NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కరోనా అలర్ట్.. రాబోయే 40 రోజులు జాగ్రత్తగా ఉండాలని కేంద్రం హెచ్చరిక!
    భారతదేశం

    కరోనా అలర్ట్.. రాబోయే 40 రోజులు జాగ్రత్తగా ఉండాలని కేంద్రం హెచ్చరిక!

    కరోనా అలర్ట్.. రాబోయే 40 రోజులు జాగ్రత్తగా ఉండాలని కేంద్రం హెచ్చరిక!
    వ్రాసిన వారు Naveen Stalin
    Dec 28, 2022, 06:02 pm 1 నిమి చదవండి
    కరోనా అలర్ట్.. రాబోయే 40 రోజులు జాగ్రత్తగా ఉండాలని కేంద్రం హెచ్చరిక!
    రాబోయే 40రోజులు కీలకం

    జనవరి మధ్యలో దేశంలో కోవిడ్ కేసులు పెరిగే అవకాశం ఉన్నందున రాబోయే 40 రోజులు చాలా కీలకమైనవి అని, జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు చెబుతున్నాయి. గత అనుభవాలను విశ్లేషించిన తర్వాత ఈ అంచనాకు వచ్చినట్లు పేర్కొంటున్నాయి. చైనాతో పాటు పలు దేశాల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో.. మరో వేవ్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీంతో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను రెండు వారాలుగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ వస్తోంది. బుధవారం చెన్నై విమానాశ్రయంలో దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులకు కరోనా నిర్ధారణ కావడంతో.. రాష్ట్రాలను మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్రం కోరింది.

    మూడు రోజుల్లో 39 మందికి..

    అంతర్జాతీయ ప్రయాణికుల్లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తులు తీసుకోవాలని కేంద్రం భావిస్తోంది. గత మూడు రోజుల్లో అంతర్జాతీయ విమానాశ్రయాల్లో 1,780 నమూనాలను సేకరించగా..అందులో 39 మందికి పాజిటివ్‌గా తేలింది. పాజిటివ్ కేసుల నమూనాలన్నింటిని జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపినట్లు అధికారులు చెప్పారు. దేశంలో ఎలాంటి పరిస్థితులొచ్చినా ఎదుర్కొనేందుకు ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాలను కేంద్రం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు దేశ వ్యాప్తంగా ఇప్పటికే మాక్ డ్రిల్స్‌ను కూడా నిర్వహించారు. దేశంలో 24 గంటల్లో 188 కొత్త కోవిడ్-19 కేసులు వెలుగుచూశాయి. అంతర్జాతీయ ప్రయాణికుల్లో కూడా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్‌లో ఉన్న పండగ సీజన్‌ను దృష్టి పెట్టుకొని.. మరో 40రోజులు జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు సూచిస్తోంది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    కోవిడ్
    భారతదేశం

    తాజా

    Find X6, X6 Pro స్మార్ట్‌ఫోన్‌లను ప్రకటించిన OPPO స్మార్ట్ ఫోన్
    SCO Event: పాకిస్థాన్ మ్యాప్‌పై భారత్ అభ్యంతరం; తోకముడిచిన దాయాది దేశం జమ్ముకశ్మీర్
    రోల్స్ రాయిస్ చివరి V12-పవర్డ్ కూపే ప్రత్యేకత ఏంటో తెలుసా ఆటో మొబైల్
    UBS క్రెడిట్ సూయిస్ విలీనం వేలాది ఉద్యోగాలను ప్రమాదంలో పడేసింది బ్యాంక్

    కోవిడ్

    దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు; కొత్తగా 918మందికి వైరస్, నలుగురు మృతి కరోనా కొత్త మార్గదర్శకాలు
    దేశంలో 4నెలల గరిష్ఠానికి కరోనా కేసులు; కేంద్రం ఆందోళన భారతదేశం
    హెచ్3ఎన్2 వైరస్: మహారాష్ట్ర, దిల్లీలో హై అలర్ట్; దేశంలో 9కి చేరిన మరణాలు మహారాష్ట్ర
    ఇజ్రాయెల్‌లో ఎవరికీ తెలియని కరోనా కొత్త వేరియంట్; రెండు కేసులు నమోదు ఇజ్రాయెల్

    భారతదేశం

    భారతదేశంలో మౌలిక సదుపాయాలపై అసంతృప్తిగా ఉన్న లంబోర్ఘిని సిఈఓ ఆటో మొబైల్
    భారతదేశంలో అమ్మకాలు ప్రారంభించిన iQOO Z7 స్మార్ట్ ఫోన్
    ముడి చమురు ఉత్పత్తిపై విండ్ ఫాల్ పన్ను టన్నుకు రూ.3,500 తగ్గింపు పన్ను
    హోండా షైన్ 100 vs హీరో స్ప్లెండర్ ప్లస్ ఫీచర్స్ తెలుసుకుందాం ఆటో మొబైల్

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023