Page Loader
Rajamahendravaram: 64 ఏళ్ల మూర్తి, 68 ఏళ్ల రాములమ్మ పెళ్లి.. వృద్ధాశ్రమంలో అరుదైన ప్రేమకథ
64 ఏళ్ల మూర్తి, 68 ఏళ్ల రాములమ్మ పెళ్లి.. వృద్ధాశ్రమంలో అరుదైన ప్రేమకథ

Rajamahendravaram: 64 ఏళ్ల మూర్తి, 68 ఏళ్ల రాములమ్మ పెళ్లి.. వృద్ధాశ్రమంలో అరుదైన ప్రేమకథ

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 18, 2025
04:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాజమహేంద్రవరంలో స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో 64 ఏళ్ల మడగల మూర్తి, 68 ఏళ్ల గజ్జల రాములమ్మ మధ్య అరుదైన వివాహం జరిగింది. వృద్ధాశ్రమంలో చేరిన వారిద్దరూ వయసు పైబడినా ఒకరికొకరికి అండగా నిలబడాలని నిర్ణయించుకున్నారు. మూర్తి కొన్ని సంవత్సరాలుగా తీవ్ర పక్షవాతం కారణంగా కదలలేని పరిస్థితిలో ఉండగా, రాములమ్మ అతనికి సేవలు అందించి అతనిని కోలిపోవడంలో సాయం చేసింది.

Details

సహచర వృద్ధుల సమక్షంలో పెళ్లి

మూర్తి ఆరోగ్యం కుదుటపడిన తర్వాత, తన జీవితంలో ఒక స్నేహితురాలిగా ఉండేందుకు రాములమ్మను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ నిర్ణయాన్ని రాములమ్మతో పంచుకున్నాడు, ఆమె కూడా ఒప్పుకుంది. అనంతరం, ఆశ్రమ నిర్వాహకుడు గుబ్బల రాంబాబు వారు పెళ్లి చేసుకునే ఏర్పాట్లు చేశారు. శుక్రవారం వృద్ధాశ్రమంలో సహచర వృద్ధుల సమక్షంలో వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు.