NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కరోనా అలర్ట్.. రాబోయే 40 రోజులు జాగ్రత్తగా ఉండాలని కేంద్రం హెచ్చరిక!
    తదుపరి వార్తా కథనం
    కరోనా అలర్ట్.. రాబోయే 40 రోజులు జాగ్రత్తగా ఉండాలని కేంద్రం హెచ్చరిక!
    రాబోయే 40రోజులు కీలకం

    కరోనా అలర్ట్.. రాబోయే 40 రోజులు జాగ్రత్తగా ఉండాలని కేంద్రం హెచ్చరిక!

    వ్రాసిన వారు Stalin
    Dec 28, 2022
    06:02 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    జనవరి మధ్యలో దేశంలో కోవిడ్ కేసులు పెరిగే అవకాశం ఉన్నందున రాబోయే 40 రోజులు చాలా కీలకమైనవి అని, జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు చెబుతున్నాయి. గత అనుభవాలను విశ్లేషించిన తర్వాత ఈ అంచనాకు వచ్చినట్లు పేర్కొంటున్నాయి.

    చైనాతో పాటు పలు దేశాల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో.. మరో వేవ్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీంతో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను రెండు వారాలుగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ వస్తోంది.

    బుధవారం చెన్నై విమానాశ్రయంలో దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులకు కరోనా నిర్ధారణ కావడంతో.. రాష్ట్రాలను మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్రం కోరింది.

    కరోనా

    మూడు రోజుల్లో 39 మందికి..

    అంతర్జాతీయ ప్రయాణికుల్లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తులు తీసుకోవాలని కేంద్రం భావిస్తోంది. గత మూడు రోజుల్లో అంతర్జాతీయ విమానాశ్రయాల్లో 1,780 నమూనాలను సేకరించగా..అందులో 39 మందికి పాజిటివ్‌గా తేలింది. పాజిటివ్ కేసుల నమూనాలన్నింటిని జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపినట్లు అధికారులు చెప్పారు.

    దేశంలో ఎలాంటి పరిస్థితులొచ్చినా ఎదుర్కొనేందుకు ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాలను కేంద్రం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు దేశ వ్యాప్తంగా ఇప్పటికే మాక్ డ్రిల్స్‌ను కూడా నిర్వహించారు.

    దేశంలో 24 గంటల్లో 188 కొత్త కోవిడ్-19 కేసులు వెలుగుచూశాయి. అంతర్జాతీయ ప్రయాణికుల్లో కూడా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్‌లో ఉన్న పండగ సీజన్‌ను దృష్టి పెట్టుకొని.. మరో 40రోజులు జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు సూచిస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కోవిడ్
    భారతదేశం

    తాజా

    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం
    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా

    కోవిడ్

    మళ్లీ కరోనా భయాలు.. పాజిటివ్ కేసులపై రాష్ట్రాలను అలర్ట్ చేసిన కేంద్రం భారతదేశం
    కరోనా కథ ముగిసిపోలేదు.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధం: కేంద్రం భారతదేశం
    'భారత్ జూడో యాత్ర'కు కరోనా షాక్.. రాహుల్‌కు కేంద్రం లేఖ భారతదేశం
    భారత్‌లో జూలైలోనే బయటపడ్డ కరోనా 'BF.7'.. భయమంతా రీఇన్ఫెక్షన్‌తోనే.. భారతదేశం

    భారతదేశం

    రామానుజన్ నంబర్ 1729 కి ఉన్న విశేషం తెలుసుకోవాల్సిందే సినిమా
    మంచి ఉద్యోగం వదులుకోని.. సన్యాసిగా మారుతున్న యువ శాస్త్రవేత్త భారతదేశం
    PF చందాదారులకు శుభవార్త, నెలవారీ పెన్షన్ పెంపుపై జాతీయ కమిటీ నోటీసు వ్యాపారం
    భారత్ జూడో యాత్రను ఆపడానికి కేంద్రం సాకులు చెబుతోంది: రాహుల్ రాజస్థాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025