NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / టమాట కిలో రూ.100; ధరలు అమాంతం పెరగడానికి కారణాలివే 
    తదుపరి వార్తా కథనం
    టమాట కిలో రూ.100; ధరలు అమాంతం పెరగడానికి కారణాలివే 
    టమాట కిలో రూ.100; ధరలు అమాంతం పెరగడానికి కారణాలివే

    టమాట కిలో రూ.100; ధరలు అమాంతం పెరగడానికి కారణాలివే 

    వ్రాసిన వారు Stalin
    Jun 27, 2023
    05:13 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశవ్యాప్తంగా టమాట ధరలు చుక్కలనంటాయి. మార్కెట్‌లో కిలో రూ.10-20 పలికే టమాట అమాంత రూ. 100 పలుకుతోంది. దీంతో వినియోగదారులపై తీవ్రమైన భారం పడుతోంది.

    జూన్ రెండో వారంలో బెంగళూరులో టమాటా ధర కిలో రూ. 25 ఉండేది. గత వారం అది రూ. 60కి పెరిగింది. ఈ వారం ఏకంగా కిలో టమాట 120 పలుకుతోందని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది.

    మే నెలలో టమాట కిలో రూ.3నుంచి రూ.5వరకు అమ్మారు. దీంతో రవాణా ఖర్చులకు కూడా రాకపోవడంతో రైతులు టమాట పంటను రోడ్డున పడేసిన సంఘటనలు మనకు కనిపించాయి.

    ఇదిలా ఉండగా, రానున్న రోజుల్లో టమాట ధరలు కిలోకు 150 రూపాయలకు చేరుకోవచ్చని కాన్పూర్‌లోని ఓ వ్యాపారి జోస్యం చెప్పాడు.

    టమాట

    వేడిగాలులు, భారీ వర్షాలతో తగ్గిన దిగుబడి 

    ఈ ఏడాది ప్రారంభంలో గిట్టుబాటు ధర లేకపోవడంతో చాలా మంది రైతులు టమాట పంటను వదిలేశారు.

    దీంతో ఉత్పత్తి తగ్గింది. టమాటా పండించే ప్రాంతాల్లో వేడిగాలులు, భారీ వర్షం కారణంగా దిగుబడి తగ్గిపోవడమే కారణంగా వ్యాపారులు చెబుతున్నారు.

    ముంబయికి చెందిన కమోడిటీ మార్కెట్ నిపుణుడు, కేడియా అడ్వైజరీ హెడ్ అజయ్ కేడియా మాట్లాడుతూ, ఈ సంవత్సరం వివిధ కారణాల వల్ల గతేడాది కంటే తక్కువ టమోటాలను నాటినట్లు చెప్పారు.

    గత సంవత్సరం బీన్స్ ధర పెరగడంతో, చాలామంది రైతులు ఆ సాగుకు మొగ్గు చూపారు. రుతుపవనాల ఆలస్యం పంటలు ఎండిపోవడానికి కారణమైనట్లు చెప్పారు.

    అలాగే భారీ వర్షపాతం, విపరీతమైన వేడి కారణంగా టమాట పంట నష్టం జరిగనట్లు వెల్లడించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ధర
    కూరగాయలు
    బెంగళూరు
    తాజా వార్తలు

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    ధర

    ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారికి బిగ్ షాక్.. సబ్సిడీలో భారీ కోత ఎలక్ట్రిక్ వాహనాలు
    అద్భుత ఫీచర్లతో సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 212km ఎలక్ట్రిక్ వాహనాలు
    అదిరిపోయే ఫీచర్లతో సరికొత్త ఇన్‍బుక్ ఎక్స్2 స్లిమ్ ల్యాప్‍టాప్.. రేపే లాంచ్ ల్యాప్ టాప్
    RunR మొబిలిటీ HS ఎలక్ట్రిక్ స్కూటర్‌ వచ్చేసింది.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే వంద కిలోమీటర్లు ఎలక్ట్రిక్ వాహనాలు

    కూరగాయలు

    పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో దేశంలోనే 5వ స్థానంలో ఆంధ్రప్రదేశ్  ఆంధ్రప్రదేశ్

    బెంగళూరు

    ఆసియాలోనే అతిపెద్ద 'ఏరో ఇండియా షో'- నేడు బెంగళూరులో ప్రారంభించనున్న ప్రధాని మోదీ కర్ణాటక
    2024-25 నాటికి 5 బిలియన్ డాలర్ల రక్షణ ఎగుమతులే లక్ష్యం: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    భారతీయ సోషల్ మీడియా యాప్ స్లిక్ మైనర్ల యూజర్ డేటాను బహిర్గతం చేసింది టెక్నాలజీ
    HLFT-42 యుద్ధ విమానంపై హనుమతుడి బొమ్మ తొలగింపు యుద్ధ విమానాలు

    తాజా వార్తలు

    అమెరికా కాంగ్రెస్‌లో ప్రధాని మోదీ చారిత్రక ప్రసంగం హైలెట్స్ ఇవే నరేంద్ర మోదీ
    పాట్నలో ప్రతిపక్ష నేతల సమావేశం; ఏకాభిప్రాయం కుదిరేనా? పాట్న
    అసోంలో వరదల బీభత్సం; 22 జిల్లాలు జలమయం; ఒకరు మృతి అస్సాం/అసోం
    జమ్ముకశ్మీర్: కుప్వారాలో ఎన్‌కౌంటర్; నలుగురు ఉగ్రవాదులు హతం జమ్ముకశ్మీర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025