తన 20వ ఏట ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నారు. నిర్వాణి అఖాడాకు చెందిన ఆయన నిత్యం అయోధ్యలోనే నివాసం ఉండేవారు. రామాలయంలో జరిగే పరిణామాలను దేశవ్యాప్తంగా మీడియాలో తెలియజేయడంలో దాస్ ప్రముఖ పాత్ర పోషించారు. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత భారత రాజకీయాల దిశను మార్చిన సంఘటనగా నిలిచింది. ఆ సంఘటన అనంతర కాలంలోనూ దాస్ ప్రధాన పూజారిగా కొనసాగారు. అయోధ్య రామాలయ నిర్మాణం వరకు ఆయన పూజా కార్యక్రమాల్లో కీలక భూమిక పోషించారు. ఆయన మరణం అయోధ్య ప్రజలను విషాదంలో ముంచేసింది.